రక్షణ మంత్రిత్వ శాఖ
హనోయ్లో ద్వైపాక్షిక చర్చలు జరిపిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, వియత్నాం ఉప ప్రధాని, రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ జియాంగ్
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతినీ, స్థిరత్వాన్నీ, భద్రతనూ, సురక్షితమైన-స్వేచ్ఛాయుతమైన వాణిజ్యాన్నీ కొనసాగించేందుకు నిబద్ధతను పునరుద్ఘాటించిన ఉభయపక్షాలు
వియత్నాంలోని ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ కాలేజీలో లాంగ్వేజ్ ల్యాబ్ను వర్చువల్గా ప్రారంభించిన మంత్రులు
ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో ఎంవోయూ కుదుర్చుకున్న ఇండియా, వియత్నాం
నహత్రాంగ్ లోని టెలి కమ్యూనికేషన్స్ విశ్వవిద్యాలయంలో ఏఐ ల్యాబ్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన రక్షణ మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
19 MAY 2026 12:38PM by PIB Hyderabad
2026 మే 19న హనోయ్లో వియత్నాం ఉప ప్రధాని, జాతీయ రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ జియాంగ్తో రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. రెండు దేశాల మధ్య వృద్ధి చెందుతున్న రక్షణ భాగస్వామ్యాన్ని నాయకులిద్దరూ సమీక్షించారు. నౌకా వాణిజ్య భద్రత, రక్షణ పరిశ్రమ, శిక్షణ, ప్రాంతీయ స్థిరత్వంలో కొనసాగుతున్న సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాల గురించి చర్చించారు.
O51F.jpeg)
ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా మారుతున్న, పరస్పరం ఆసక్తి ఉన్న భద్రతా పరిణామాలపై తమ అభిప్రాయాలను ఉభయ పక్షాలు పంచుకున్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతినీ, స్థిరత్వాన్ని, భద్రతనూ, స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన నౌకా వాణిజ్యాన్నీ కొనసాగించేందుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని స్పష్టం చేశాయి. సైనిక శిక్షణ, రక్షణ పారిశ్రామిక సహకారం, నౌకావాణిజ్య భద్రత, సామర్థ్య నిర్మాణం, ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ, సైబర్ భద్రత, అత్యున్నత స్థాయి వినిమయం తదితర అంశాల్లో సహకారాన్ని విస్తరించే మార్గాలపై చర్చించారు. క్రమం తప్పకుండా చర్చలూ, సంయుక్త విన్యాసాలూ, వినియమ కార్యక్రమాల నిర్వహణ ద్వారా రెండు దేశాల రక్షణ బలగాల మధ్య సహకారాన్ని పెంపొందించుకొనేందుకు వారు అంగీకరించారు.
AZHA.jpeg)
వియత్నాం, భారత్ మధ్య కొనసాగుతున్న విస్తరించిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యం పరిధిలో వియత్నాం రక్షణ ఆధునికీకరణకూ, సామర్థ్య విస్తరణ కార్యక్రమాలకూ తోడ్పాటునందించడంలో భారతదేశానికున్న చిత్తశుద్ధిని ఆయన పునరుద్ఘాటించారు.
వియత్నాంకు భారత్ అందిస్తున్న నిరంతర మద్దతునూ, రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహాన్నీ, పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్నీ జనరల్ ఫాన్ వాన్ జియాంగ్ ప్రశంసించారు.
077H.jpeg)
వియత్నాంలో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన లాంగ్వేజ్ ల్యాబ్ను రక్షణ మంత్రులిద్దరూ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. భారత దేశ సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. నహత్రాంగ్ లోని టెలి కమ్యూనికేషన్స్ ల్యాబ్ వద్ద ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేస్తామని రక్షణ మంత్రి ప్రకటించారు.
కృత్రిమ మేధ, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో భారత్లోని మిలటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, వియత్నాంలోని టెలి కమ్యూనికేషన్స్ విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇది రెండు దేశాల మధ్య విస్తరించిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో ముఖ్యమైన అధ్యాయాన్ని సూచిస్తుంది.
దైపాక్షిక సమావేశం అనంతరం వియత్నాం ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడు శ్రీ టో లామ్తో రక్షణ మంత్రి సమావేశమయ్యారు. భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి తరఫున ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రక్షణ-భద్రత, వాణిజ్యం-పెట్టుబడులు, నౌకా వాణిజ్య సహకారం, అనుసంధానత, డిజిటల్ పరివర్తన, ప్రజా సంబంధాలు తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడం పట్ల భారతదేశానికున్న నిబద్ధతను పునరుద్ఘాటించారు.
CQTL.jpeg)
ఉమ్మడి నాగరికతా సంబంధాలు, పరస్పర విశ్వాసం, ఉమ్మడి వ్యూహాత్మక ప్రయోజనాలపై ఆధారపడిన భారత్, వియత్నాం మధ్య ఉన్న బలమైన, శాశ్వతమైన స్నేహాన్ని నాయకులిద్దరూ పునరుద్ఘాటించారు. ఇండియా-వియత్నా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న వృద్ధి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
భారత్లో తన పర్యటనను వియత్నాం అధ్యక్షుడు గుర్తు చేసుకున్నారు. ద్వైపాక్షిక సహకారంలో సాధించిన వృద్ధిని ప్రశంసించారు. వియత్నాం అభివృద్ధి, వ్యూహాత్మక ప్రాధాన్యాల్లో కీలక భాగస్వామిగా భారత్ పోషిస్తున్న పాత్రను గుర్తించారు. రెండు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో ప్రధాన ఆధారంగా రక్షణ సహకారం బలోపేతమవడాన్ని ఆయన స్వాగతించారు. భవిష్యత్తులో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
S6K6.jpeg)
వియత్నాం వ్యవస్థాపకుడు, మాజీ అధ్యక్షుడు హో చి మిన్ 136వ జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద శ్రీ రాజ్నాథ్ సింగ్ పుష్ఫగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘‘ఆయన దార్శనికత, నాయకత్వం, జాతీయ స్వేచ్ఛ, ప్రపంచ ఐక్యత పట్ల నిబద్ధత తరతరాలకూ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఉమ్మడి విలువలు, పరస్పర గౌరవంతో కూడిన భారత్-వియత్నాం స్నేహానికి ఆయన బలమైన పునాది వేశారు’’ అని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు.
పరస్పర విశ్వాసం, ఉమ్మడి విలువలు, రక్షణ, భద్రత, ప్రాంతీయ స్థిరత్వంలో సన్నిహిత సహకారంపై ఆధారపడిన బలమైన బంధం భారత్, వియత్నాం మధ్య ఉంది.
7PHZ.jpeg)
***
(రిలీజ్ ఐడి: 2262826)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7