పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘పంచకుల’లో కేంద్ర పర్యావరణ మంత్రి నేతృత్వంలో అంతర్జాతీయ రాబందుల అవగాహన దినోత్సవం- 2026

‘సంక్షోభం నుంచి పునరుద్ధరణ దిశగా – భారత్‌లో రాబందుల పరిరక్షణ’ ప్రధాన ఇతివృత్తంగా జాతీయ స్థాయి వర్క్‌షాప్‌

అడవిలో జీవజాతుల పునరుద్ధరణకు దోహదపడేలా.. రాబందుల రక్షిత ప్రాంతాల ఏర్పాటు, సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకోవడంలో నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చిన శ్రీ భూపేందర్ యాదవ్

నాడు పోస్టు చేయడమైనది: 06 SEP 2026 10:49AM by PIB Hyderabad

హర్యానాలోని పంచకుల వేదికగా అంతర్జాతీయ రాబందుల అవగాహన దినోత్సవం - 2026ను ఈ రోజు ఘనంగా నిర్వహించారుఈ సందర్భంగా.. ‘సంక్షోభం నుంచి కోలుకునే దిశగా – భారతీయ రాబందుల పరిరక్షణ’ అనే ప్రధాన ఇతివృత్తంతో నిర్వహించిన జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ను కేంద్ర పర్యావరణఅటవీవాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ప్రారంభించారుఈ కార్యక్రమంలో హర్యానా రాష్ట్ర పర్యావరణఅటవీవన్యప్రాణి సంరక్షణ శాఖ మంత్రి శ్రీ రావు నర్బీర్ సింగ్కేంద్ర పర్యావరణఅటవీవాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖహర్యానా ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కేంద్ర పర్యావరణఅటవీవాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంవోఈఎఫ్‌సీసీ), కేంద్ర జంతు ప్రదర్శన శాలల ప్రాధికార సంస్థ (సీజెడ్ఏ), హర్యానా అటవీవన్యప్రాణి సంరక్షణ శాఖబొంబాయి ప్రకృతి శాస్త్ర అధ్యయన సొసైటీ (బీఎన్‌హెచ్ఎస్), పింజోర్‌లోని జటాయు సంరక్షణప్రజనన కేంద్రం (జేసీబీసీసంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయిభారత్‌లో రాబందుల పరిరక్షణ దిశగా సమష్టి కృషిని బలోపేతం చేసే దిశగా.. అటవీ శాఖ ఉన్నతాధికారులుశాస్త్రవేత్తలుపశువైద్యులుజంతు ప్రదర్శన శాలల నిపుణులుసంరక్షణ రంగంలో నిపుణులుసంబంధిత భాగస్వామ్య పక్షాలన్నింటినీ ఈ సమావేశం ఒక్క వేదికపైకి తెచ్చింది.

 

సభను ఉద్దేశించి శ్రీ యాదవ్ ప్రసంగిస్తూ... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వ పర్యావరణ సంరక్షణ విధానం నిర్దిష్ట జాతులకు మాత్రమే పరిమితం కాలేదనీమొత్తం పర్యావరణ వ్యవస్థ ఆధారిత ప్రాతిపదికగా సమగ్ర దృక్పథంతో సాగుతోందనీ అన్నారుపెద్ద పులి జాతులుస్లాత్ ఎలుగుబంట్లుబట్టమేక పక్షులుడాల్ఫిన్లుఘరియల్ మొసళ్ళుఅడవి దున్నలురాబందులు... ఇలా ఏ జాతి సంరక్షణ కార్యక్రమాన్ని పరిశీలించినా ప్రభుత్వ విధానం స్పష్టంగా ప్రతిబింబిస్తుందని మంత్రి పేర్కొన్నారురాబందుల గురించి మాట్లాడుతూ... తెల్లని వీపు (వైట్ రంప్డ్రాబందులుపొడవు ముక్కు (లాంగ్ బిల్డ్రాబందులుసన్నని ముక్కు గల (స్లెండర్ బిల్డ్రాబందులుఎర్ర తల రాబందులుఈజిప్షియన్హిమాలయన్ గ్రిఫాన్యురేషియన్ గ్రిఫాన్సినిరియస్బియర్డ్ రాబందుల వంటి వైవిధ్యభరితమైన స్థానికవలస వచ్చిన రాబందులకు భారత్ ఆవాసంగా ఉందన్నారువాటి సంరక్షణ కోసం భారత్ విజయవంతంగా కృషి చేస్తోందన్నారు.

పర్యావరణ వ్యవస్థలో అత్యంత సమర్థమైన పారిశుద్ధ్య కార్మికులుగా రాబందులు కీలక పాత్ర పోషిస్తాయన్న శ్రీ యాదవ్.. ప్రకృతి తయారు చేసుకున్న స్వీయ పారిశుద్ధ్య వ్యవస్థగా వాటిని అభివర్ణించారుజంతు కళేబరాలను వేగంగా ఆహారంగా తీసుకోవడం ద్వారా.. పోషకాల పునర్వినియోగానికి తోడ్పడుతూపర్యావరణ సమతౌల్యాన్ని రాబందులు కాపాడతాయని వివరించారువాతావరణ మార్పులుమానవ వన్యప్రాణి సంఘర్షణ వంటి అనేక సవాళ్లను నేడు ప్రపంచం ఎదుర్కొంటోందన్నారురాబందుల ఆహార గొలుసులో అవాంతరాలుజంతువుల చికిత్సలో వాడే పెయిన్ కిల్లర్ల ప్రభావం వల్ల.. ముఖ్యంగా 1990ల నుంచి భారతీయ రాబందుల సంఖ్య చాలా వరకు క్షీణించిందని తెలిపారు.

రాబందుల పరిరక్షణ కోసం విధాన రూపకల్పనలో ప్రభుత్వ యంత్రాంగమంతాసమాజమంతా ఏకమై సమన్వయంతో కృషిచేయడం ఆవశ్యకమని మంత్రి స్పష్టం చేశారురాబందులకు సురక్షితమైన పశువైద్య విధానాలుసురక్షిత ఆహార లభ్యతఅడవుల్లో ఆ జాతుల పునరుద్ధరణకు తోడ్పడేలా సాంకేతిక సామర్థ్యాలను పెంచుకోవడం ద్వారా... ‘రాబందుల సురక్షిత ప్రాంతాల’ను సృష్టించే దిశగా నిరంతరం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారురాబందుల పరిరక్షణలో పశువైద్యులుపశుపోషకులుస్థానిక పరిపాలన యంత్రాంగంస్థానిక ప్రజలు క్రియాశీలక భాగస్వాములు కావాలనీకళేబరాల నిర్వహణలో సురక్షిత పద్ధతులను ప్రోత్సహించాలనీ ఆయన విజ్ఞప్తి చేశారు.

అంతకుముందు పింజోర్‌లోని జేసీబీసీ సందర్శనతో కేంద్ర మంత్రి తన పర్యటనను ప్రారంభించారుఅక్కడి సౌకర్యాలను పరిశీలించారుసంరక్షణ కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ఏర్పాటు చేసిన ప్రజెంటేషన్‌ను వీక్షించారురాబందుల పరిరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులతో సంభాషించారుహర్యానా అటవీ శాఖబీఎన్‌హెచ్ఎస్‌ సంయుక్త భాగస్వామ్యంతో ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాయితెల్ల వీపుపొడవు ముక్కుసన్నని ముక్కు గల రాబందుల సంరక్షణప్రజనన చర్యలకు సంబంధించి అత్యంత కీలక కేంద్రంగా ఇది రూపుదిద్దుకుంది.

శాస్త్రీయ పద్ధతుల్లో పెంపకంకృత్రిమంగా ఇంక్యుబేషన్ పద్ధతులుపశువైద్యంప్రజనన జన్యుపరమైన యాజమాన్య పద్ధతులను ఈ కేంద్రంలో చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. 2025–26 సమయానికి జటాయు సంరక్షణ కేంద్రంలో 356 రాబందులు ఆవాసం పొందుతుండగా.. 35 రాబందు పిల్లలు జన్మించాయని తెలిపారుఅలాగే 87 రాబందులను స్వేచ్ఛా వాతావరణంలోకి విడుదల చేయగా.. మరో 90 పక్షులను ఇతర సంరక్షణ-ప్రజనన కేంద్రాలకు తరలించారుఅంతేకాకుండా 22 సంస్థలకు చెందిన 1,222 మందికి శిక్షణ ఇవ్వడం ద్వారా రాబందుల పరిరక్షణలో సాంకేతిక సామర్థ్యం పెంపొందేలా ఈ కేంద్రం కృషి చేసింది.

సభనుద్దేశించి శ్రీ రావు నర్బీర్ సింగ్ మాట్లాడుతూ.. పింజోర్‌లోని జటాయు సంరక్షణప్రజనన కేంద్రం (జేసీబీసీ)లో విజయవంతంగా కొనసాగుతున్న రాబందుల పరిరక్షణ కార్యక్రమాన్నికేంద్రం అందిస్తున్న కీలకమైన సేవలను వివరించారుఒక్క జన్మించిన పక్షుల సంఖ్య మాత్రమే సంరక్షణప్రజనన సేవల జయాపజయాలకు కొలమానం కాదన్నారుఆరోగ్యకరమైనజన్యుపరంగా క్రమబద్ధీకరించిన రాబందులుశాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించడంసాంకేతిక సామర్థ్యాలను విస్తరించుకోవడంఅడవుల్లో ఈ జాతుల పునరుద్ధరణ చర్యలే.. కార్యక్రమ విజయానికి ప్రాతిపదికలుగా ఉంటాయన్నారు.

 

 

ప్రారంభోత్సవ సభలో భాగంగా.. ‘స్టోరీ ఆఫ్ జటాయుసేవింగ్ ఇండియాస్ వల్చర్’ అనే కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆవిష్కరించారురాబందుల సంఖ్యలో క్షీణత నుంచి పింజోర్‌లో జేసీబీసీని నెలకొల్పడం ద్వారా విజయవంతంగా చేపట్టిన ప్రజననసంరక్షణ కార్యక్రమం వరకు... రాబందుల సంరక్షణలో భారత్ విశిష్ట ప్రయాణాన్ని ఈ పుస్తకం సమగ్రంగా వివరిస్తుందిఅలాగే రాబందుల సంరక్షణపై నిర్వహించిన ఆన్‌లైన్ డ్రాయింగ్డిజిటల్ ఫొటోగ్రఫీ పోటీల విజేతలకు ఈ సందర్భంగా బహుమతులను అందించారు.

భారత పర్యావరణ వ్యవస్థలో రాబందుల వికాసం కొనసాగుతూకీలక పాత్రను పోషించే దిశగా పునరంకితం కావాలన్న సంకల్పంతో.. అంతర్జాతీయ రాబందుల అవగాహన దినోత్సవం- 2026 సందర్భంగా ఈ జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ‘సంక్షోభం నుంచి కోలుకునే దిశగా’ సాగుతున్న ఈ ప్రయాణం.. శాస్త్రీయ పద్ధతులుసరైన విధానాలుసంరక్షణ ప్రజననంసురక్షిత ఆవాసాలుసామాజిక భాగస్వామ్యం ద్వారా రాబందుల పరిరక్షణకు భారత్ సమష్టిగా కట్టుబడి ఉందని స్పష్టం చేస్తోంది.  

 

***


(రిలీజ్ ఐడి: 2307190) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam