ప్రధాన మంత్రి కార్యాలయం
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిక్కిం ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
16 MAY 2026 1:32PM by PIB Hyderabad
సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది సిక్కిం తన 50వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ తరుణం, ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో సిక్కిం అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని, ప్రశంసనీయమైనదని ప్రధానమంత్రి కొనియాడారు. ఈ 50వ అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ఇటీవల తాను సిక్కింలో పర్యటించిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ... అక్కడి ప్రజలు చూపిన ఆప్యాయత, అభిమానం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘నా సిక్కిం సోదర సోదరీలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. దేశ ప్రగతిలో సిక్కిం పాత్ర ఎంతో విశిష్టమైనది. ఆ రాష్ట్ర ప్రజలు నిరంతర ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.
సిక్కిం తన 50వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో ఈ శుభ సందర్భం వచ్చింది. కొన్ని రోజుల కిందటే ఈ వేడుకల సందర్భంగా సిక్కిం ప్రజల మధ్య ఉండే అదృష్టం నాకు కలిగింది. సిక్కింలో నేను పొందిన ఆదరణ నా జ్ఞాపకాలలో చిరకాలం నిలిచిపోతుంది. రాబోయే కాలంలో కూడా సిక్కిం అభివృద్ధి పథానికి కేంద్ర ప్రభుత్వం మద్దతునిస్తూనే ఉంటుంది’’.
***
(రిలీజ్ ఐడి: 2261834)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam