రక్షణ మంత్రిత్వ శాఖ
ఓపీ సముద్రసేతు రెండో దశ - 588 భారతీయులను మాల్దీవుల నుండి భారత్ కు తీసుకొచ్చిన ఐఎన్ఎస్ జలాశ్వ
प्रविष्टि तिथि:
17 MAY 2020 4:14PM by PIB Hyderabad
సముద్ర సేతు ఆపరేషన్ లో భాగంగా మోహరించిన ఐఎన్ఎస్ జలాశ్వ మాలె, మాల్దీవుల నుండి రెండో విడత ప్రయాణం పూర్తి చేసి భారతీయులను వెనక్కి తీసుకొచ్చింది. కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ సముద్రికా క్రూయిస్ టెర్మినల్ వద్ద 70 మంది మహిళలు (06 గురు గర్భిణీలు), 21 మంది పిల్లలతో సహా 588 మంది భారతీయ పౌరులను ఓడ చేర్చింది.
D83G.jpeg)
ఐఎన్ఎస్ జలాశ్వ ఉదయం 11:30 గంటలకు కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ వద్ద తీరాన్ని చేరుకున్న వెంటనే భారత నావికాదళం, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా పరిపాలన, పోర్ట్ ట్రస్ట్ సిబ్బంది ఆహ్వానం పలికారు. కోవిడ్ స్క్రీనింగ్, ఇమ్మిగ్రేషన్ విధానాలను క్రమబద్ధీకరించడానికి పోర్ట్ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు, అలాగే స్థానిక యంత్రాంగం, తరలించిన భారతీయ పౌరులను క్వారంటైన్ కి సంబంధిత జిల్లాలకు / రాష్ట్రాలకు రవాణా చేయడానికి ఏర్పాట్లు చేశారు.
భారతీయ పౌరులను విదేశీ తీర మార్గం నుండి తిరిగి వచ్చేలా చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మే 15 న ఐఎన్ఎస్ జలాశ్వ భారత పౌరులను మాలె వద్ద ప్రారంభించారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఓడ బయలుదేరడం ఆలస్యం అయ్యింది, ఓడ మే 16 న మాలె నుండి బయలుదేరింది.
************
(रिलीज़ आईडी: 1624731)
आगंतुक पटल : 266
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam