హోం మంత్రిత్వ శాఖ

సెప్టెంబర్ 15 వరకు 'పద్మ అవార్డులు-2021'‌ల‌ నామినేషన్ల‌ స్వీక‌ర‌ణ‌

Posted On: 28 AUG 2020 6:13PM by PIB Hyderabad

2021 రిపబ్లిక్‌డే సందర్భంగా ప్రకటించాల్సిన వివిధ పద్మ అవార్డుల ఆన్‌లైన్ నామినేషన్లు/ సిఫార్సుల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ‌ ఈ ఏడాది మే 1వ తేదీ మొద‌లైంది. పద్మ అవార్డులకు నామినేషన్ల‌ను సెప్టెంబర్ 15వ తేదీ వ‌ర‌కు స్వీక‌రించ నున్నారు. ఆన్‌లైన్‌లో పద్మ అవార్డ్స్ పోర్టల్ https://padmaawards.gov.in లో వీటిని స్వీకరిస్తారు. పోర్టల్‌లో ఇప్పటికే 8035 రిజిస్ట్రేషన్లు జరిగాయి. దాదాపు 6361 నామినేషన్లు / సిఫార్సులు పూర్తయ్యాయి. పద్మ అవార్డులుగా పిలవ‌బ‌డే పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పుర‌స్కారాలు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటిగా నిలుస్తున్నాయి. 1954 లో ప్రారంభించ‌బ‌డిన ఈ అవార్డులను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటిస్తుంది. ఈ అవార్డుల్ని ఆయా రంగాల‌లో విశిష్టమైన ప‌నితీరు క‌న‌బ‌రిచిన వారికి గుర్తింపుగా అందిస్తారు. క‌ళ‌లు, సాహిత్యం మ‌రియు విద్య‌, క్రీడ‌లు, వైద్యం, సామాజిక సేవ‌, సాంకేతిక అండ్ ఇంజినీరింగ్, ప్ర‌జా వ్య‌వ‌హారాల‌, ప్ర‌జాసేవ, వాణిజ్యం మరియు పరిశ్రమ మొదలైన రంగాలలో/ విభాగాలలో విశిష్టమైన మరియు అసాధారణ విజయాలు/ సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులు అందిస్తారు. జాతి, వృత్తి, స్థానం లేదా లింగ భేదంగానీ లేకుండా వ్యక్తులందరూ ఈ అవార్డులకు అర్హులే. వైద్యులు, శాస్త్ర వేత్తలు మినహా పీఎస్‌యూలలో పనిచేసే వారితో సహా ప్రభుత్వ ఉద్యోగులు పద్మ అవార్డులకు అర్హులు కాదు. పద్మ అవార్డులను “పీపుల్స్ పద్మ” గా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకు గాను‌ పౌరులు త‌మ స్వీయ నామినేషన్తో సహా అర్హులైన వారి నామినేష‌న్ల‌ను త‌గిన వివ‌రాల‌తో ఈ అవార్డుల‌కు సిఫార‌సు చేయాలని కేంద్రం అభ్య‌ర్థిస్తోంది. ప‌ద్మ అవార్డు పోర్ట‌ల్‌లో పేర్కొన్న ఫార్మాట్‌లో నామినేషన్లు / సిఫారసులలో పైన పేర్కొన్న సంబంధిత అన్ని వివరాలు త‌ప్ప‌క‌ ఉండాలి. దీనికి తోడు సంబంధిత రంగం / విభాగంలో ప‌ద్మ అవార్డుకు ద‌ర‌ఖాస్తు చేసే వ్యక్తి యొక్క విశిష్టమైన మరియు అసాధారణమైన విజయాల‌ను / సేవలను గురించి స్పష్టంగా తెలుపుతూ కథన రూపంలో (గరిష్టంగా 800 పదాలు) ఒక వివ‌ర‌ణాత్మ‌క ఉల్లేఖనంతో సహా సిఫారసు ద‌ర‌ఖాస్తు లేదు సిఫార‌సు చేయాల్సి ఉంటుంది. ప‌ద్మ‌ అవార్డుల‌కు ప్రతిభావంతులైన వ్యక్తులను గుర్తించడానికి సమిష్టి ప్రయత్నాలు చేయాల‌ని హోం మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలు, రాష్ట్రాలు / యూటీ ప్రభుత్వాలు, భరత్ రత్న మరియు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల‌ను అభ్యర్థించింది. మ‌న సమాజంలోని బలహీన వర్గాలు, ఎస్సీలు & ఎస్టీలు, దివ్యంగ్ వ్యక్తులు మరియు సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న వ్యక్తుల‌ను గుర్తించి అవార్డుల‌కు సిఫార‌సు చేయాల‌ని కోరింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు హోం మంత్రిత్వ శాఖ (www.mha.gov.in) వెబ్‌సైట్‌లో 'అవార్డులు, పతకాలు' శీర్షికన‌ లభిస్తాయి. ఈ అవార్డులకు సంబంధించిన విధానాలు మరియు నియమాలు ఈ కింది వెబ్‌సైట్‌ లింక్ నందు అందుబాటులో ఉన్నాయి.

https://padmaawards.gov.in/AboutAwards.aspx . 

***



(Release ID: 1649393) Visitor Counter : 204