ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

థానేలో భవనం కూలిన ఘటనలో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధానమంత్రి దిగ్భ్రాంతి


ఎక్స్-గ్రేషియాను ప్రకటించిన ప్రధాని

प्रविष्टि तिथि: 31 JUL 2026 1:08PM by PIB Hyderabad

మహారాష్ట్రలోని థానేలో భవనం కూలిన ఘటనలో ప్రాణ నష్టం సంభవించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఈ విషాద ఘటన గురించి విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయినట్లు ప్రధానమంత్రి చెప్పారుఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మరణించిన వారి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్నుంచి రూ.2 లక్షల ఎక్స్-గ్రేషియాను ప్రధానమంత్రి ప్రకటించారుగాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సాయాన్ని అందిస్తారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

‘‘మహారాష్ట్రలోని థానేలో భవనం కూలిన ఘటనలో ప్రాణనష్టం జరిగిందని విని దిగ్భ్రాంతికి లోనయ్యానుఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నానుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.

మరణించిన వారి కుటుంబానికి పీఎంఎన్ఆర్‌ఎఫ్ నుంచి రూ.2 లక్షల ఎక్స్-గ్రేషియాను అందిస్తాంగాయపడిన వారికి రూ.50,000 అందజేస్తాం.’’

 

***


(रिलीज़ आईडी: 2292597) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam