ప్రధాన మంత్రి కార్యాలయం
నెదర్లాండ్స్ రాజు విల్లెమ్ - అలెగ్జాండర్, రాణి మాక్సిమాలను మర్యాదపూర్వకంగా కలుసుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
16 MAY 2026 8:13PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హేగ్లోని ప్యాలెస్ హౌస్ టెన్ బాష్లో నెదర్లాండ్స్ రాజు విల్లెమ్ - అలెగ్జాండర్, రాణి మాక్సిమాలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
భారత, నెదర్లాండ్స్ ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంపై ప్రధానమంత్రి వారితో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పరస్పర సుహృద్భావాన్ని పెంపొందించడంలోనూ, ద్వైపాక్షిక సంబంధాలకు సరికొత్త ఉత్తేజాన్ని అందించడంలోనూ ప్రముఖ పాత్ర పోషించిన వారి 2019 నాటి భారత పర్యటనను ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. విద్య, ఆవిష్కరణలు, సెమీకండక్టర్, డిజిటల్, నీరు, పర్యావరణహిత భాగస్వామ్య రంగాలలో ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక కార్యక్రమాల పట్ల ఇరు దేశాల నాయకులు సంతృప్తిని వ్యక్తం చేశారు.
భారత్ పట్ల వారు చూపిస్తున్న సుహృద్భావాన్ని ప్రధానమంత్రి అభినందించారు. తన పర్యటన సందర్భంగా లభించిన ఘన ఆతిథ్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గౌరవార్థం రాజు దంపతులు విందు ఏర్పాటు చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2262033)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam