ప్రధాన మంత్రి కార్యాలయం

మహారాష్ట్ర లోని భివండీ లో భవనం కూలిపోయి ప్రాణనష్టం జరగడం పట్ల బాధను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి  

నాడు పోస్టు చేయడమైనది: 21 SEP 2020 10:57AM by PIB Hyderabad

మహారాష్ట్ర లోని భివండీ లో భవనం కూలిపోయి ప్రాణనష్టం జరగడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బాధ ను వ్యక్తం చేశారు.

‘‘మహారాష్ట్ర లోని భివండీ లో భవనం కూలిన ఘటన బాధ కలిగించింది.  ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే సంతాపం.  ఈ ఘటన లో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.  రక్షణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.  బాధితుల కు అన్ని రకాలుగా సహాయాన్ని అందించడం జరుగుతోంది’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
 


 

***


(రిలీజ్ ఐడి: 1657159) సందర్శకుల సూచీ సంఖ్య : : 228