పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నేతృత్వంలో సంరక్షణ కేంద్రాల్లో గత 12 ఏళ్లలో పులుల సంఖ్య గణనీయమైన పెరుగుదల: శ్రీ భూపేందర్ యాదవ్

న్యూఢిల్లీలో ప్రపంచ పులుల దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి.. ప్రకృతిని గౌరవించాలని ప్రజలకు పిలుపు

వన్యప్రాణి సంరక్షణ కథనాలు సమాచారానికి మాత్రమే పరిమితం కాదు.. సంప్రదాయ జ్ఞానం, భావోద్వేగాలు, అభిరుచి, ఎన్నో ఏళ్ల అనుభవాల మేళవింపు

2026 ప్రపంచ పులుల దినోత్సవ సందర్భంగా ఎన్టీసీఏ- పర్యావరణ హిత పర్యాటక వెబ్‌పేజీ ప్రారంభం.. పులుల సంరక్షణ, రక్షిత ప్రాంతాల నిర్వహణలో విశేష కృషి చేసిన వారికి ఎన్టీసీఏ పురస్కారాలు

प्रविष्टि तिथि: 29 JUL 2026 12:21PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (ఎన్టీసీఏనిర్వహించిన ప్రపంచ పులుల దినోత్సవం-2026 కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్ర పర్యావరణఅటవీవాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఈ రోజు ప్రసంగించారుప్రకృతితో సామాజిక అనుబంధాన్నీ మరింత పెంపొందించుకోవాలనీపర్యావరణ పరిరక్షణ ఆధారిత జీవనశైలిని అలవర్చుకోవాలనీ ఆయన పిలుపునిచ్చారుకేంద్ర పర్యావరణఅటవీవాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్‌సీనియర్ ప్రభుత్వాధికారులువన్యప్రాణి నిపుణులుక్షేత్రస్థాయి అటవీ సిబ్బందివిద్యార్థులుఇతర ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమం.. పులుల సంరక్షణలో భారత్ విజయాలను చాటిందిపులులనూవాటి ఆవాసాలనూ పరిరక్షించే దిశగా సమష్టి నిబద్ధతను పునరుద్ఘాటించింది.

సంరక్షణ అంటే వన్యప్రాణులను రక్షించడం మాత్రమే కాదనీప్రకృతితో గౌరవప్రదమైన అనుబంధాన్ని పెంపొందించుకోవడమనీ శ్రీ యాదవ్ స్పష్టం చేశారు. “ప్రకృతి అంటే కేవలం పర్యాటకమోవినోదమో మాత్రమే కాదు.. ప్రకృతిని గౌరవించాలిప్రజలు దాని నుంచి ప్రశాంతతను పొందాలి” అని ఆయన పేర్కొన్నారుప్రజలు ప్రకృతి నుంచి స్ఫూర్తిని పొందిపర్యావరణ పరిరక్షణకు పునరంకితమయ్యేలా జీవనశైలిని అలవరచుకోవాలని ఆయన కోరారు.

పులుల సంరక్షణపరంగా భారత్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో పులుల సంఖ్య (3,682), పులుల సంరక్షణ కేంద్రాల సంఖ్య (58) గణనీయంగా పెరిగాయని మంత్రి తెలిపారుగత 12 ఏళ్లలో ఏనుగుల అభయారణ్యాలుజాతీయ పార్కులువన్యప్రాణి అభయారణ్యాలురక్షిత ప్రాంతాలుకమ్యూనిటీ రిజర్వులుచిత్తడి నేలల సంఖ్య కూడా పెరిగిందని వివరించారు.

ఎన్టీసీఏ పర్యావరణ హిత పర్యాటక (ఎకో టూరిజంవెబ్‌పేజీని ప్రారంభిస్తూ.. అన్ని పులుల సంరక్షణ కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే వేదికపైకి తెచ్చిన ఎన్టీసీఏను శ్రీ యాదవ్ అభినందించారుసఫారీవసతి సదుపాయానికి బుకింగుల కోసం అన్ని పులుల సంరక్షణ కేంద్రాల ప్రామాణిక వెబ్‌సైట్ల లింకులు ఇందులో అందుబాటులో ఉంటాయితద్వారా సమాచారం సులభంగా అందుబాటులోకి రావడమే కాకుండా.. బాధ్యతాయుతమైనసుస్థిరమైన ప్రకృతి హిత పర్యాటకాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. (లింకుhttps://ntca.gov.in/eco-tourism/)

అటవీ సంరక్షణ అనుభవాలను గ్రంథస్తం చేయాల్సిన ఆవశ్యకతపై మంత్రి మాట్లాడుతూ.. “అడవుల కథలు కేవలం సమాచారం మాత్రమే కాదు.. సంప్రదాయ విజ్ఞానంభావోద్వేగాలువన్యప్రాణి సంరక్షణ పట్ల ఆకాంక్ష అందులో కనిపిస్తాయిఅటవీవన్యప్రాణి అధికారులుసంరక్షకుల అనుభవాలెన్నో వాటిలో ఉంటాయి” అని మంత్రి అన్నారువన్యప్రాణుల సంరక్షణ గురించి అటవీ అధికారులు మరింతగా రాయాలనీఆచరణాత్మకమైనఅమలు చేయదగిన విధాన నిర్ణయాలకు దోహదపడే విధంగా తమ అనుభవాలను పంచుకోవాలని ఆయన కోరారు.

ప్రపంచవ్యాప్తంగా ఆచరిస్తున్న అత్యుత్తమ విధానాలను అవలంబించడం ద్వారా అటవీ అధికారులుసిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను కూడా శ్రీ యాదవ్ ప్రస్తావించారుప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునే విషయంలో అంతర్జాతీయ బిగ్ క్యాట్ కూటమి (ఐబీసీఏకీలక పాత్ర పోషిస్తోందన్నారు.

పులుల సంరక్షణ కోసం క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్న వారి సేవలను గుర్తిస్తూ.. పులుల సంరక్షణరక్షిత ప్రాంతాల నిర్వహణలో విశేష కృషి చేసిన అటవీవన్యప్రాణి అధికారులకుఇతర సహాయకులకు ఎన్టీసీఏ పురస్కారాలను అందించారువన్యప్రాణి సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది కృషిని గుర్తించడానికి కూడా ఈ కార్యక్రమం ఒక వేదికను అందించింది.

పులులను కాపాడుదాం’ అన్న ఇతివృత్తంపై ఢిల్లీలోని బడి పిల్లలకు నిర్వహించిన పెయింటింగ్స్కెచింగ్నినాదాల రచనమాస్కు తయారీ పోటీల్లో నుంచి ఎంపిక చేసిన అత్యుత్తమ కృతులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను మంత్రి వీక్షించారుఅలాగేపులుల సంరక్షణ కేంద్రాల సమీపంలోని పాఠశాలలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ.. మంత్రిత్వ శాఖ పర్యావరణ విద్యా కార్యక్రమం కిందఎకో క్లబ్‌ల ద్వారా దేశవ్యాప్తంగా పులుల సంరక్షణపై అవగాహన ప్రచారాన్ని కూడా చేపట్టారు.

శాస్త్రీయత ప్రాతిపదికగా పులుల సంరక్షణవిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడంప్రజల్లో అవగాహనను పెంపొందించడంలో ఎన్టీసీఏ నిరంతర అంకితభావాన్ని ప్రతిబింబించేలా.. అయిదు ప్రచురణలను కూడా ఈ కార్యక్రమంలో భాగంగా విడుదల చేశారువీటిలో ఎన్‌టీసీఏ ప్రజాప్రచార పత్రిక ‘స్ట్రైప్స్’ 2026 జూలై సంచిక, 24 పులుల సంరక్షణ కేంద్రాల భద్రతా ఆడిట్ నివేదికదేశంలోని పులుల ఆవాస ప్రాంతాల్లో ఎలుగుబంట్ల ఆవాస అనుకూలత అంచనాపై నివేదికఐబీసీఏజీటీఎఫ్ ప్రచురించిన ‘టైగర్స్ ఆఫ్ ది వరల్డ్’శ్రీ చంద్ర ప్రకాష్ గోయల్శ్రీ సత్య ప్రకాష్ యాదవ్ రచించిన ‘ది రెహ్మాన్ ఖేరా టైగర్’ ఉన్నాయి.

ప్రతిభను గుర్తించడంశాస్త్రీయ నిర్వహణసామర్థ్యాభివృద్ధిబాధ్యతాయుతమైన పర్యావరణ హిత పర్యాటకంవిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడంసుసంపన్నమైన దేశ సహజ వారసత్వాన్ని పరిరక్షించడంలో ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా.. పులుల సంరక్షణకు భారత్ ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని ప్రపంచ పులుల దినోత్సవం- 2026 కార్యక్రమాలు స్పష్టం చేశాయి.

నేపథ్యంప్రపంచ పులుల దినోత్సవం- 2026

ఒక వందేళ్ల కిందట ఆసియాలో లక్ష పులులుండేవని అంచనాచారిత్రకంగా వాటికి ఆవాస ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో నేడు పులుల సంఖ్య అందులో శాతం కన్నా తక్కువకు పడిపోయిందిఅంతేకాదు.. బాలిజావాన్కాస్పియన్ అనే మూడు పులుల ఉప జాతులు అంతరించిపోయాయివేటవన్యప్రాణుల అక్రమ రవాణాఆవాసాల నష్టంవిచ్ఛిన్నంమానవ వన్యప్రాణి ఘర్షణవాతావరణ మార్పులు పులుల సంఖ్య తగ్గడానికి కారణమయ్యాయి.

పులుల సంరక్షణ దిశగా సమష్టి కృషి ఆవశ్యకతను గుర్తించి.. 13 పులుల ఆవాస దేశాల నాయకులు 2010లో సెయింట్ పీటర్స్‌బర్గ్ టైగర్ సదస్సులో ఒక్కచోట చేరి ప్రపంచ పులుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని (జీటీఆర్పీప్రారంభించారు. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్యను రెట్టింపు చేయాలన్న ప్రతిష్ఠాత్మక TX2 లక్ష్యంతో.. ఏటా జూలై 29న ‘ప్రపంచ పులుల దినోత్సవా’న్ని నిర్వహించాలని కూడా ఈ సదస్సులో నిర్ణయించారు.

నాటి నుంచి పులుల సంరక్షణఅంతర్జాతీయ సహకార బలోపేతంప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంపై అవగాహనను పెంపొందించడంతోపాటు.. పులులూవాటి ఆవాసాలను కాపాడడంలో పురోగతిని సమీక్షించేందుకు ప్రపంచ పులుల దినోత్సవం ఒక వేదికను అందిస్తోంది.  

 

***


(रिलीज़ आईडी: 2291198) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam