భారత ఎన్నికల సంఘం

ఎంపీ శరద్ పవార్‌కు ఐటీ నోటీసు ఇవ్వమని ఈసీఐ నుంచి సీబీడీటీకి ఎలాంటి ఆదేశం రాలేదు

Posted On: 23 SEP 2020 11:22AM by PIB Hyderabad

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, పార్లమెంటు సభ్యుడు శరద్‌ పవార్‌కు ఆదాయ పన్ను శాఖ నోటీసు ఇచ్చిందని మీడియాలోని కొన్ని వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

    ఈ నేపథ్యంలో, శరద్‌ పవార్‌కు నోటీసు ఇమ్మని  భారత ఎన్నికల సంఘం నుంచి సీబీడీటీకి ఎలాంటి నిర్దేశం రాలేదని స్పష్టీకరించడమైనది.

***



(Release ID: 1658163) Visitor Counter : 117