రాష్ట్రప‌తి స‌చివాల‌యం

భరతమాత మణి కిరీటం జమ్మూ కాశ్మీర్‌ను భూ తల స్వర్గం (ఫిరదౌస్) గా మార్చడానికి ప్రయత్నిద్దాం: రాష్ట్రపతి కోవింద్

జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌ఇపి అమలుపై ప్రసంగించిన రాష్ట్రపతి

प्रविष्टि तिथि: 20 SEP 2020 1:17PM by PIB Hyderabad

జమ్మూ కశ్మీర్ విజ్ఞాన కేంద్రంగా, ఆవిష్కరణ మరియు నైపుణ్య అభివృద్ధి కేంద్రంగా ఎదగడం నా కల అని భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ జమ్మూ కశ్మీర్‌లో జాతీయ విద్యా విధానం అమలుపై జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ అన్నారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, అక్కడి విశ్వవిద్యాలయాల వైస్-ఛాన్సలర్లు, కళాశాలల ప్రిన్సిపాళ్లతో పాటు శ్రీనగర్‌లోని ఇందుకు సంబంధించిన ఇతర భాగస్వాములు ఈ రోజు (సెప్టెంబర్ 20, 2020) హాజరైన వీడియో సందేశం ద్వారా రాష్ట్రపతి ప్రసంగించారు.

ఈ ప్రాంతం విజ్ఞానవంతులు, పండితుల సాధనలను అభినందిస్తూ, స్వర్గసమానమైన ఈ ప్రాంతాన్ని విజ్ఞాన, ఆవిష్కరణ, అభ్యాస కేంద్రంగా మార్చడానికి నిశ్చయమైన ప్రయత్నాలు జరగాలని రాష్ట్రపతి అన్నారు. ఆకర్షణీయమైన ద్విపద నుండి ప్రేరణ పొంది, ఈ దశలు మధ్యయుగ యుగంలో సూచించినట్లుగా, జమ్మూ కాశ్మీర్‌ను మరోసారి “భూమిపై ఫిర్దాస్, భరతమాత  మకుటంపై తేజోవంతమైన ఆభరణంగా' చేస్తాయని అన్నారు.

జమ్మూ కాశ్మీర్ తరతరాలుగా వస్తున్న విద్యా రంగంలో గొప్ప వారసత్వం గురించి రాష్ట్రపతి శ్రీ కోవింద్ మాట్లాడుతూ, ఇది ప్రాచీన కాలం నుండి సాహిత్యం, అభ్యాస కేంద్రంగా ఉందని అన్నారు. కాశ్మీర్‌లో ప్రాచుర్యం పొందిన కల్హణ రాజ్‌తరంగిణి, మహాయాన బౌద్ధమతం గురించి ఉదహరిస్తూ, వాటిని పరిగణనలోకి తీసుకోకపోతే భారతదేశ సాంస్కృతిక సంప్రదాయాల చరిత్ర అసంపూర్ణంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎన్‌ఇపి ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తూ, భారతదేశానికి అపూర్వమైన జనసంఖ్య ఉందని, అయితే జనాభాలో గణనీయమైన విభాగాన్ని కలిగి ఉన్న యువకులు నైపుణ్యం, వృత్తిపరంగా సమర్థులు  అన్నింటికంటే నిజమైన అర్థంలో విద్యావంతులుగా మారితేనే అది సానుకూలంగా మరగలదని అన్నారు. జమ్మూ కాశ్మీర్ పిల్లలపై విశ్వాసం చూపిస్తూ, జమ్మూ కాశ్మీర్ చాలా తెలివైన, ప్రతిభావంతులైన, వినూత్నమైన పిల్లల సంపద అని అన్నారు. విద్యా విధానం అమలు చేస్తే చురుకైన మేధస్సుతో కూడిన విద్యార్థులను అందిస్తుందని  ఆయన అన్నారు.

విలువ ఆధారిత విద్య గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ, రాష్ట్రపతి శ్రీ కోవింద్ 'మన సంప్రదాయాన్ని, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, అది మన మాతృభాషలో మాత్రమే సాధ్యం. మాతృభాష మన దేశ సాంస్కృతిక నీతికి కట్టుబడి ఉన్నందున కొత్త విద్యా విధానంలో ప్రోత్సహించబడుతోంది. ఈ విధానంలో పేర్కొన్న త్రి భాషా సూత్రం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని, బహుభాషావాదంతో పాటు జాతీయ ఐక్యతను ప్రోత్సహించగలదని, అయితే అదే సమయంలో ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంపై భాషను రుద్దడం ఉండదు' అని అన్నారు. విద్యలో ప్రాప్యత, సమానత్వం, స్థోమత, జవాబుదారీతనం, నాణ్యతను నిర్ధారించడం మరియు నైపుణ్యం అభివృద్ధి, అనుభవ-ఆధారిత అభ్యాసం, తార్కిక ఆలోచనలను ప్రోత్సహించడంపై విధానం దృష్టి పెడుతుంది. ఆత్మనిర్భర్ భారత్ సూత్రాన్ని నొక్కిచెప్పిన ఆయన, ఎన్‌ఇపి 2020 లో అనుకరించిన వృత్తి విద్య ఈ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుందని అన్నారు. ఈ విధానం, లక్ష్యాలను నెరవేర్చడానికి జమ్మూ కాశ్మీర్ యువతకు రాష్ట్రపతి తన శుభాకాంక్షలు తెలిపారు. 

రాష్రపతి ప్రసంగం ఈ లింక్ లో ఉంటింది: 


(रिलीज़ आईडी: 1657148) आगंतुक पटल : 231
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Tamil , Malayalam