పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శాస్త్రీయ నిర్ధారణ ఆధారంగా ఈ20 పెట్రోల్ భద్రత, పనితీరును ధ్రువీకరించిన ప్రభుత్వం

प्रविष्टि तिथि: 23 JUL 2026 3:05PM by PIB Hyderabad

ఇథనాల్ మిశ్రమ పెట్రోలు (ఈబీపీకార్యక్రమం పూర్తి స్థాయి శాస్త్రీయ విశ్లేషణక్రమబద్ధమైన సంప్రదింపులతో అమలులోకి వచ్చిందినీతి ఆయోగ్ఆటోమొబైల్ తయారీదారులుచమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు), ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ), సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (ఎస్ఐఏఎం), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపీ), ఇతర సాంకేతిక సంస్థల భాగస్వామ్యంతో దశలవారీగా ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు.

ఇథనాల్ కొత్త ఇంధనమేమీ కాదుశతాబ్దానికి పైగా ప్రపంచవ్యాప్తంగా దీని వినియోగం ఉనికిలో ఉందిబ్రెజిల్ వంటి దేశాలు దశాబ్దాలుగా అత్యధిక శాతంలో ఇథనాల్ మిశ్రమాన్ని ఉపయోగిస్తున్నాయిభారత్‌లో 2001లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. 2006లో ఈ5ను ప్రవేశపెట్టారు. 2013-14 నాటికి ఇథనాల్ మిశ్రమం 1.53 శాతం వద్ద మాత్రమే ఉండేదిఆ తర్వాత అవసరమైన ఉత్పాదక సామర్థ్యంమౌలిక సదుపాయాలునిబంధనల వ్యవస్థను బలోపేతం చేస్తూ క్రమంగా దీని శాతాన్ని పెంచుతూ వచ్చారు.

అధిక శాతం ఇథనాల్ మిశ్రమాల పంపిణీకి ముందే విస్తృత స్థాయి సమీక్షలు జరిగాయిఆటోమొబైల్ తయారీదారులుఎస్ఐఏఎంఏఆర్ఏఐవాహన విడిభాగాల తయారీదారులుపరీక్షా సంస్థలుచమురు మార్కెటింగ్ కంపెనీలతో సమగ్రంగా చర్చించిన తర్వాతే ఈ విధానాన్ని మార్కెట్‌లోకి తీసుకువచ్చారు.

-20 పెట్రోల్ వాడకం వల్ల ఇంధన సామర్థ్యంఇంజిన్ పనితీరునిర్వహణ ఖర్చులుడ్రైవింగ్ అనుభవంపై వాహన తయారీదారులుఆటోమొబైల్ సంఘాలువినియోగదారుల సంస్థల నుంచి ఎలాంటి విస్తృతమైన లేదా ఆధారాలతో కూడిన ఫిర్యాదులూ ప్రభుత్వానికి అందలేదుప్రసార మాధ్యమాలుసోషల్ మీడియాలో వ్యక్తమైన కొన్ని అనుమానాలను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయంగా దీనిని పరిశీలించింది.

 

ఏఆర్ఏఐఎస్ఐఏఎంఐఓసీఎల్,ఐఐపీవాహన తయారీ సంస్థలు కలసి విస్తృత స్థాయి ప్రయోగశాల పరీక్షలుక్షేత్రస్థాయి పరీక్షలు నిర్వహించాయిఇంజిన్ మన్నికవాహన ప్రయాణ శైలిస్టార్టింగ్ సామర్థ్యంతుప్పు పట్టకుండా ఉండే గుణంవిడిభాగాల అనుకూలతఉద్గారాలుఇంధన సామర్థ్యం వంటి అన్ని అంశాలను సమగ్రంగా పరిశోధించాయినిర్ణీత ప్రమాణాల ప్రకారం ఈ-20 పెట్రోల్ వాడకం పూర్తి సురక్షితమని ఈ అధ్యయనాలు స్పష్టం చేశాయి.

పాత తరం వాహనాల పనితీరులో తీవ్ర వ్యత్యాసాలు గానీవిడిభాగాల అసాధారణ అరుగుదల గానీ జరగడం లేదని ఈ పరిశోధనలు తేల్చాయివిస్తృత ప్రయోగశాల పరీక్షలుక్షేత్రస్థాయి పరిశీలనలునిజరూప వినియోగ అనుభవాలు... దేనిలోనూ ఈ-20 ఇంధనం వల్ల వాహనాల పనితీరుపై పెద్ద ప్రతికూల ప్రభావం పడలేదని స్పష్టమైంది.

ప్రభుత్వ అంచనాలు కేవలం ప్రయోగశాల పరిశోధనలకే పరిమితం కాలేదుదేశవ్యాప్తంగా అమలు చేసిన తర్వాత కూడా లభించిన విస్తృత అనుభవం ఆధారంగా రూపుదిద్దుకున్నాయిదేశంలో ప్రతిరోజూ సుమారు కోట్ల వాహనాలు పెట్రోల్ బంకులకు వస్తుంటాయివీటిలో దాదాపు 80 శాతం పెట్రోలు వాహనాలే ఉన్నాయి.

15 ప్లస్ మిశ్రమ పెట్రోలు గత మూడేళ్లన్నర కాలంగా19-20 ఇంధనం రెండేళ్లన్నరగా వినియోగంలో ఉన్నాయిదేశంలో 20 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు, 3 కోట్లకు పైగా పెట్రోల్ కార్లు ఈ మిశ్రమ ఇంధనంతో నడుస్తున్నాయిఇథనాల్ మిశ్రమం వల్ల ఇంజిన్ వైఫల్యం లేదా వాహనాలు నిలిచిపోవడం వంటి ఆధారాలు ఎక్కడా లభించలేదు20 ఇంధనం వల్ల ఎలాంటి అసాధారణ తుప్పుఅరుగుదల లేదా వాహన జీవితకాలం తగ్గడం లేదని వాహన తయారీదారుల సర్వీస్ డేటా ధ్రువీకరించింది20 ఇంధనాన్ని ఉపయోగిస్తున్న వాహనాలకు తయారీదారులు వారంటీ సదుపాయాన్ని కొనసాగిస్తుండటం ఈ ఇంధన సురక్షతవిశ్వసనీయతపై మరింత నమ్మకాన్ని పెంచుతోంది.

ఒక ప్రముఖ వాహన తయారీ సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2.84 కోట్ల వాహనాలకు సర్వీసింగ్ నిర్వహించిందిఇందులో మొదట్లో ఈ20 రహితంగా తేలిన దాదాపు 1.5 కోట్ల వాహనాలు కూడా ఉన్నాయిఈ సర్వీసింగ్‌లో ఈ20 వల్ల తుప్పు పట్టడంఅసాధారణ అరుగుదలవిడిభాగాల జీవితకాలం తగ్గడం వంటి సమస్యలేవీ నమోదు కాలేదుఒక ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ కూడా ఇలాంటి క్షేత్రస్థాయి అనుభవాన్నే నివేదించిందిదీర్ఘకాలంగా ఈ20 ఇంధనంతో నడుస్తున్న 1.4 కోట్ల వాహనాల డేటాను పరిశీలించగా... ఇథనాల్ వల్ల ఎలాంటి తుప్పు పట్టిన ఆధారాలు లేవని మరొక వాహన సంస్థ ఇటీవల స్పష్టం చేసిందివినియోగదారులకు చేరేముందు వాహనాలు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కఠినమైన పరీక్షలు పూర్తి చేసుకుంటాయని ఏఆర్‌ఏఐ స్పష్టం చేసింది.

 

మైలేజీ విషయానికి వస్తే... డ్రైవింగ్ పరిస్థితులుడ్రైవింగ్ అలవాట్లువాహన నిర్వహణ వంటి పలు అంశాలు ఇంధన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయని ప్రభుత్వ సంస్థలువాహన తయారీదారుల పరిశోధనలు వెల్లడించాయి10 కోసం రూపొందించిన కొన్ని వాహనాల్లో మైలేజీ తగ్గుదల సాధారణంగా కేవలం నుంచి శాతం వరకు మాత్రమే పరిమితమవుతుందిమరోవైపు ఈ20 ఇంధనం అత్యధిక ఆక్టేన్ రేటింగ్మెరుగైన యాంటీ నాక్ గుణాలుస్వచ్ఛమైన దహన ప్రక్రియసున్నితమైన ఇంజిన్ పనితీరును అందిస్తుంది.

 

ఆటోమొబైల్ తయారీదారులు, విడిభాగాల సరఫరాదారులుఎస్ఐఏఎంఏఆర్ఏఐపరీక్షా ఏజెన్సీలుచమురు మార్కెటింగ్ సంస్థలు ఈ20 శాస్త్రీయ మూల్యాంకనంక్రమబద్ధమైన విస్తరణలోని ప్రతి దశలోనూ భాగస్వామ్యమయ్యాయిఇంధన వ్యవస్థలుఇంజిన్ మన్నికడ్రైవింగ్ అనుకూలతభాగాల పొందికఉద్గారాల పనితీరుపై విజయవంతమైన నిర్ధారణ తర్వాతే ఈ20 అందుబాటులోకి వచ్చిందిపాత తరం వాహనాలు సైతం ఈ20 వల్ల పనితీరులో ఎలాంటి తీవ్ర వ్యత్యాసాలుఅసాధారణ అరుగుదలను ప్రదర్శించడం లేదని ఈ పరిశోధనలు నిరూపించాయి.

 

ఈ20 ఇంధనం యాక్సిలరేషన్ప్రయాణ సౌఖ్యాన్ని మెరుగుపరుస్తూనే కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందని ఎస్ఐఏఎంఏఆర్ఏఐ ధ్రువీకరించాయిఇథనాల్‌లోని అధిక ఆక్టేన్ సంఖ్య ఆధునిక హై కంప్రెషన్ ఇంజిన్లకు బాగా తోడ్పడుతుందిదీనిలోని అధిక బాష్పీభవన వేడి దహన సామర్థ్యాన్ని పెంచుతుంది.

 

ఈ20కి మారడం ద్వారా దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరిందిఇథనాల్ మిశ్రమ పెట్రోలు కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు రూ.1.97 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అయిందిదాదాపు 316 లక్షల మెట్రిక్ టన్నుల ముడిచమురు దిగుమతులు తగ్గాయిసుమారు 952 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు నియంత్రణలోకి వచ్చాయిఅంతేకాకుండా రైతుల ఖాతాల్లోకి రూ.1.66 లక్షల కోట్లకు పైగా జమ అయ్యాయి.

చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీలుఇంధన సేకరణమిశ్రమంనిల్వరవాణాపంపిణీ వంటి అన్ని దశల్లో కఠినమైన ప్రామాణిక నిర్వహణ విధానాలను అనుసరిస్తున్నాయిఇంధన నాణ్యతను డిస్టిల్లరీడిపోపెట్రోల్ బంకుల వద్ద నిరంతరం విశ్లేషిస్తున్నారువచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కల్తీని గుర్తించడానికినాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఇంధనం మాత్రమే వినియోగదారులకు అందేలా చూసేందుకు సగటున గత 10, 20 రోజులలోనే చమురు సంస్థలు బంకుల్లో 30,000 కంటే ఎక్కువ నాణ్యతా తనిఖీలను నిర్వహించాయిఇంధన కల్తీ ఘటనలపై ఉపేక్షించవద్దనికఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను సైతం కోరింది.

ఈ20 ఇంధనానికి సంబంధించిన సందేహాలుఫిర్యాదులుసూచనలను స్వీకరించి వాటిపై విచారణ జరిపి పరిష్కరించడానికి ప్రభుత్వ రంగానికి చెందిన చమురు మార్కెటింగ్ సంస్థలు బలమైన వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలను ఏర్పాటు చేశాయివినియోగదారులు ఆఫ్‌లైన్ఆన్‌లైన్ మార్గాల ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చుపెట్రోల్ బంకుల్లో అందుబాటులో ఉండే ఫిర్యాదుల రిజిస్టర్లుప్రత్యేక టోల్-ఫ్రీ కస్టమర్ కేర్ నంబర్లుకంపెనీ వెబ్‌సైట్లుమొబైల్ యాప్‌లుకస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ (సీఆర్ఎంవ్యవస్థలుసామాజిక మాధ్యమ వేదికలు-మెయిల్సీపీజీఆర్ఏఎంఎస్ ద్వారా సమస్యలను నివేదించవచ్చుతక్షణ పరిష్కారం కోసం డీలర్లుసంబంధిత క్షేత్రస్థాయి అధికారుల సంప్రదింపు వివరాలను పెట్రోల్ బంకుల్లో స్పష్టంగా ప్రదర్శించారుఈ మార్గాల ద్వారా వచ్చే ఫిర్యాదులన్నింటినీ ఓఎంసీ నిబంధనల ప్రకారం విచారించినిర్ణీత వ్యవధిలో పరిష్కరిస్తున్నారు.

అన్ని పెట్రోల్ వాహనాలకు ఈ20 ఇంధనం సాంకేతికంగా సరిపోతుందనిపనితీరులో సమస్యలు రావని వినియోగదారులకు వివరించేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారుఇథనాల్ మిశ్రమం ద్వారా చేకూరే పర్యావరణ మేలుదేశ ఇంధన భద్రత ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తున్నారుఫిర్యాదుల పరిష్కార వ్యవస్థల ద్వారా వచ్చే వినియోగదారుల అభిప్రాయాలను చమురు సంస్థలు నిరంతరం పరిశీలిస్తున్నాయిఇథనాల్ మిశ్రమ పెట్రోలు (ఈబీపీకార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూనేవినియోగదారులలో నమ్మకాన్ని పెంచేందుకు అవసరమైన సరిదిద్దే చర్యలు తీసుకుంటున్నారు.

ఈ సమాచారాన్ని కేంద్ర పెట్రోలియంసహజ వాయువు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ సురేష్ గోపి నేడు లోక్‌సభలో ఇచ్చిన ఓ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

***


(रिलीज़ आईडी: 2288653) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Tamil