రక్షణ మంత్రిత్వ శాఖ
బుద్ధ భగవానుని పవిత్ర అవశేషాలను మంగోలియాకు తరలించిన భారత వైమానిక దళం
प्रविष्टि तिथि:
31 MAY 2026 10:36AM by PIB Hyderabad
బుద్ధ భగవానుని పవిత్ర అవశేషాలతో భారత వైమానిక దళ (ఐఏఎఫ్) వ్యూహాత్మక రవాణా విమానం ‘ఐఎల్-76’ ఈ నెల 30న రాత్రి ఢిల్లీ నుంచి మంగోలియాకు బయల్దేరింది. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 11:25 గంటలకు ఆ దేశానికి చేరుకుంది.
మిత్ర దేశాలతో సాంస్కృతిక సంబంధాల బలోపేతం దిశగా భారత్ కృషికి తోడ్పాటుగా ‘ఐఏఎఫ్’ ఈ కార్యక్రమం చేపట్టింది.
జాతీయ లక్ష్యాల సాధనకు చేయూత సహా ప్రపంచవ్యాప్తంగా భారత సాంస్కృతిక ప్రతిష్ట విస్తరణ కార్యక్రమాలకు దోహదం చేయడంలో ఐఏఎఫ్ చొరవను ఈ అవశేషాల తరలింపు ప్రతిబింబిస్తోంది.
***
(रिलीज़ आईडी: 2267344)
आगंतुक पटल : 43