రాష్ట్రప‌తి స‌చివాల‌యం

మిలాదున్న‌బిని పుర‌స్క‌రించుకుని శుభాకాంక్ష‌లు తెలిపిన రాష్ట్రప‌తి

Posted On: 29 OCT 2020 4:36PM by PIB Hyderabad

మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త జ‌న్మ‌దిన‌మైన మిలాదున్న‌బి సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని భార‌త రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ సందేశాన్ని, శుభాకాంక్ష‌ల‌ను దేశ ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేశారు. 
ఈద్‌-ఇ- మిలాద్ లేక మిలాదున్న‌బిగా మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త జ‌న్మ‌దినాన్ని జ‌రుపుకుంటున్న దేశ ప్ర‌జ‌ల‌కు, ముఖ్యంగా ముస్లిం సోద‌రీ సోద‌రుల‌కు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తున్నాను. 
మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త ప్రేమ‌, సౌభ్రాతృత్వ సందేశ‌మిచ్చి, ప్ర‌పంచాన్ని మాన‌వీయ ప‌థంలో న‌డిపించారు. ఆయ‌న స‌మాన‌త్వం, సామ‌ర‌స్యం ఆధారంగా నిర్మించాల‌ని భావించారు. 
ప‌విత్ర ఖురాన్ సంక‌ల‌నం చేసిన మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త బోధ‌ల ప్ర‌కారం మ‌నంద‌రం స‌మాజ సంక్షేమం కోసం, దేశంలో శాంతి, సామర‌స్యం కోసం ప‌ని చేద్దాం. 

***



(Release ID: 1668695) Visitor Counter : 136