గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వీబీ-జీ-రామ్-జీ కోసం మొదటి విడతగా రాష్ట్రాలకు రూ. 25,863 కోట్లు విడుదల


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఒకే రోజున విజయవంతంగా, సజావుగా అమల్లోకి వీబీ-జీ-రామ్-జీ

ఏ రాష్ట్రంలోనూ రోజుకు రూ.300 కంటే తక్కువ వేతన రేటు ఉండదు

సకాలంలో వేతనాల చెల్లింపులు, పారదర్శకత, నాణ్యమైన ఆస్తులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

प्रविष्टि तिथि: 05 JUL 2026 1:03PM by PIB Hyderabad

వీబీ-జీ-రామ్-జీ పథకం పథకం అమలు కోసం రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు మొదటి విడతగా రూ.25,863 కోట్ల నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారుఅన్ని రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి మంత్రులతో వీడియో అనుసంధానం ద్వారా ఈ రోజు నిర్వహించిన సమావేశంలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) [వీబీ-జీ-రామ్-జీపథకం అమలు తీరును ఆయన సమీక్షించారుఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలకు తొలి విడత నిధులు విడుదల చేశారు.

ఈ సమావేశంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ... దేశవ్యాప్తంగా ఎలాంటి అంతరాయం లేకుండా వీబీ-జీ-రామ్-జీ పథకాన్ని 2026 జూలై నుంచి అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారుదేశవ్యాప్తంగా ఈ పథకం విజయవంతంగా అమలు కావడం... ఎంజీఎన్ఆర్ఈజీఏ నుంచి వీబీ-జీ-రామ్-జీకి పరివర్తన సక్రమంగాసజావుగా జరగడం సంతోషం కలిగించిందని ఆయన తెలిపారుఇప్పటి వరకు ఎలాంటి సాంకేతికసమస్యలు తలెత్తినట్లు సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు.

పేద కార్మికులకు సేవ చేయడం దేవుడికి సేవ చేసినట్లేనని కేంద్ర మంత్రి అన్నారుగ్రామీణ కార్మికులకు గౌరవప్రదమైన ఉపాధిసకాలంలో వేతన చెల్లింపులుమన్నికైన గ్రామీణ ఆస్తుల సృష్టిని నిర్ధారించడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా ఎంజీఎన్ఆర్ఈజీఏ అమలు కావడానికి దాదాపు మూడేళ్లు పట్టగావీబీ-జీ-రామ్-జీని ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా అమలు చేశామని శ్రీ చౌహాన్ పేర్కొన్నారుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంరాష్ట్రాల సహకారందేశ పరిపాలనా సామర్థ్యం కారణంగానే ఇది సాధ్యమైందని తెలిపారుదీనిని ఒక గొప్ప విజయంగా ఆయన అభివర్ణించారుఇది ప్రధానమంత్రి నిబద్ధతసుపరిపాలనసమర్థమైన సమన్వయాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.

పథకం ప్రాథమిక పురోగతిని సమావేశంలో ఆయన సమీక్షించారుమొదటి వారంలోనే పెద్ద సంఖ్యలో గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమయ్యాయనీలక్షలాది గ్రామీణ కార్మికులకు ఉపాధి లభించిందని కేంద్ర మంత్రి తెలిపారుతొలి రోజే పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించిన ఆంధ్రప్రదేశ్కేరళరాజస్థాన్‌లను ఆయన ప్రత్యేకంగా అభినందించారుమిగిలిన గ్రామ పంచాయతీల్లోనూ వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని ఒడిశాపశ్చిమ బెంగాల్‌లను ఆయన కోరారుఈ పథకాన్ని నోటిఫై చేసిఅవసరమైన బడ్జెట్ కేటాయింపులు చేయాలని జార్ఖండ్‌ను అభ్యర్థించారుఆర్‌బీఐ ఖాతాలుఇతర లాంఛనాలు ఇంకా పెండింగ్‌లో ఉన్న రాష్ట్రాలూ వాటిని నిర్ణీత కాలపరిమితిలోగా పూర్తి చేయాలని కోరారు.

వీబీ-జీ-రామ్-జీ కింద వేతన రేట్లను సగటున సుమారు 10 శాతం పెంచినట్లు ఆయన తెలిపారుదేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇకపై రోజుకు రూ.300 కంటే తక్కువ వేతన రేటు ఉండదని ఆయన స్పష్టం చేశారుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గ్రామీణ కార్మికుల ఆదాయంసామాజిక భద్రత బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

15 రోజుల్లోగా వేతనాలు చెల్లించేందుకు రాష్ట్రాలకు తగిన నిధులు అందుబాటులో ఉండేలా చూడటమే లక్ష్యంగా ఈ రోజు తొలి విడతగా రూ.25,863 కోట్లు విడుదల చేసినట్లు శ్రీ చౌహాన్ తెలిపారువేతనాల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా ఉండేందుకుఅన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధులనూ సకాలంలో విడుదల చేయాలని ఆయన కోరారు.

వీబీ-జీ-రామ్-జీ పథకాన్ని సమర్థంగా అమలు చేయడానికి నిధుల కొరత ఉండదని ఆయన స్పష్టం చేశారురాష్ట్రాల నుంచి అందిన డిమాండ్ ఆధారంగా తొలి విడత నిధులను విడుదల చేశామని తెలిపారుసమ్మిళితభాగస్వామ్య గ్రామీణాభివృద్ధిని నిర్ధారించడానికి గ్రామ సభలుగ్రామ పంచాయతీలు స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను ఎంపిక చేసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు.

పారదర్శకతజవాబుదారీతనాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ... ఫేస్ అథెంటికేషన్జియో-ట్యాగింగ్ఇతర సాంకేతిక చర్యలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కేంద్ర మంత్రి సూచించారుఈ పథకంలో ఎలాంటి అవకతవకలకూమోసానికీ తావులేదనీ... పారదర్శకతవిశ్వసనీయతనాణ్యమైన ఆస్తుల సృష్టిని నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.

రాష్ట్రాలకు నిరంతర మద్దతునందించడం కోసం సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్న అధికారుల నేతృత్వంలో మంత్రిత్వ శాఖ ఏరియా అధికారులను నియమించిందనీ ఆయన తెలిపారుఈ అధికారులు రాష్ట్రాలతో నిరంతర సమన్వయం చేసుకుంటూఅమలుకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చూస్తారని శ్రీ చౌహాన్ వివరించారు.

సకాలంలో వేతనాలు చెల్లించడం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత అని శ్రీ చౌహాన్ పేర్కొన్నారుభారత ప్రభుత్వం తొలి విడత నిధులను సకాలంలో విడుదల చేసి తన బాధ్యతను నెరవేర్చిందనీ... అర్హులైన ప్రతి కార్మికుడికి నిర్దేశిత కాలపరిమితిలోగా వేతనాలు అందించడం కోసం రాష్ట్రాలూ తమ వాటాను వెంటనే విడుదల చేస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సమావేశానికి గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసానిసహాయ మంత్రి శ్రీ కమలేశ్ పాశ్వాన్వివిధ రాష్ట్రాలు-కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి మంత్రులుగ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ రోహిత్ కన్సల్సంయుక్త కార్యదర్శి శ్రీమతి రోహిణి ఆర్భజిభకరేమంత్రిత్వ శాఖ అధికారులురాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులూ హాజరయ్యారు.

 

***


(रिलीज़ आईडी: 2281439) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam