శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

నావెల్ కరోనా వైరస్ నియంత్రణ కోసం క్రియారహిత వైరస్ వ్యాక్సిన్ మీద దృష్టి పెట్టిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సి.సి.ఎం.బి) పరిశోధకులు

Posted On: 16 APR 2020 6:45PM by PIB Hyderabad

ప్రపంచాన్న గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నియంత్రణ కోసం సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సి.సి.ఎం.బి) పరిశోధకులు  క్రియారహిత వైరస్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసేందుకు సిద్ధమయ్యారు. క్రియారహితమైన టీకాలు భద్రతతో పాటు సులభమైన ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి. ఈ వైరస్ ను నియంత్రించేందుకు టీకాలు వేయడం అత్యంత ప్రభావవంతమైన మార్గమనే ఆలోచనలో పరిశోధకులు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్థలు వ్యాక్సిన్ ను కనుగొనే దిశగా కృషి చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న 42 మందికి పైగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది.

ఈ పద్ధతిలో వైరస్ అభివృద్ది చేయబడి, వివిధ మార్గాల్లో చంపబడుతుంది. వ్యాధికారక వైరస్ ను చంపినా లేదా దాని పునరుత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోయేలా చేసినా, వైరస్ వివిధ భాగాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. అంటే ఇది కణాలలోకి ప్రవేశించే స్పైక్ ప్రొటీన్ లేదా రోగ నిరోధక వ్యవస్థ గుర్తించే యాంటిజెన్ (రసాయన నిర్మాణం)కు ఏ మాత్రం తీసిపోదు. ఈ క్రియా రహితమైన సూక్ష్మ జీవులను శరీరంలో ప్రవేశపెట్టినప్పుడు, రోగనిరోధక వ్యవస్థ నిర్దిష్ట యాంటిజెన్ లకు వ్యతిరేకంగా ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడం ద్వారా ఒక వేళ క్రిమి శరీరంలోకి ప్రవేశించినా భవిష్యత్ కోసం సిద్ధం గా ఉంటుంది. క్రియా రహితంగా తయారు చేసిన పోలియో వ్యాక్సిన్ మరియు రాబిస్ వ్యాక్సిన్లు ఈ విధంగానే తయారు చేస్తారు.

వ్యాధికారక క్రిమి క్రియారహితం కావడం వల్ల ఇది తేలికపాటి వ్యాధిని కూడా పునరుత్పత్తి చేయలేదు. అందు వల్ల తక్కువ రోగ నిరోధక శక్తి లేదా ఇతర అనారోగ్యాలు ఉన్న వారికి కూడా ఇది ఇవ్వడం చాలా సురక్షితం.

ఈ అంశం గురించి సి.సి.ఎం.బి. డైరక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా ఇండియా సైన్స్ వైర్ తో మాట్లాడుతూ, తాము పెద్ద మొత్తంలో వైరస్ ను తయారు చేసి, దాన్ని క్రియారహితం చేయగలిగితే, అది వ్యాక్సిన్ గా ఇంజెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుందని, ఆ సమయంలో వైరస్ చురుగ్గా ఉండకపోయినా, మానవ శరీరం వైరస్ ప్రొటీన్లను గుర్తించి, దానికి వ్యతిరేకంగా ప్రతిరోధకాలను తయారు చేయడం ప్రారంభించడం వల్ల, ఇది క్రియారహిత వైరస్ వ్యాక్సిన్ గా పని చేస్తుందని తెలిపారు. వైరస్ సెల్ కల్చర్ ఆధారిత ఉత్పత్తి అమల్లోకి వచ్చిన తర్వాత, దాన్ని పరిశ్రమ భాగస్వామికి అప్పగిస్తామని ఆయన తెలిపారు.

మానవ శరీరంలో కాకుండా, బయటి వైపు వైరస్ ఉత్పత్తి సాంకేతిక సవాలు. కరోనా వైరస్ మానవ కణాలపై, ముఖ్యంగా క్రియాశీల ఎ.సి.ఈ.2 గ్రాహకాలతో ఉన్న కణాలతో, అభివృద్ధి చెందింది కాబట్టి మానవ శరీరానికి వెలుపల, దీని సరైన మూలాన్ని గుర్తించడం సాంకేతికతకు అత్యంత కీలకం. సి.సి.ఎం.బి. పెట్రీ డిష్ లో పెరిగిన ఆఫ్రికన్ గ్రీన్ మంకీ నుంచి ఎపిథీలియల్ సెల్ లైన్ ను కృత్రిమంగా తయారు చేయడానికి మరియు ఘోరమైన వైరస్ ను ఆపడానికి ఉపోయగిస్తున్నారు. దీని కోసం మరి కొన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు.  నేపథ్యంలో అనేక ఇతర సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. దీని గురించి డాక్టర్ మిశ్రా మాట్లాడుతూ, తాము వైరస్ ఆశ్రయించే కొన్ని కణాలను తయారు చేస్తున్నామని, ఫలితంగా ఇన్ విట్రో వ్యవస్థను తయారు చేయగలమని, సామర్థ్యం తనిఖీకి ఇది ఆస్కారం ఇస్తుందని తెలిపారు. ఫలితంగా నావల్ కరోనా వైరస్ క్రియారహితం చేయడం సమస్యలేవీ లేకుండా సరైన మార్గంలో అవుతుందన్నారు.

నావల్ కరోనా వైరస్ కోసం సరైన సెల్ కల్చర్ టెక్నాలజీని కనుగొనడం కూడా ఔషధ అభివృద్ధికి సహాయపడుతుంది. ఒక వైరస్ కణాలకు సోకిన తర్వాత, సంభావ్య అభ్యర్థిని పరీక్షించవచ్చు. ఈ వైరస్ కణాలకు సోకితే, 2 నుంచి 3 రోజుల తర్వాత కణాలు చనిపోయి, చాలా వైరస్ ఉత్పత్తి అవుతుందని, అయినప్పటికీ సంభావ్య ఔషదాన్ని ఇవ్వడం ద్వారా కణం చనిపోకుండా వైరస్ ప్రతి రూపాన్ని ఆపుతుందని ఆయ వివరించారు. ఈ విధంగా ఒక నిర్ధిష్ట ఔషధం యాంటీ వైరల్ లాగా ప్రభావితంగా ఉందో లేదో గమనించవచ్చని తెలిపారు.

అంతే కాకుండా సి.సి.ఎం.బి. సైతం నమూనాల్లో పూల్ చేయనుంది. వైరస్ సంక్రమణకు గురైన పెద్ద సంఖ్యలో అనుమానితులను పరీక్షించేందుకు ఉన్న సౌకర్యాలను వినియోగించుకోనుంది.



(Release ID: 1615173) Visitor Counter : 227