ప్రధాన మంత్రి కార్యాలయం

కేదార్ నాథ్ ధామ్ లో అభివృద్ధి పనుల ను సమీక్షించిన ప్రధాన మంత్రి

Posted On: 15 JUL 2020 2:17PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేదార్ నాథ్ ధామ్ లో అభివృద్ధి పనుల ను మరియు ధామ్ యొక్క దివ్యత్వాన్ని మరింత గా పెంపొందింపచేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల ను ఈ రోజు న సమీక్షించారు.   

కేదార్ నాథ్ దేవాలయం యొక్క దివ్యత్వాన్ని మరియు జగద్గురు ఆది శంకరాచార్యుల వారి సమాధి స్థలం యొక్క దివ్యత్వాన్ని మరింత పెంచడం మరియు పరిసరాల లో స్వచ్ఛత ను పరిరక్షించడం, ఇంకా వాటిని పెద్ద ఎత్తున అభివృద్ధి పరచేందుకు పూచీపడడం పట్ల ప్రధానం గా చర్చ లు జరిగాయి.  గౌరీకుండ్- కేదార్ నాథ్ మార్గం లో ప్రయాణికులు అన్ని సదుపాయాల కు నోచుకొనేటట్లు చూడాలని, ఈ తీర్థం యొక్క చారిత్రిక ప్రాధాన్యాన్ని మరియు సాంస్కృతిక ప్రముఖత్వాన్ని సాంకేతిక విజ్ఞానం సహాయం తో కళ్లకు కట్టేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా సమీక్ష సందర్భం గా శ్రద్ధ తీసుకోవడమైంది.
 

***



(Release ID: 1638791) Visitor Counter : 195