ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రతి లక్ష్యాన్ని సాధించడానికి ఐక్యత అవసరమని వివరించే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
30 JUN 2026 11:00AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకున్నారు.
‘‘సమానో మంత్రః సమితిః సమానీ సమానం మనః సహ చిత్తమేషామ్।
సమానం మంత్రమభి మంత్రయే వః సమానేన వో హవిషా జుహోమి॥’’
మన సంకల్పాలు, ఆలోచనలు, భావోద్వేగాలు అన్నీ ఒకే తాటిపైకి వచ్చినప్పుడు మనం చేపట్టే ప్రతి ప్రయత్నమూ విజయవంతమవుతుంది. భారతవర్షం (భారతదేశం) ప్రతి లక్ష్యాన్ని సాధించడానికి మనమందరం ఇలాంటి ఐక్యతా భావంతోనే ముందుకు సాగాలని ఈ సుభాషితం తెలుపుతుంది.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘మన సంకల్పాలు, ఆలోచనలు, మనసులోని భావోద్వేగాలన్నీ ఒక్కటైనప్పుడు మనం చేపట్టే ప్రతి పని విజయవంతమవుతుంది. మనమందరం ఐక్యతతో ముందుకు సాగుదాం. కలిసికట్టుగా దేశపు ప్రతి లక్ష్యాన్ని సాధిద్దాం’’ .
‘‘సమానో మంత్రః సమితిః సమానీ సమానం మనః సహ చిత్తమేషామ్।
సమానం మంత్రమభి మంత్రయే వః సమానేన వో హవిషా జుహోమి॥’’
(रिलीज़ आईडी: 2279617)
आगंतुक पटल : 5