ప్రధాన మంత్రి కార్యాలయం

కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతం మరియు వరద పరిస్థితులపై కర్ణాటక ముఖ్యమంత్రితో సంభాషించిన - ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 16 OCT 2020 8:52PM by PIB Hyderabad

కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతం, వరద పరిస్థితులపై, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బి.ఎస్. యడియూరప్పతో సంభాషించారు.

"కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతం మరియు వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి బి.ఎస్. యడియూరప్ప గారితో మాట్లాడాను. వరదలతో బాధపడుతున్న మా కర్ణాటక సోదర, సోదరీమణులకు మా సంఘీభావం తెలుపుతున్నాము. రక్షణ మరియు సహాయక చర్యలలో కేంద్రం నుండి సాధ్యమైనంత పూర్తి సహాయం అందజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.", అని ప్రధానమంత్రి తెలియజేశారు. 

*****


(రిలీజ్ ఐడి: 1665366) సందర్శకుల సూచీ సంఖ్య : : 169