హోం మంత్రిత్వ శాఖ

కోవిడ్ 19 మ‌హ‌మ్మారి కార‌ణంగా భార‌త‌దేశంలో చిక్కుకుపోయిన విదేశీయులను వారి దేశాల‌కు త‌ర‌లించ‌డంపై మార్గ‌ద‌ర్శ‌కాలు

Posted On: 02 APR 2020 9:37PM by PIB Hyderabad

కోవిడ్ 19 మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌న త‌ర్వాత దేశంలో ప‌లు చోట్ల అనేక మంది విదేశీయులు క్వారంటైన్ కు ప‌రిమిత‌మైన సంగ‌తి తెలిసిందే. వీరిని వారి వారి దేశాల‌కు త‌ర‌లించ‌డంపైగ‌ల విధివిధానాల‌కు సంబంధించి మార్పులు చేస్తూ కేంద్ర హోం శాఖ అనుబంధాన్ని విడుద‌ల చేసింది. కోవిడ్ 19 నెగెటివ్ వ‌చ్చిన విదేశీయుల‌ను వారి దేశాల‌కు త‌ర‌లించ‌వ‌చ్చ‌ని తెలిపారు . దీనికి సంబంధించి గ‌తంలో పెట్టిన  నిబంధ‌న‌లను ఎత్తేశారు. 
 



(Release ID: 1610572) Visitor Counter : 106