ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎఫ్‌ఏఓ అగ్రికోలా పతకం అందుకున్న సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 20 MAY 2026 11:00PM by PIB Hyderabad

ఎఫ్‌ఏఓ డైరెక్టర్‌ జనరల్‌,

గౌరవనీయులారా,

మహిళలుపెద్దలకు,

నమస్కారాలు!

సాదరంగా స్వాగతం పలికినన్ను అగ్రికోలా పతకంతో సత్కరించిన ఆహారవ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓడైరెక్టర్‌ జనరల్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలుభారతదేశం గురించి ఆయన మాట్లాడిన గౌరవప్రదమైన మాటలుఎఫ్‌ఏఓకు అందించిన సేవల పట్ల అభినందనలు తెలియజేస్తున్నా.

ఇది కేవలం నాకు మాత్రమే దక్కిన గౌరవం కాదుభారత్‌లోని కోట్లాది మంది రైతులుపశుపోషకులుమత్స్యకారులువ్యవసాయ శాస్త్రవేత్తలుశ్రామికులకు దక్కిన గౌరవంమానవ సంక్షేమంఆహార భద్రతసుస్థిరాభివృద్ధి పట్ల భారత్‌కున్న అచంచలమైన నిబద్ధతకు దక్కిన గుర్తింపు ఇదిఎంతో గౌరవంగా ఈ పతకాన్ని స్వీకరిస్తూ.. భారతదేశ "అన్నదాతలకుఅంకితమిస్తున్నా.

మిత్రులారా,

భారత నాగరికతలో వ్యవసాయం అంటే కేవలం పంటలను పండించటం మాత్రమే కాదుఅది మనిషికీభూమాతకీ ఉన్న పవిత్రమైనలోతైన బంధం.

భారత్‌లో వ్యవసాయమే జీవనానికి మూలాధారంఇది మన సంస్కృతిలో కీలక భాగంమన విలువలకు ప్రతిబింబంమన సంప్రదాయంలో నేలని "భూమాతగా”రైతుని "భూమి పుత్రుడిగాఅభివర్ణిస్తారువేల ఏళ్లుగా మన వారసత్వంలో పాతుకుపోయిన ఈ కాలాతీత విలువలు నేటికీ మన ప్రయత్నాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.

మిత్రులారా,

వేల ఏళ్లుగా విజ్ఞానంభారతదేశ సుసంపన్న వ్యవసాయ సంప్రదాయాల ఆధారంగా నేడు మన దేశం శాస్త్రీయసాంకేతికఆవిష్కరణల ఆధారిత విధానంతో వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్తోంది.

మేం కేవలం ఉత్పత్తిని పెంచేందుకు మాత్రమే కాక.. స్థిరమైనవాతావరణ మార్పులను తట్టుకోగలభవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉండే వ్యవసాయ వ్యవస్థను సృష్టించేందుకు కృషి చేస్తున్నాంఇందుకోసం భారతదేశవ్యాప్తంగా శాస్త్రీయ వ్యవసాయాన్ని మిషన్ మోడ్‌లో అభివృద్ధి చేస్తున్నాం.

భూసార ఆరోగ్య కార్డుల ద్వారా రైతులకు శాస్త్రీయమైన భూ పరీక్షలనుపోషకాల ఆధారిత మార్గదర్శకత్వాన్ని మేం అందిస్తున్నాం.

"ప్రతి నీటి బొట్టుకు అధిక పంటవంటి ప్రచార కార్యక్రమాలు సూక్ష్మ నీటి పారుదలఖచ్చితత్వ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయిరైతులు తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట దిగుబడులను సాధించేలా ఇవి దోహదపడుతున్నాయి.

మిత్రులారా,

భారత వ్యవసాయానికి నూతన శక్తిగా సాంకేతికత అవతరిస్తోందిడిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలైన అగ్రిస్టాక్‌ఏఐ ఆధారిత సలహా వ్యవస్థలుడ్రోన్లురిమోట్ సెన్సింగ్ టెక్నాలజీలుసెన్సార్ ఆధారిత యంత్రాలు భారతదేశంలో వ్యవసాయాన్ని మరింత స్మార్ట్‌గాడేటా ఆధారితంగా మారుస్తున్నాయినేడు ఒక గ్రామంలోని చిన్న రైతు కూడా మొబైల్ సాంకేతికత ద్వారా వాతావరణ సమాచారాన్నిపంట సలహాలనుమార్కెట్ వివరాలను సులభంగా పొందుతున్నారు.

వాతావరణ మార్పులను తట్టుకోగల వ్యవసాయం దిశగా భారత్‌ వేగంగా అడుగులు వేస్తోందిగత పదేళ్లలో వాతావరణ మార్పులను తట్టుకోగలిగే దాదాపు 3,000 పంట రకాలను దేశంలో అభివృద్ధి చేశారుదేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ఈ ఆవిష్కరణల ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.

మిత్రులారా,

"అధిక ఉత్పత్తికాదు.. "మెరుగైన ఉత్పత్తి"లోనే వ్యవసాయ భవిష్యత్ ఉందని మేం విశ్వసిస్తున్నాంఈ దృక్పథంతో జీవవైవిధ్యాన్ని పెంపొందించటంరసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించటంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాంవిస్తరణస్థిరత్వం రెండూ కలిసి పురోగమించగలవనిసాంకేతికతసమ్మిళితత్వం పరస్పరం బలాన్ని చేకూర్చుకుంటాయనిశాస్త్రీయ ఆధారిత వ్యవసాయం ప్రపంచ ఆహార భద్రతకు బలమైన ఆధారంగా మారగలదని భారత్‌ అనుభవం ప్రపంచానికి నిరూపిస్తోంది.

మిత్రులారా,

భారత వ్యవసాయ రంగం నేడు శరవేగంగా మారుతోందిఆహారోత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించటంతో పాటుప్రపంచ ఆహార భద్రతలోనూ భారత్‌ కీలక పాత్ర పోషిస్తోందిప్రపంచంలోనే అత్యధికంగా పాలుమసాలా దినుసులను భారత్‌ ఉత్పత్తి చేస్తోందివరిగోధుమలుపండ్లుకూరగాయలుపత్తిని పండించే అగ్ర దేశాల్లోనూ ఒకటిగా భారత్‌ నిలిచిందిభారతదేశ వ్యవసాయ ఎగుమతులు కూడా భారీగా పెరిగాయి. 2020లో 35 బిలియన్ డాలర్లు ఉన్న ఎగుమతుల విలువ.. గతేడాది నాటికి 51 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

మిత్రులారా,

ప్రపంచంలోని వ్యవసాయ భూమిలో కేవలం 2.5 శాతం మాత్రమే భారత్‌లో ఉండగాప్రపంచ జనాభాలో దాదాపు 18 శాతం మంది ఇక్కడ నివసిస్తున్నప్పటికీ ఈ విజయాలు సాధించటం విశేషంభారత్‌ సాధించిన ఈ విజయం గ్లోబల్ సౌత్ మొత్తానికి స్ఫూర్తిదాయకంగా నిలవటమే కాకఅనేక దేశాలు విశ్వాసంతో ముందుకు సాగేలా చేస్తుందిభారతదేశానికి ఆహార భద్రత కేవలం విధానపరమైన అంశం మాత్రమే కాదు.. మానవాళి పట్ల ఉన్న బాధ్యత.

మిత్రులారా,

భారతదేశానికి ఎఫ్‌ఏఓతో దశాబ్దాలుగా భాగస్వామ్యం ఉందిఎం.ఎస్స్వామినాథన్బినయ్ రంజన్ సేన్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలు ఎఫ్‌ఏఓతో పనిచేసి ప్రపంచ ఆహార భద్రతకు అందించిన విశేషమైన సహకారం మనకెంతో గర్వకారణంవిజ్ఞానంవిధానాలుమానవీయ విలువలు ఒకచోట చేరినప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుందని భారత్‌ ఎల్లప్పుడూ విశ్వసిస్తోందిఎఫ్‌ఏఓ వ్యవస్థాపక సభ్య దేశంగా ప్రపంచ ఆహార భద్రతస్థిరమైన వ్యవసాయంసుభిక్షమైన ప్రపంచ నిర్మాణానికి భారత్‌ క్రియాశీలకంగా పనిచేస్తోందిఅంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా మన భాగస్వామ్యానికి అత్యుత్తమ ఉదాహరణ కనిపించిందిఆహారవ్యవసాయ సంస్థతో కలిసి మనం చేసిన ఉమ్మడి ప్రయత్నాల ద్వారా ప్రపంచం మరోసారి చిరుధాన్యాల ప్రాముఖ్యతనువాటి శక్తిని అర్థం చేసుకుందిభవిష్యత్తులోనూ మనం కలిసి పనిచేద్దాంచిరుధాన్యాల గురించి నేను మాట్లాడినప్పుడు గమనించిన విషయం ఏంటంటే.. చాలామంది వాటిలోని పోషక విలువలపైనే దృష్టి పెడతారుకానీచిరుధాన్యాలు పర్యావరణానికి ఎంతో మేలు చేసే పంటలుతక్కువ నీటితోరసాయన ఎరువులు వినియోగించకుండా వీటిని పండించవచ్చుభారత్‌లో దాదాపు 85 శాతం మంది పరిమిత భూమిలో సాగు చేసే చిన్న రైతులేనీటిపారుదల సౌకర్యం లేనివర్షాధారంగా వ్యవసాయం సాగే అనేక ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగు పోషకాహారాన్ని మెరుగుపరచటమే కాకపర్యావరణ పరిరక్షణకు ఎంతోగానో సహకరిస్తుంది.

మిత్రులారా,

భారతదేశంలో "జై జవాన్జై కిసాన్అంటాంఒక రైతు విత్తనం నాటినప్పుడు కేవలం పంటను మాత్రమే పండించడురాబోయే తరాల కోసం ఆశలను నాటుతాడునేడు ప్రపంచం అనిశ్చితిఅస్థిరతను ఎదుర్కొంటున్న తరుణంలో రైతుల సహకారం మరింత ప్రాధాన్యతను సంతరించుకుందిఈ రోజు వారికి లభించిన ఈ గౌరవం.. భారతదేశంలోని ప్రతి రైతు సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుందిఆకలిపేదరికంపోషకాహార లోపానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రపంచ పోరాటాలకు పూర్తి మద్దతును భారత్‌ అందిస్తూనే ఉంటుందిరేపు మీరు "టీ దినోత్సవంజరుపుకోనున్నట్లు ప్రస్తావించారుఆ సందర్భానికి ఒక రోజు ముందుగానే "చాయ్‌వాలామీ ముందుకు వచ్చారువైవిధ్యభరితమైన టీలకు భారత్‌ ప్రసిద్ధి చెందిందిటీకి నిజంగానే ప్రత్యేకమైన శక్తి ఉంది.

 

ఎప్‌ఏఓ డైరెక్టర్‌ జనరల్‌కు నేను మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.

మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మీకు ధన్యవాదాలు.

గమనికప్రధానమంత్రి ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదంఅసలు ప్రసంగం హిందీలో ఇచ్చారు.

 

****

 


(రిలీజ్ ఐడి: 2264552) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Gujarati , Bengali , Assamese , Kannada , Malayalam