ఆర్థిక సంఘం

23-24 ఏప్రిల్, 2020న సమావేశం కానున్న 15వ ఆర్థిక సంఘం సలహా మండలి

Posted On: 20 APR 2020 7:08PM by PIB Hyderabad

15వ ఆర్థిక సంఘం సలహా మండలి  23-24 ఏప్రిల్ 2020న సమావేశం కానుంది.  ఆన్లైన్లో నిర్వహించనున్న ఈ సమావేశానికి 15వ ఆర్థిక సంఘం  అధ్యక్షులు శ్రీ ఎన్.కె. సింగ్ అధ్యక్షత వహించనున్నారు, ఈ సమావేశంలో  సంఘం సభ్యులందరూ మరియు ఆర్థిక సంఘానికి చెందిన ఉన్నతాధికారులందరూ  పాల్గొననున్నారు. సలహా మండలి సభ్యులు డా. కృష్ణమూర్తి సుబ్రమణియన్, డా.సాజిద్ జడ్ షినోయ్, డా. ప్రాచి మిశ్రా, శ్రీ నీలకాంత్ మిశ్రా మరియు డా. ఓంకార్ గోస్వామితో కలసిన 5గురు సభ్యుల బృందం 23 ఏప్రిల్ 2020న సమావేశానికి హాజరు కానున్నారు. 24 ఏప్రిల్ 2020న మండలి మిగతా సభ్యులతో  మిగతా సమావేశం జరుగనుంది.

 సలహా సంఘం సమావేశపు ఎజెండా ఈ విధంగా ఉండనుంది:

·         2020-2021 మరియు 2021-2022 సంవత్సరాల్లో జిడిపి వృద్ది పై  కొవిడ్-19 మహమ్మారి  ప్రభావం. వివిధ సూక్ష్మరంగాల్లో అనిశ్చితి.

·         ప్రస్తుత మరియు రానున్న సంవత్సరంలో పన్ను ఉత్ప్లవనం మరియు ఆదాయంపై సంభావనీయ ప్రతిపాదనలు.

·           ఆర్థిక పరిస్థితిని గట్టెంక్కించుటకు  ప్రోత్సాహకమైన/నియంత్రిత ప్రజా వ్యయము  కొరకు తీసుకోవలసిన చర్యలు.



(Release ID: 1616512) Visitor Counter : 132