మంత్రిమండలి

సామర్థ్యం పెంపు, పరిశోధన&అభివృద్ధి, స్థిరమైన భూగర్భ జల నిర్వహణ అంశాల్లో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య సహకారం కోసం కుదిరిన ఎంవోయూకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

Posted On: 14 OCT 2020 4:53PM by PIB Hyderabad

'కేంద్ర జల వనరులు, నదుల అభివృద్ధి, గంగ పునరుద్ధరణ విభాగా'నికి చెందిన 'కేంద్ర భూగర్భ జల బోర్డు'కు (సీజీడబ్లూబీ), ఆస్ట్రేలియాకు చెందిన 'మేనేజింగ్‌ ఆక్విఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ సస్టెయినింగ్‌ గ్రౌండ్‌వాటర్‌ యూజ్‌ త్రూ విలేజ్‌-లెవెల్‌ ఇంటర్వెన్షన్‌' (మార్వి) పార్ట్‌నర్స్‌కు మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం వివరాలు, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గానికి అందాయి. గతేడాది అక్టోబర్‌లో, ఆస్ట్రేలియాలో ఈ ఎంవోయూ కుదిరింది.

    వ్యవసాయం, పట్టణ, పారిశ్రామిక, పర్యావరణ అవసరాలకు జల భద్రత సాధించేలా; ఉపరితల, భూగర్భజల శిక్షణ, విద్య, పరిశోధనలో సహకారాన్ని ప్రోత్సహించడం ఈ ఎంవోయూ ఉద్దేశం.

***



(Release ID: 1664402) Visitor Counter : 131