ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

ఎన్నికైన ప్రధానమంత్రిగా భారతదేశంలో సుదీర్ఘ కాలం కొనసాగిన శ్రీ నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ఉప రాష్ట్రపతి


ప్రధానమంత్రి మోదీ దార్శనిక నాయకత్వం, 'దేశమే తొలి ప్రాధాన్యత' పట్ల అంకితభావాన్ని ప్రశంసించిన ఉప రాష్ట్రపతి

ప్రధానమంత్రి మోదీ అవిశ్రాంత సేవలను కొనియాడిన ఉప రాష్ట్రపతి... సమకాలీన భారతదేశానికి ఆయన "యుగ పురుషుడు" అని అభివర్ణన

प्रविष्टि तिथि: 10 JUN 2026 12:30PM by PIB Hyderabad

భారతదేశంలో సుదీర్ఘ కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా కొనసాగిన శ్రీ నరేంద్ర మోదీకి భారత ఉప రాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధానమంత్రి దూరదృష్టితో కూడిన నాయకత్వంలో భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ఈ విజయం చారిత్రక ఘట్టమనిఇది పరివర్తనాత్మక యుగాన్ని ప్రతిబింబిస్తోందని సోషల్ మీడియా సందేశం ద్వారా ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు.

 

ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణసామాజిక సాధికారతసాంకేతిక పురోగతితో సహా ప్రతి రంగంలోనూ భారత్ గణనీయమైన పురోగతిని సాధించిందని ఆయన పేర్కొన్నారుఅంతర్జాతీయంగా మెరుగైన భారత్ ప్రతిష్ఠపునరుత్తేజం పొందిన నాగరికత విశ్వాసం ఈ కాలానికి విశిష్ట లక్షణాలుగా ఆవిర్భవించాయని అభిప్రాయపడ్డారు.

అందరికీ అభివృద్ధి చేకూరాలనే ప్రధానమంత్రి సంకల్పాన్ని కొనియాడుతూ... దేశంలో 25 కోట్లకు పైగా ప్రజలు అత్యంత పేదరికం నుంచి బయటపడ్డారనిఇది కోట్ల మంది కుటుంబాల్లో కొత్త ఆశలనుఅవకాశాలనుఆత్మ గౌరవాన్ని నింపిందని శ్రీ సీపీ రాధాకృష్ణన్ అన్నారు.

భారతదేశ గొప్ప సంస్కృతినాగరిక వారసత్వాన్ని పరిరక్షించేందుకుప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి చేస్తున్న ప్రయత్నాలను ఉప రాష్ట్రపతి ప్రశంసించారుకాలగర్భంలో కలిసిపోయిన వీరులను గౌరవించటంభారత విభిన్న సంప్రదాయాలనుభాషలను వేడుకగా జరుపుకోవటంసాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించటంవలసవాద మనస్తత్వాన్ని వీడటం ద్వారా దేశ గౌరవాన్నినాగరిక చైతన్యాన్ని ప్రధానమంత్రి బలోపేతం చేశారని అన్నారు.

ఐక్యరాజ్యసమితిలో ప్రధానమంత్రి మోదీ ప్రస్తావించిన "యాదుమ్ ఊరేయావరుమ్ కేలిర్" ("ప్రతి ప్రాంతం మన ఇల్లే.. ప్రతి ఒక్కరూ మనవారే") అనే తమిళ సూక్తిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇది భారత కాలాతీత సంప్రదాయమైన "వసుధైవ కుటుంబకంభావననువిశ్వ సోదరభావంమానవ ఐక్యతకు సంబంధించి శాశ్వత సందేశాన్ని స్పష్టం చేసిందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

భారతదేశ నాగరికత ఐక్యతను, సాంస్కృతిక వారసత్వాన్ని బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి చేపట్టిన పలు కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రస్తావించారుఈ కార్యక్రమాల్లో కాశీ తమిళ సంగమంసౌరాష్ట్ర తమిళ సంగమంనూతన పార్లమెంటు భవనంలో పవిత్రమైన సెంగోల్ ప్రతిష్ఠాపనచోళుల వారసత్వాన్ని గౌరవిస్తూ గంగైకొండ చోళపురంలో ప్రధానమంత్రి పర్యటించటంవిదేశాల నుంచి అమూల్యమైన కళాఖండాలుపురాతన వస్తువులను తిరిగి తీసుకురావటం వంటివి ఉన్నాయి.

దూరదృష్టి గల ప్రధానమంత్రి మోదీ నాయకత్వంఅవిశ్రాంత సేవ, "దేశమే తొలి ప్రాధాన్యతఅనే ఆశయానికి కట్టుబడి... దేశ ప్రజల సామర్థ్యంఆకాంక్షలపై తిరిగి విశ్వాసాన్ని నింపారని శ్రీ సీపీ రాధాకృష్ణన్ కొనియాడారుసమకాలీన భారతదేశానికి "యుగ పురుషుడు"గా శ్రీ నరేంద్ర మోదీ అవతరించారని అభివర్ణించారు.

"వికసిత్ భారత్ @2047” దిశగా దేశం పయనిస్తున్న తరుణంలో ప్రధానమంత్రి నాయకత్వం కోట్లాది మంది ప్రజలకు స్ఫూర్తినివ్వటంతో పాటు దేశ ప్రగతి ప్రయాణంలో మార్గదర్శక శక్తిగా నిలుస్తోందని ఉప రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.

దేశానికి ప్రధానమంత్రి అందిస్తున్న నిరంతర సేవలకుగానూ ఉప రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు.

***


(रिलीज़ आईडी: 2271077) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam