పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నిర్భయ్ చేతన ప్రారంభం: క్షేత్ర స్థాయిలో మహిళల భద్రత, లింగ సమానత్వ అంశాలపై 17.5 లక్షల మందికి పైగా పురుష ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు సన్నాహాలు


నిర్భయ నిధి ద్వారా మొదటి జాతీయ కార్యక్రమం.. 28,500 మంది ప్రధాన శిక్షకుల బృందాన్ని సిద్ధం చేయటమే లక్ష్యం

प्रविष्टि तिथि: 20 JUN 2026 12:21PM by PIB Hyderabad

కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ నిర్భయ నిధి ప్రాజెక్టు ద్వారా జూన్ 17, 2026 నుంచి 19 వరకు న్యూఢిల్లీలో నిర్భయ్ చేతనపై శిక్షకులకు మూడు రోజుల శిక్షణా (టీఓటీకార్యక్రమాన్ని నిర్వహించిందిప్రపంచంలోనే అతిపెద్ద అవగాహనా ప్రచార కార్యక్రమంగా గుర్తింపు పొందిన నిర్భయ్ చేతన.. మహిళల భద్రతరక్షణతో కూడిన మహిళా సంబంధిత అంశాలపై పురుషులకు అవగాహన కల్పించే కీలక జాతీయ కార్యక్రమంక్షేత్రస్థాయిలో లింగ సమానత్వంతో కూడిన పాలనను బలోపేతం చేయటమే దీని లక్ష్యంట్రాన్స్‌ఫార్మ్ రూరల్ ఇండియా సంస్థ రూపొందించిన నిర్భయ్ చేతన శిక్షణ ప్రణాళికను ఈ కార్యక్రమంలో ప్రారంభించారుపంచాయతీ రాజ్ సంస్థల్లో లింగ సమానత్వంమహిళల భద్రతహక్కులునాయకత్వం వంటి అంశాలపై పురుష ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేసేలా ప్రధాన శిక్షకుల బృందాన్ని తయారు చేయటమే ఈ కార్యక్రమ ఉద్దేశంమొదటి బృందంలో ఆరు రాష్ట్రాలు.. అస్సాంఛత్తీస్‌గఢ్హిమాచల్‌ప్రదేశ్మహారాష్ట్రఒడిశాఉత్తరాఖండ్ నుంచి సుమారు 40 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారుదేశంలోని అన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించేలా రూపొందించిన శిక్షణా నమూనాకు ఈ తొలి బ్యాచ్ కీలకంగా నిలుస్తుంది.

ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్ మాట్లాడుతూ.. మహిళలకు భద్రతగౌరవంసమాన భాగస్వామ్యాన్ని కల్పించకుండా వికసిత్ భారత్ కల సాకారం కాదని స్పష్టం చేశారుక్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచనా విధానాలుప్రవర్తనల్లో అర్థవంతమైన మార్పును తీసుకురాగల సామాజికప్రజాస్వామ్య పరివర్తన సంస్థలుగా పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారునిర్భయ్ చేతన ఉద్దేశాన్ని తెలియజేస్తూ... మహిళల గౌరవంభద్రతవారికి లభించే అవకాశాలను అభివృద్ధికి కీలక ఆధారాలుగా మార్చటం ద్వారా లింగ వివక్ష లేని నాయకత్వాన్ని పెంపొందించటానికి ఈ కార్యక్రమం కృషి చేస్తుందని పేర్కొన్నారుకేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సుశీల్ కుమార్ లోహాని మాట్లాడుతూ... మహిళల భద్రతగౌరవాన్ని కాపాడటం.. సమాజ ఉమ్మడి బాధ్యతని తెలిపారులింగ సమానత్వ పాలనను పెంపొందించటంలో మహిళలుబాలికల కోసం మరింత సురక్షితమైనఅనుకూలమైన వాతావరణాన్ని కల్పించటంలో పంచాయతీలది కీలక పాత్రని స్పష్టం చేశారుపురుష ప్రజాప్రతినిధుల్లో అవగాహనసున్నితత్వంజవాబుదారీతనాన్ని పెంపొందించటమే నిర్భయ్ చేతన ముఖ్య లక్ష్యమని అన్నారుతద్వారా వారి పరిధిలోని సమాజంలో మహిళల భద్రతగౌరవంనాయకత్వంమహిళా సాధికారతకు ముందుండి పోరాడేలా ఈ కార్యక్రమం ప్రజాప్రతినిధులను సన్నద్ధం చేస్తుందని వివరించారు.

లింగ సమస్యలుసామాజిక మూస పద్ధతులను సవాలు చేయటానికిలింగ సమానత్వంతో కూడిన నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు నిపుణుల ఉపన్యాసాలుబృంద చర్చలుకేస్ స్టడీస్అనుభవపూర్వకంగా నేర్చుకోవటం వంటి భాగస్వామ్య పద్ధతులను ఈ కార్యక్రమం అవలంబించిందిఇందులో భాగంగా ప్రగతిశీల పురుష స్వభావంసమాజ భాగస్వామ్యంమహిళల భద్రతగౌరవంసమగ్రతను పెంపొందించటంలో పంచాయతీల పాత్ర వంటి కీలకమైన అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు.

నిర్భయ్ చేతన గురించి

మార్చి 11, 2026న ప్రారంభమైన నిర్భయ్ రహో కార్యక్రమంలో కీలక భాగం నిర్భయ్ చేతనఈ నిర్భయ్ రహో కార్యక్రమంలో పరస్పర అనుబంధం గల మూడు అంశాలున్నాయిఅవిఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధుల్లో సామర్థ్యాన్ని పెంపొందించటంచట్టపరమైన అవగాహన కల్పించటంపై "నిర్భయ్ నేత్రిదృష్టి సారిస్తుందిలింగ సమానత్వంమహిళల భద్రతపై పురుష ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు "నిర్భయ్ చేతనకృషి చేస్తుందిపంచాయతీల్లో సాంకేతిక ఆధారిత భద్రతా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటం కోసం గ్రామీణ ప్రాంతాల్లోని కీలక ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటును "నిర్భయ్ దృష్టిపరిశీలిస్తుందినిర్భయ్ చేతన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 17.5 లక్షల మందికి పైగా పురుష ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు వీలుగా రాష్ట్రజిల్లాబ్లాక్ స్థాయిల్లో 28,500 మంది ప్రధాన శిక్షకుల బృందాన్ని సిద్ధం చేస్తారు.

***


(रिलीज़ आईडी: 2275859) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Kannada , Urdu , हिन्दी , Gujarati , Tamil , Malayalam