ప్రధాన మంత్రి కార్యాలయం

పాకిస్తాన్ లో విమాన దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 22 MAY 2020 7:05PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పాకిస్తాన్ లో జరిగిన ఓ విమాన దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.

‘‘పాకిస్తాన్ లో ఓ విమాన దుర్ఘటన జరిగి, ప్రాణనష్టం వాటిల్లడం తీవ్ర దు:ఖానికి లోను చేసింది.  మృతుల కుటుంబాల కు ఇదే మా సంతాపం; ఈ దుర్ఘటన లో గాయపడిన వారు త్వరిత గతి న కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1626237) Visitor Counter : 168