రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

హల్వారా ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌ను సంద‌ర్శించిన ఏఓసీ-ఇన్‌-సీ ఎయిర్ మార్షల్ సురేష్

Posted On: 03 JUN 2020 3:16PM by PIB Hyderabad

వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కు చెందిన‌ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-ఎయిర్, ఎయిర్ మార్షల్ బి సురేష్ బుధ‌వారం (జూన్ 03 న) హల్వారా ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌ను సందర్శించారు. హ‌ల్వారా

 


ఎయిర్‌ఫోర్స్ స్టేష‌న్ ఎయిర్ ఆఫీస‌ర్ క‌మాండిగ్, ఎయిర్ క‌మాండ్‌ర్ అయిన ఎ. భ్ర‌దా ఏఓసీ-ఇన్‌-సీ కి త‌గు విధంగా స్వాగతం ప‌లికారు. తన ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఏఓసీ-ఇన్‌-సీ హ‌ల్వారా బేస్ యొక్క ముఖ్యమైన సంస్థాపనలను పరిశీలించారు. దీనికి తోడు హల్వారా బేస్‌ కార్యాచరణ సంసిద్ధతను గురించి తెలుసుకొని సామ‌ర్థ్య‌త‌ల‌ను అంచ‌నా క‌ట్టారు. దేశంలో కోవిడ్‌-19 వైర‌స్ మ‌హ‌మ్మారి వ్యాప్తి ప్ర‌బలంగా ఉన్న నేప‌థ్యంలో బేస్‌లో తీసుకుంటున్న ప‌లు ముంద‌స్తు ర‌క్షణ‌ చర్యలను ఆయన త‌న‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సమీక్షించారు. ప్ర‌స్తుతం కోవిడ్-19 మహమ్మారి ముప్పుతో పాటుగా భద్రతా ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నామని ఏఓసీ-ఇన్‌-సీ పునరుద్ఘాటించారు. ఈ సవాళ్ల‌తో కూడుకున్న సమయాల్లో శ్రద్ధగా త‌గు ప్రణాళిక మరియు వనరులను ఉపయోగించడం ద్వారా కార్యాచరణ సామర్థ్యాన్ని నిర్ధారించాల్సిన ప్రాముఖ్యతను గురించి ఆయ‌న ఈ సంద‌ర్భంగా నొక్కి చెప్పారు. ఈ ఎయిర్ స్టేష‌న్‌లో అన్ని ర‌కాల‌ సిబ్బంది విధి పట్ల ప్ర‌ద‌ర్శించిన అద్భుత‌మైన ప్రమేయం, నిబద్ధతను ఏఓసీ-ఇన్‌-సీ ప్రశంసించారు. ప్రస్తుత భద్రతా పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని మరియు అప్రమత్తంగా మెద‌లాలని ఆయ‌న వారికి సూచించారు.

 



(Release ID: 1629174) Visitor Counter : 150