రైల్వే మంత్రిత్వ శాఖ

సత్వర ఫలితాలతో సంచలనం: భారతీయ రైల్వేల

కొత్త కేంద్రీయ నియంత్రణ విభాగం
లాక్ డౌన్ మొదటి 10 రోజుల్లో 138 & 139 హెల్ప్ లైన్ నంబర్లకు, సామాజిక మాధ్యమానికి & ఈ మెయిలుకు వచ్చిన 1,25,000 ప్రశ్నలకు బదులిచ్చిన రైల్వే సిబ్బంది
87% ప్రశ్నలకు (1,09,000కు పైగా) సిబ్బంది నేరుగా ఫోన్ లో మాట్లాడి సమాధానం ఇచ్చారు
24x7 నిరంతరం పనిచేస్తూ 138 & 139 హెల్ప్ లైన్ నంబర్లకు, సామాజిక మాధ్యమానికి & ఈ మెయిలుకు వచ్చే ప్రశ్నలకు అప్పటికప్పుడే సమాధానం
జాతీయ హెల్ప్ లైన్ రైల్ మదద్ హెల్ప్ లైన్ 139 సేవలు జాతీయ స్థాయిలో కొనసాగుతుండగా 138 నెంబర్ హెల్ప్ లైన్ ద్వారా ప్రజలకు స్థానిక భాషల్లో సమస్యలను సమర్ధవంతంగా తీరుస్తున్నారు

Posted On: 06 APR 2020 2:07PM by PIB Hyderabad

రైలు ప్రయాణీకులు, ఇతర పౌరులకు సహాయం అందింఛి సరుకుల రవాణా సమస్యలను తీర్చేందుకు వీలుగా  లాక్ డౌన్ ప్రకటించిన తరువాత భారతీయ రైల్వేలు కేంద్రీయ నియంత్రణ విభాగం ఏర్పాటు చేశాయి. కొద్ది రోజుల కిందట ఏర్పాటైన నియంత్రణ విభాగం నిర్వహణలో విజయం సాధించింది.  ఏర్పాటైన మొదటి 10 రోజుల్లో (లాక్ డౌన్ సమయంలో కూడా) రైల్వే సిబ్బంది 1,25,000 ప్రశ్నలకు బదులిచ్చారు. ప్రజల ఫిర్యాదులు, సూచనలను అందుకోవడానికి ఏర్పాటైన సమాచార వ్యవస్థ (ప్లాట్ ఫాం) పైన రైల్వే సిబ్బంది నేరుగా ఫోనులో మాట్లాడి  87% (1,09,000కు పైగా) ప్రశ్నలకు బడులిచ్చారు. 

నాలుగు సమాచార మరియు ప్రతిపుష్టి వ్యవస్థలు(ప్లాట్ ఫాంలు) – హెల్ప్ లైన్లు -  139, 138, సామాజిక మాధ్యమం (విశేషంగా ట్విట్టర్) మరియు ఈమెయిల్ railmadad@rb.railnet.gov.in-- ద్వారా  విరామం లేకుండా 24x7 నిరంతరం పర్యవేక్షిస్తూ సేవలు అందిస్తోంది.  లాక్ డౌన్ సమయంలో సాధారణ ప్రజానీకం తమ సమస్యలు ఎలాంటి అడ్డంకులు లేకుండా రైల్వే అధికారుల దృష్టికి తెచ్చేందుకు వీలవుతుంది. ప్రజలు అధికారుల నుంచి సమాచారం తెలుసుకోవడమే కాక ఏవైనా సూచనలను కూడా అందించవచ్చు.  

కంట్రోల్ కార్యాలయాన్ని రేయింబవళ్ళు డైరెక్టర్ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు.  లాక్ డౌన్ సమయంలో రైల్వే వినియోగదారుల నుంచి విశేషంగా సరుకుల రవాణాకు సంబంధించి సామాజిక మాధ్యమం, ఈమెయిల్ ద్వారా అందే పౌరుల ఫీడ్ బ్యాక్ (ప్రతిపుష్టి) మరియు వారి సూచనలకు సత్వరం స్పందించి ఈ అధికారులు తగిన విధంగా పనులు జరిగేలా చూస్తున్నారు. ఈ బృందం పనిని క్షేత్రస్థాయి అధికారులైన  అదనపు డి ఆర్ ఎంలు డివిజన్ స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. 

రైల్ మదద్ హెల్ప్ లైన్ 139 ద్వారా లాక్ డౌన్ మొదలైన మొదటి 10 రోజుల్లో సాధారణ ప్రజానీకం అడిగిన 80,000 ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా ఐ వి ఆర్ ఎస్ సౌకర్యం ద్వారా సమాధానం ఇచ్చిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. ప్రశ్నలలో ఎక్కువ భాగం రైల్వే సర్వీసుల పునః ప్రారంభం,  చార్జీల తిరిగి చెల్లింపు నియమాల సడలింపు (ప్రజల నుంచి అందిన ఫీడ్ బ్యాక్ కారణంగానే నియమాల సడలింపు), ఈ కష్టకాలంలో రైల్వేల ప్రయత్నాలకు సామాజిక మాధ్యమంలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

నిత్యావసర వస్తువులతో సరుకుల రైళ్ళను నడపడం, వ్యాగన్లను ఆలస్యంగా పంపినందుకు జరిమానాల మాఫీ, రైలు  కోచులను ఆసుపత్రి వార్డులుగా మార్చడం, ఆహార పొట్లాల పంపిణీ, కోవిడ్ మహమ్మారిపై పోరాటానికి వ్యక్తిగత సంరక్షణ సాధనాలు(పి పి ఇలు), శానిటైజర్లు మరియు ఇతర పరికరాల తయారీ మొదలైన పనులకు ప్రశంసలు అందుతున్నాయి. 

హెల్ప్ లైన్ నెంబర్ 138పై వచ్చే ఫోన్ కాల్ లను ఫోన్ చేసే ప్రదేశం ప్రాతిపదికగా నేరుగా రైల్వే డివిజనల్ నియంత్రణ కార్యాలయానికి అందేలా ఏర్పాట్లు చేశారు. ఈ హెల్ప్ లైన్ లో పనిచేసే సిబ్బంది స్థానిక భాష మాట్లాడటంతో పాటు స్థానిక సమస్యలపై అవగాహన ఉన్నవారు. దీనివల్ల ఫోన్ చేసే వారికి సులభంగా అర్ధమయ్యే భాషలో సమాచారం, సలహాలు అందించడం సాధ్యమవుతుంది. భాషా సమస్య లేని ఈ కొత్త సౌకర్యం వల్ల డివిజన్ స్థాయిలో అందుబాటులో ఉన్న సముచితమైన సమాచారం వేగంగా రైల్వే వినియోగదారులకు, ఇతరులకు అందించ డానికి వీలవుతుంది.  

భారతీయ రైల్వే శాఖ  అన్ని రకాల చర్యలు తీసుకోవడం ద్వారా ప్రయాణీకులు మరియు అన్ని వర్గాల వాణిజ్య వినియోగదారులు ప్రయోజనాలను కాపాడటంతో పాటు జాతీయ సరఫరా శృంఖల అన్నివేళలా ఆగకుండా కొనసాగేలా చూస్తున్నదని చెప్పడం సముచితం. 

  



(Release ID: 1611719) Visitor Counter : 229