ప్రధాన మంత్రి కార్యాలయం
56వ అంతర్జాతీయ భౌతికశాస్త్ర ఒలింపియాడ్ (ఐపీహెచ్ఓ)-2026లో బంగారు పతకాలు గెలిచిన భారతీయ బృందానికి ప్రధానమంత్రి అభినందనలు
प्रविष्टि तिथि:
13 JUL 2026 1:13PM by PIB Hyderabad
కొలంబియా.. బుకారామాంగాలో నిర్వహించిన 56వ అంతర్జాతీయ భౌతికశాస్త్ర ఒలింపియాడ్ (ఐపీహెచ్ఓ)-2026లో బంగారు పతకాలు గెలిచిన భారతీయ బృందం- శ్రీ కనిష్క్ జైన్, శ్రీ రిద్ధేశ్ అనంత్ బెండాలే, శ్రీ రుషిత్ గర్గ్, శ్రేష్ఠ్ సురైయా, స్వరిత్ జోషీలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
వారు సాధించిన ఈ విజయం దేశ యువత అపరిమిత సత్తాకీ, విజ్ఞానశాస్త్రం, పరిశోధన అంటే వారికి ఉన్న మక్కువకీ మరో ఉదాహరణ అని ప్రధానమంత్రి అన్నారు.
గత దశాబ్దంలో ఈ వేదికకు సంబంధించిన వివిధ సంచికలలో భారతీయ విద్యార్థులు అసాధారణంగా రాణించారని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ :
‘‘కొలంబియా.. బుకారామాంగాలో నిర్వహించిన 56వ అంతర్జాతీయ భౌతికశాస్త్ర ఒలింపియాడ్(ఐపీహెచ్ఓ)-2026 లో బంగారు పతకాలు గెలిచిన భారతీయ బృందం శ్రీ కనిష్క్ జైన్, శ్రీ రిద్ధేశ్ అనంత్ బెండాలే, శ్రీ రుషిత్ గర్గ్, శ్రేష్ఠ్ సురైయా, స్వరిత్ జోషీలకు అభినందనలు.
వారు సాధించిన ఈ విజయం దేశ యువతలో ఉన్న అపరిమిత సత్తాకీ, విజ్ఞానశాస్త్రం, పరిశోధన అంటే వారికి ఉన్న మక్కువకీ మరో ఉదాహరణగా నిలిచింది. గత దశాబ్దంలో ఈ వేదికకే సంబంధించిన వివిధ సంచికలలో భారతీయ విద్యార్థులు అసాధారణంగా రాణించడం కూడా ప్రశంసనీయమే’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2284110)
आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
Assamese
,
Marathi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Bengali
,
Bengali-TR
,
English
,
Urdu
,
हिन्दी
,
Punjabi