ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2026 అండర్ 23 ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో అద్భు ప్రదర్శన కనబరిచిన భారత రెజ్లర్లను అభినందించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 28 MAY 2026 8:10PM by PIB Hyderabad

వియత్నాంలోని డా నాంగ్ నగరంలో జరిగిన 2026 అండర్ 23 ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో అద్భుత ప్రదర్శనను కనబరిచిన భారత రెజ్లర్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.

ఈ ఛాంపియన్‌షిప్స్‌లో మన పురుషుల ఫ్రీస్టైల్మహిళల రెజ్లింగ్ జట్లు 'టీమ్ టైటిల్స్సొంతం చేసుకోవటాన్ని ప్రధాని కొనియాడారు.

పురుషుల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ జట్టు 4 స్వర్ణ పతకాలతో సహా మొత్తం పతకాలను కైవసం చేసుకుందన్న ప్రధాని.. అండర్ 23 ఆసియా ఛాంపియన్‌షిప్స్ చరిత్రలోనే ఇది భారతదేశపు అత్యుత్తమ పతకాల రికార్డు అని పేర్కొన్నారు.

మహిళల రెజ్లింగ్ బృందం కూడా 6 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 10 పతకాలను సాధించిందని ఆయన వ్యాఖ్యానించారు.

వీటితో పాటు గ్రెకో-రోమన్ రెజ్లింగ్ జట్టు కూడా మొత్తం పతకాలతో తన చరిత్రలోనే అత్యధిక పతకాలను కైవసం చేసుకుందని ప్రధానమంత్రి ప్రస్తావించారు.

రెజ్లర్లను ప్రశంసించిన ప్రధాని.. భవిష్యత్తులో వారికి మంచి విజయాలు కలగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

"మన రెజ్లర్లు అసాధారణ ప్రదర్శన కనబరిచారు.

వియత్నాంలోని డా నాంగ్‌ వేదికగా జరిగిన 2026 అండర్ 23 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో మన పురుషుల ఫ్రీస్టైల్మహిళల రెజ్లింగ్ జట్లు టీమ్ ఛాంపియన్‌షిప్ టైటిళ్లను కైవసం చేసుకున్నాయి.

పురుషుల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ జట్టు 4 స్వర్ణ పతకాలతో కలిపి మొత్తం పతకాలను కైవసం చేసుకుందితద్వారా అండర్ 23 ఆసియా ఛాంపియన్‌షిప్ చరిత్రలో భారతదేశపు అత్యధిక పతకాల రికార్డును నమోదు చేసిందిమహిళల రెజ్లింగ్ విభాగంలో స్వర్ణాలతో సహా మొత్తం 10 పతకాలు వచ్చాయిమరోవైపు గ్రెకో-రోమన్ రెజ్లింగ్ జట్టు సైతం పతకాలతో తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేస్తూ సరికొత్త చరిత్ర లిఖించింది.

మన రెజ్లర్లందరికీ అభినందనలు. రాబోయే రోజుల్లో వారు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. "

***


(రిలీజ్ ఐడి: 2266501) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , Marathi , Bengali , Assamese , English , Urdu , हिन्दी , Manipuri , Punjabi , Gujarati