ప్రధాన మంత్రి కార్యాలయం

జస్టిస్ ఎ.ఎస్. దవే కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 05 OCT 2020 6:17PM by PIB Hyderabad

పూర్వ న్యాయమూర్తి, గుజరాత్ ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎస్. దవే కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

పూర్వ న్యాయమూర్తి, గుజరాత్ ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక న్యాయమూర్తి కూడా అయిన జస్టిస్ ఎ.ఎస్. దవే మృతి నన్ను వేదనకు గురి చేసింది. న్యాయ రంగానికి ఆయన అందించిన సేవలకు గాను ఆయనను స్మరించుకొంటూ ఉంటాం. ఆయన కుటుంబానికి, ఆయన మిత్రులకు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి’’ అని ప్రధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.

 

***



(Release ID: 1661853) Visitor Counter : 132