ప్రధాన మంత్రి కార్యాలయం

కేశవానంద భారతి కన్నుమూత పట్ల విచారాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి; సమాజ సేవకు ఆయన తన వంతుగా అందించిన సహాయాన్ని స్మరించుకొన్న ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 06 SEP 2020 3:56PM by PIB Hyderabad

కేశవానంద భారతి జీ కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు.

‘‘సమాజానికి సేవ చేయడంలో, అణగారిన వర్గాల వారికి సాధికారతను కల్పించడం లో పూజ్య కేశవానంద భారతి జీ  అందించిన సహాయాన్ని మనం ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకొంటాం.  ఆయనకు భారతదేశ సుసంపన్న సంస్కృతి తో, మన విశిష్ట రాజ్యాంగంతో ప్రగాఢ అనుబంధం ఉండేది.  భావి తరాలకు సైతం ఆయన ప్రేరణను అందిస్తూనే ఉంటారు.  ఓమ్ శాంతి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. 

***


(రిలీజ్ ఐడి: 1651843) సందర్శకుల సూచీ సంఖ్య : : 196