హోం మంత్రిత్వ శాఖ
స్వదేశీ పరిజ్ఞానంతో వృద్ధి చేసిన 700 మెగావాట్ల కాక్రాపార్ అణు విద్యుత్ ప్లాంట్-3 'క్రిటికాలిటీ' సాధించడంపై శాస్త్రవేత్తలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందన
ఈ తారస్థాయి విజయంపై యావత్ భారతదేశం శాస్త్రవేత్తలకు వందనం చేస్తోందన్న కేంద్ర హోంమంత్రి
ప్రధాని మోదీ ఆశయమైన ఆత్మనిర్భర్ భారత్ను నిజం చేసేందుకు, ఆయన నేతృత్వంలో కొత్త భారతదేశం ముందుకు సాగుతోందన్న అమిత్ షా
Posted On:
22 JUL 2020 2:04PM by PIB Hyderabad
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వృద్ధి చేసిన, గుజరాత్లోని 700 మెగావాట్ల కాక్రాపార్ అణు విద్యుత్ ప్లాంట్-3, అత్యంత కీలకమైన 'క్రిటికాలిటీ'ని సాధించడంపై శాస్త్రవేత్తలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. “భారతదేశ అణు చరిత్రలో ఈ రోజు మహోన్నతమైన రోజు. ఈ తారస్థాయి విజయంపై యావత్ భారతదేశం మన శాస్త్రవేత్తలకు నమస్కరిస్తోంది” అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ ఆశయమైన ఆత్మనిర్భర్ భారత్ను నిజం చేసేందుకు, ఆయన నేతృత్వంలో కొత్త భారతదేశం ముందుకు సాగుతోందని అమిత్ షా తెలిపారు.
(Release ID: 1640441)
Visitor Counter : 159
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam