పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రామాల్లో మార్పును ప్రోత్సహించినందుకు 42 పంచాయతీలకు సత్కారం


న్యూఢిల్లీలో ‘జాతీయ పంచాయతీ పురస్కారాలు-25’ కార్యక్రమ నిర్వహణ

వికసిత్ భారత్‌ సాధనలో ‘గ్రామోదయ్ సే భారత్ ఉదయ్’: కీలకం శ్రీ రాజీవ్ రంజన్ సింగ్

42 జాతీయ పురస్కార విజేత పంచాయతీలలో 22 పంచాయతీలకు మహిళలే సారథులు.. అత్యుత్తమ పద్థతుల సంగ్రహ గ్రంథం ఆవిష్కరణ

प्रविष्टि तिथि: 03 JUN 2026 9:09PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా 42 శ్రేష్ఠ పంచాయతీలకు ‘జాతీయ పంచాయతీ పురస్కారాలు-25’ను కేంద్ర పంచాయతీ రాజ్మత్స్యపశు సంవర్ధకపాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ ఈ రోజు ప్రదానం చేశారుఈ కార్యక్రమంలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పిసింగ్ బఘెల్అస్సామ్ ప్రభుత్వ పరివర్తనఅభివృద్ధికార్మిక సంక్షేమటీ ట్రైబ్స్ఆదివాసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ రమేశ్వర్ తేలీపంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భారద్వాజ్కేంద్రరాష్ట్రాల సీనియర్ అధికారులతో పాటు వివిధ రాష్ట్రాలకేంద్రపాలిత ప్రాంతాల పంచాయతీ రాజ్ సంస్థలకు ఎన్నికైన ప్రతినిధులు పాల్గొన్నారుఈ పురస్కారాలు దేశమంతటా 2047 కల్లా అభివృద్ధి చెందిన భారత్ దార్శనికతకు అనుగుణంగా సమ్మిళితభాగస్వామ్య ప్రధానసుస్థిర గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించే దిశగా మార్గదర్శక తోడ్పాటును అందించిన పంచాయతీలకు గుర్తింపును ఇస్తాయి. ‘జాతీయ పంచాయతీ పురస్కారాలు-2025’తో సత్కరించిన పంచాయతీలు పూర్తి చేసిన పనులుఅనుసరించిన అత్యుత్తమ విధివిధానాలను వివరించిన ఒక ఈ-పుస్తకాన్నీపంచాయతీ రాజ్ సంస్థలను బలోపేతం చేయడానికి రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాలు అమలుచేసిన అత్యుత్తమ పద్ధతుల సంకలన గ్రంథాన్నీ కూడా ఇదే  కార్యక్రమంలో ఆవిష్కరించారుఈ పుస్తకాలు సమాన స్థాయిలో నేర్చుకోవడంతో పాటుక్షేత్ర స్థాయిలో విజయవంతమైన పరిపాలన నమూనాను అనుసరించడానికి మార్గాన్ని సుగమం చేస్తాయి.


పురస్కారాలు గెలుచుకున్న పంచాయతీలను.. అంకిత భావంతోనవకల్పనకీప్రజల ప్రయోజనాలకీ ప్రాధాన్యాన్ని ఇస్తూ పరిపాలనను సాగిస్తున్నాయంటూ కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అభినందించారుపురస్కారాలను అందుకున్న పంచాయతీల ప్రతినిధుల్నీదృశ్య మాధ్యమం ద్వారా దేశం నలుమూలల నుంచీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారుక్షేత్ర స్థాయిలో ప్రజాస్వామ్య బలం పెరుగుతోందనీవికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో పంచాయతీలు కీలక పాత్రను పోషిస్తున్నాయనీ ఈ పురస్కారాలు చాటిచెబుతున్నాయని శ్రీ సింగ్ అన్నారుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృష్టికోణాన్ని మంత్రి పంచుకుంటూసాధికారతను సంతరించుకున్న పల్లెలు సారథ్యం వహిస్తుండగా, ‘గ్రామోదయ్ సే భారత్ ఉదయ్’ సిద్ధాంతం మార్గదర్శనం చేస్తుండగా.. వికసిత్ భారత్ ప్రయాణం ముందుకు సాగాలన్నారుఅవార్డులను అందుకున్న 42 పంచాయతీలలో 22 పంచాయతీలకు మహిళలు సారథులుగా ఉన్నందుకు కేంద్ర మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారుఇది మహిళల నాయకత్వం ప్రసరింపచేస్తున్న పరివర్తనప్రధాన ప్రభావానికీగ్రామీణ భారతంలో సమ్మిళిత పాలనకీ నిదర్శనంగా నిలుస్తోందంటూ ఆయన కొనియాడారుపంచాయత్ పురోగమన సూచీ (పీఏఐ) 2.0, ‘-గ్రామ్ స్వరాజ్’కృత్రిమ మేధ ఆధారిత సభాసార్ ప్లాట్‌ఫారమ్ తదితర మంత్రిత్వశాఖ కార్యక్రమాల్ని శ్రీ సింగ్ ప్రస్తావించారుఈ కార్యక్రమాలు పంచాయతీలకు సాంకేతికతవనరులుసామర్థ్యాల పెంపుదల విషయంలో సహాయం అందజేస్తూ వాటిని పటిష్ఠపరుస్తున్నాయని వివరించారుపారదర్శకత్వంజవాబుదారుతనంపౌరుల ప్రయోజనాలకు ప్రాధాన్యాన్నిచ్చే పరిపాలన.. వీటిని నిర్ధారించడానికే ఇలా చేస్తున్నామన్నారుఅత్యుత్తమ పద్ధతులను పంచుకొంటూనవకల్పనను ప్రోత్సహిస్తూమహిళల నాయకత్వ సామర్థ్యాన్ని బలపరుస్తూసేవలను సమాజంలో ప్రతి ఒక్కరి చెంతకూ చేరుస్తూ ఆదర్శ నమూనాల్లా పనిచేయాల్సిందిగా అవార్డులను పొందిన పంచాయతీలకు ఆయన విజ్ఞప్తి చేశారుపంచాయతీలకు సాధికారతను కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ సింగ్ పునరుద్ఘాటిస్తూ, 16వ ఫైనాన్స్ కమిషన్‌లో భాగంగా కేటాయించే రూ.4.35 లక్షల కోట్లు (15వ ఫైనాన్స్ కమిషన్‌తో పోలిస్తే కేటాయింపుల్లో 84 శాతం వృద్ధిక్షేత్ర స్థాయిలో పాలనను మరింత ఎక్కువ శక్తిమంతంగా మార్చడమే కాకుండా ‘వికసిత్ భారత్’ దార్శనికతకు కూడా సాయపడగలవన్నారు.  
కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పిసింగ్ బఘెల్ మాట్లాడుతూదేశవ్యాప్తంగా 2.5 లక్షల కన్నా ఎక్కువ పంచాయతీలలో నుంచి 42 పురస్కారాలను గెలుచుకున్న పంచాయతీల ఎంపిక చేసిన ప్రక్రియ పారదర్శకత్వానికీనిర్దుష్ట మూల్యాంకన ప్రక్రియకీ అద్దం పడుతోందన్నారుఈ పురస్కారాలు స్థానిక సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎల్ఎస్‌డీజీ)తో పాటు పంచాయతీ పురోగమన సూచీ (పీఏఐ)పై ఆధారపడ్డాయనీఈ రెండూ మూల్యాంకన ప్రక్రియ వస్తుగతంగానూపనితీరును ఆధారం చేసుకొనీ చోటుచేసుకొందని నిర్ధారిస్తాయనీ ఆయన తెలిపారుఅభివృద్ధి ఫలితాలు సమాజంలో అన్ని వర్గాలకూ చేరిసమగ్ర అభివృద్ధి సాధ్యపడేటట్లు ఆరోగ్యంపింఛన్లుసామాజిక భద్రత వంటి రంగాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ అందే దిశగా చర్యలను తీసుకోవాల్సిందిగా పంచాయతీ ప్రతినిధులను కేంద్ర సహాయ మంత్రి కోరారు.
పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి శ్రీ వివేక భరద్వాజ్ తన ప్రసంగంలోపంచాయతీ రాజ్ సంస్థలు తీసుకువచ్చిన అద్భుత మార్పును వివరించారుఈ సంస్థలు డేటాను ఆధారం చేసుకొనిపారదర్శకంగాక్షేత్ర స్థాయిలో పాలనకు బాధ్యతను వహిస్తున్న సంస్థలుగా ఉన్నాయన్నారుఈ ప్రస్థానం భారత ప్రజాస్వామిక గాథలో అత్యంత స్ఫూర్తిదాయక అధ్యాయాల్లో ఒకటని ఆయన వర్ణించారుఈ శ్రేష్ఠ నమూనాల నుంచి దేశంలో పంచాయతీలు శక్తినీస్ఫూర్తినీ పొందాలని ఆయన కోరారుఅదే జరిగితే భారత్‌లో స్వపరిపాలనను భాగస్వామ్య ప్రధానమైందిగాపౌర ప్రయోజనాలకు ప్రాధాన్యాన్ని ఇచ్చేదిగా మరింత పటిష్టపరచవచ్చన్నారు.      


జాతీయ పంచాయతీ పురస్కారాల గురించిన వివరాలు
పంచాయతీ రాజ్ శాఖ ‘జాతీయ పంచాయతీ పురస్కారాల’ (ఎన్‌పీఏ)ను ఏటా అందజేస్తోందిసమ్మిళితభాగస్వామ్య ప్రధానసుస్థిర గ్రామీణాభివృద్ధికి మార్గదర్శక తోడ్పాటును అందించిన అత్యత్తమ పంచాయతీల్ని గుర్తించిప్రోత్సహించడానికి ఈ అవార్డులను ఇస్తున్నారుఈ పురస్కారాల రూపురేఖలలో 2023లో విస్తృత మార్పుచేర్పులు చేసి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీస్థానికీకరణకు చెందిన తొమ్మిది అంశాలతో జోడించారుదీంతో మూల్యాంకనం మరింత సమగ్రంగాపారదర్శకంగాభవిష్యత్తును దృష్టిలో పెట్టుకొన్నదిగా మారిందిరెండు ప్రధాన కేటగిరీలలో ‘ఎన్‌పీఏ-2025’ను బహూకరించారుసుస్థిరాభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ (ఎల్ఎస్‌డీజీ)కి సంబంధించిన తొమ్మిది అంశాల్లో విశిష్ట పనితీరును కనబరిచినందుకు 17 రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 34 గ్రామ పంచాయతీలకు ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల’ను (డీడీయూపీఎస్‌వీపీప్రదానం చేశారుఆ తొమ్మిది అంశాల్లో.. మనుషులను పేదరికం నుంచి బయటకు తీసుకు వచ్చిన ఉపాధి మార్గాలుఆరోగ్యంబాలల ప్రయోజనాలపై శ్రద్ధ తీసుకొనే పాలనచాలినంత నీటిని సమకూర్చడంస్వచ్ఛ హరిత ప్రధాన పరిసరాలుమౌలిక సదుపాయాల కల్పనసామాజిక న్యాయంభద్రతసుపరిపాలనమహిళల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తగిన చర్యల్ని తీసుకోవడం భాగంగా ఉన్నాయిఈ పంచాయతీలను పంచాయతీ పురోగమన సూచీ (పీఏఐ) 2.0 ఆధారంగా ఎంపిక చేశారు. ‘నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల’ను (ఎన్‌డీఎస్‌పీఎస్‌వీపీ) 8 పంచాయతీలకు ఇచ్చారువీటిలో అత్యుత్తమ జిల్లా పంచాయతీలు, 2 అత్యుత్తమ బ్లాకు పంచాయతీలతో పాటు అత్యుత్తమ గ్రామ పంచాయతీలు ఉన్నాయివీటన్నింటికీ మొత్తం మీద అన్నింటి కన్నా ఉత్తమ పనితీరును కనబరిచిన సంస్థలుగా గుర్తింపును ఇచ్చారుపురస్కారాలను అందుకున్న పంచాయతీలకు రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ (ఆర్‌జీఎస్ఏ)లో ఒక భాగమైన పంచాయతీలకు ప్రోత్సాహకాల అందజేత (ఐఓపీపథకంలో భాగంగా ఆర్థిక సహాయాన్ని అందించారుఈ ఆర్థిక ప్రోత్సాహకం ప్రతి పురస్కార విజేతకూ రూ.50 లక్షల మొదలు రూ.5 కోట్ల వరకూ ఉందిఈ డబ్బును రాబోయే కాలంలో చేపట్టే అభివృద్ధి కార్యకలాపాలకు ఉపయోగించాల్సి ఉంటుంది.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయవచ్చు:  please click.

 

***


(रिलीज़ आईडी: 2268914) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Kannada , Malayalam