ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత ఆర్థిక సమ్మిళిత స్వరూపాన్ని మార్చడంలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి జన్ ధన్ యోజన

రూ.3.17 లక్షల కోట్ల డిపాజిట్లు.. 59.09 కోట్ల పీఎంజేడీవై ఖాతాలు...

ఖాతాదారుల్లో 56 శాతం మంది మహిళలు.. గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోనే 78 శాతం ఖాతాలు

దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక భద్రతను మరింత అందుబాటులోకి తెస్తూ... 41 కోట్లకు పైగా రూపే కార్డుల జారీ

నిరుపేదలకు సంక్షేమ ప్రయోజనాలు నేరుగా, పారదర్శకంగా, దారి మళ్లింపు లేకుండా అందించడాన్ని సాధ్యం చేసిన జేఏఎమ్ ప్రణాళిక

నాడు పోస్టు చేయడమైనది: 27 AUG 2026 12:13PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ప్రారంభించిన కార్యక్రమాల్లో ఒకటిగా... 28 ఆగస్టు 2014న ప్రారంభమైన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై12 సంవత్సరాలు పూర్తి చేసుకుందిఈ 12 సంవత్సరాల పీఎంజేడీవై కార్యక్రమం భారత ఆర్థిక రంగంలో అద్భుత పరివర్తనకు సాక్ష్యంగా నిలిచిందిఈ పథకం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సమ్మిళితానికి ఒక మార్గదర్శిగా మారిందిప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమంగా ఈ పీఎంజేడీవై... భారతీయులంతా బ్యాంకింగ్ సేవలను పొందే అవకాశాన్ని కల్పించడం కొనసాగిస్తోంది.

ఆర్థిక సమ్మిళితాన్ని విస్తరించడం:

పటిష్ఠమైన ఆర్థిక సమ్మిళిత పథకాలువిస్తృత ప్రచార కార్యక్రమాల ద్వారా అట్టడుగున ఉన్నఆర్థికంగా వెనకబడిన వర్గాలకు మద్దతునివ్వడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందిపీఎంజేడీవై పథకం ద్వారాబ్యాంకు సేవలు అందని వయోజనులందరికీ ఎలాంటి కనీస బ్యాలెన్స్ అవసరం లేనిఎలాంటి నిర్వహణ రుసుములు లేని ఒక సాధారణ బ్యాంకు ఖాతా అందుబాటులోకి వస్తుంది.

ప్రతి ఖాతాతో పాటు ఉచిత రూపే డెబిట్ కార్డు లభిస్తుందిఇది రూ.2 లక్షల ప్రమాద బీమా కవరేజీని అందిస్తుందిడిజిటల్ లావాదేవీలనుఆర్థిక భద్రతను ప్రోత్సహిస్తుందిఖాతాదారులు రూ.10,000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యానికీ అర్హులుఇది అత్యవసర పరిస్థితుల్లో వారికి ఒక భరోసాను అందిస్తుంది.

పీఎం జీవన్ జ్యోతి బీమా యోజనపీఎం సురక్షా బీమా యోజన వంటి జన సురక్షా పథకాల ద్వారా... అసంఘటిత రంగంలోని లక్షలాది మంది కార్మికులకు జీవిత బీమాప్రమాద బీమాను అందించడంలోనూ పీఎంజేడీవై ఖాతాలు కీలక పాత్ర పోషించాయి.

ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి మాట్లాడుతూ... "2014 ఆగస్టు 28న 'ప్రధానమంత్రి జన్ ధన్ యోజన' (పీఎంజేడీవైపేరుతో ఆర్థిక సమ్మిళిత జాతీయ మిషన్‌ను గౌరవ ప్రధానమంత్రి ప్రారంభించారునేడు 'ప్రధానమంత్రి జన్ ధన్ యోజనతన 12వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం నాకు సంతోషాన్నిస్తోంది. 59 కోట్లకు పైగా ఖాతాల ప్రారంభంరూ.3.17 లక్షల కోట్ల డిపాజిట్ నిల్వలు లేదా 41.29 కోట్ల ఉచిత రూపే కార్డుల జారీ వంటి అంశాల కోణంలోనే పీఎంజేడీవైని చూడకూడదుదీనిని దేశ బ్యాంకింగ్ఆర్థిక రంగంలో సాధించిన అద్భుతమైన మార్పుల కోణంలోనూ చూడాలిమధ్యవర్తుల ప్రమేయం లేకుండాఎటువంటి జాప్యం లేకుండాసమాజంలోని ప్రతి వ్యక్తికీ... అత్యంత పేదవారికీ... ఆర్థిక సేవలను అందించడం దీనివల్లే సాధ్యమైందిఅన్నారు.

పీఎంజేడీవై పథకం కింద తెరిచిన 78 శాతం ఖాతాలు గ్రామీణసెమీ-అర్బన్ ప్రాంతాల్లోనే ఉన్నాయిసుమారు 56 శాతం ఖాతాలు మహిళల పేరిటే ఉన్నాయిదేశంలోని మారుమూల ప్రాంతాల్లో నివసించే అట్టడుగు వర్గాల ప్రజలను అధికారిక ఆర్థిక వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలన్న ఈ పథకం ప్రాధాన్యతను ఇది స్పష్టం చేస్తోంది.

పీఎంజేడీవై పథకం లక్షలాది మందికిముఖ్యంగా అట్టడుగు వర్గాల వారికి... వారి సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుకోవడం కోసం బ్యాంకింగ్ఆర్థిక సేవలను పొందేందుకు సాధికారత కల్పించిందిఈ ఖాతా కలిగి ఉండడం సామాన్యులకు బీమాపింఛను వంటి ప్రయోజనాలను పొందేందుకు వీలు కల్పించిందిప్రతి రాష్ట్రంజిల్లాలో అవిశ్రాంతంగా చేపట్టిన విస్తృత ప్రచార కార్యక్రమాల ద్వారా... దేశంలోని దాదాపు ప్రతి వ్యక్తికీ బ్యాంకు ఖాతాలను అందించే దిశగా మేం పురోగమించాంబీమాపింఛను పథకాల పరిధినీ... వాటి అవసరం అత్యంతగా ఉన్న వారి కోసం క్రమంగా విస్తరించాం.

12వ వార్షికోత్సవం సందర్భంగా... పీఎంజేడీవై పథకాన్ని సామాన్యులకు చేరవేసి దానిని ఘనవిజయం చేయడంలో దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న బ్యాంకర్లువ్యాపార ప్రతినిధుల కృషిని నేను అభినందిస్తున్నాను.” అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

జేఏఎమ్ ప్రణాళిక : ఒక గేమ్-చేంజర్

పీఎంజేడీవై ప్రధాన కేంద్రంగా రూపొందించిన 'జన్ ధన్–ఆధార్–మొబైల్' (జేఏఎమ్ప్రణాళిక... ఆర్థిక సహాయాన్ని నేరుగా ప్రజల ఖాతాలకు చేరవేయడం ద్వారా మళ్లింపులకు తావులేని ఒక సమర్థమైన విధానంగా నిరూపితమైందిజేఏఎమ్ ద్వారా... మధ్యవర్తుల ప్రమేయాన్నిజాప్యాన్ని తొలగించడంసంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రభుత్వం నేరుగా అట్టడుగు వర్గాల వారి బ్యాంకు ఖాతాలకు విజయవంతంగా బదిలీ చేయడం సాధ్యమైంది.

విజయాలు:

a. పీఎంజేడీవై ఖాతాలు59.09 కోట్లు (19 ఆగస్టు 2026 నాటికి)

19 ఆగస్టు 2026 నాటికిమొత్తం పీఎంజేడీవై ఖాతాల సంఖ్య 59.09 కోట్లుగా ఉందిజన్ ధన్ ఖాతాదారుల్లో 55.7 శాతం (32.92 కోట్లుమంది మహిళలు కాగా77.8 శాతం (45.95 కోట్లుజన్ ధన్ ఖాతాలు గ్రామీణసెమీ-అర్బన్ ప్రాంతాల్లోనే ఉన్నాయి.

b. పీఎంజేడీవై ఖాతాల్లో డిపాజిట్లు – రూ3.17 లక్షల కోట్లు (19 ఆగస్టు 2026 నాటికి)

పీఎంజేడీవై ఖాతాల కింద మొత్తం డిపాజిట్ నిల్వలు రూ. 3,16,514 కోట్లుగా ఉన్నాయిగత 12 ఏళ్లలో (ఆగస్టు 2015 - ఆగస్టు 2026 మధ్యడిపాజిట్లు సుమారు 12.8 రెట్లు పెరగగాఖాతాల సంఖ్య 2.3 రెట్లు పెరిగింది.

c. ప్రతి పీఎంజేడీవై ఖాతాలో సగటు డిపాజిట్ – రూ5,356 (19 ఆగస్టు 2026 నాటికి)

19.08.2026 నాటికిఒక్కో ఖాతాకు సగటు డిపాజిట్ రూ. 5,356గా ఉందిగత 12 ఏళ్లలో (ఆగస్టు 2015 నుంచి ఆగస్టు 2026 వరకుఒక్కో ఖాతాకు సగటు డిపాజిట్ 3.4 రెట్లు పెరిగిందిసగటు డిపాజిట్‌లో ఈ పెరుగుదల... ఖాతాల వినియోగం పెరగడానికిఖాతాదారుల్లో పొదుపు అలవాట్లు పెంపొందడానికి నిదర్శనంగా ఉంది.

d. పీఎంజేడీవై ఖాతాదారులకు జారీ చేసిన రూపే కార్డులు41.29 కోట్లు (19 ఆగస్టు 2026 నాటికి)

పీఎంజేడీవై ఖాతాదారులకు 41.29 కోట్ల రూపే కార్డులు జారీ అయ్యాయికాలక్రమేణా రూపే కార్డుల సంఖ్యవాటి వినియోగం పెరిగాయి.

పీఎంజేడీవై విజయం దాని మిషన్-మోడ్ విధానంనియంత్రణ సంస్థల మద్దతుప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలుబయోమెట్రిక్ ధ్రువీకరణ కోసం ఆధార్ వంటి డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల అనుసంధానం వంటి అంశాల వల్లే సాధ్యమైందిఇది ఆర్థిక సమ్మిళితం దిశగా మొదటి అడుగుగా కొనసాగుతోందిగతంలో అధికారిక ఆర్థిక వ్యవస్థకు దూరంగా ఉన్నవారికి పొదుపురుణ సదుపాయాన్ని కల్పించడం ద్వారా మరింత పురోగతి సాధ్యమవుతోందిస్పష్టమైన పొదుపు విధానాలతోఖాతాదారులు ఇప్పుడు ముద్రా రుణాలు సహా ఇతర రుణాలకూ అర్హులయ్యారుఇది వ్యక్తులు తమ ఆదాయాలను పెంచుకోవడానికిఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సాధికారత కల్పిస్తోంది.

పీఎంజేడీవై తన 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో... ఇది సమ్మిళిత వృద్ధిడిజిటల్ ఆవిష్కరణఆర్థిక సాధికారతకు ఒక దిక్సూచిగా నిలుస్తోందిదీని నిరంతర విజయం...  ఆర్థిక శ్రేయస్సు దిశగా సాగే ప్రయాణంలో ఏ ఒక్క పౌరుడూ వెనకబడిపోకుండా చూడటం పట్ల భారత్ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2303728) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali-TR , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam