ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

ఉపరాష్ట్రపతికి కోవిడ్ -19 పరీక్షలో నెగటివ్ వచ్చింది; త్వరలో ఆయన తన సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించనున్నారు.

Posted On: 12 OCT 2020 4:57PM by PIB Hyderabad

ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.  వెంకయ్యనాయుడు గారికి ఈ రోజు కోవిడ్-19 పరీక్షలో నెగటివ్ వచ్చింది.  కోవిడ్-19 పరీక్షలో పోజిటివ్ గా గుర్తించిన,  2020 సెప్టెంబర్,  29వ తేదీ నుండీ ఆయన ఇంట్లో క్వారంటైన్ లో ఉన్నారు. 

ఎయిమ్స్ కు చెందిన వైద్య బృందం ఈ రోజు నిర్వహించిన ఆర్.టి-పి.సి.ఆర్. పరీక్షలో, ఉపరాష్ట్రపతి మరియు ఆయన సతీమణి శ్రీమతి ఉషా నాయుడు కోవిడ్-19 నెగటివ్ గా నిర్ధారణ అయ్యింది. 

శ్రీ నాయుడు గారి ఆరోగ్యం మంచిగా ఉందనీ, వైద్యుల సలహా మేరకు త్వరలో ఆయన తమ సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తారనీ భావిస్తున్నారు.  తమ శ్రేయస్సు కోసం ప్రార్థించిన వారందరికీ ఉపరాష్ట్రపతి కృతజ్ఞతలు తెలిపారు.

*****



(Release ID: 1663876) Visitor Counter : 161