రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఉగ్రవాద దాడుల విషయంలో దౌత్య ప్రకటనలకే పరిమితమయ్యే ధోరణి పోయింది...


పీఎం మోదీ ప్రభుత్వ అంకితభావానికి గుర్తు… ఆపరేషన్ సిందూర్: రక్షణ మంత్రి

‘‘త్రివిధ దళాల సైనిక పరాక్రమాన్ని ప్రదర్శించిన ఆపరేషన్ సిందూర్: సొంత విధానానికి అనుగుణంగానే ఈ ఆపరేషన్ నిర్వహించాం, నిలిపివేశాం’’

‘‘వికృత ఆలోచనా ధోరణి నుంచే ఉగ్రవాదం పుడుతుంది: మతపరమైన రంగును పులమడం లేదా హింసాత్మక భావజాలంతో ముడిపెట్టడం ద్వారా దీన్ని సమర్థించే ప్రయత్నాలు జరుగుతాయి’’

‘‘ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటే.. కార్యాచరణ, సైద్ధాంతిక, రాజకీయ కోణాల్లోనూ పోరాడాలి’’

‘‘ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) రంగంలో భారత్ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంటే, పాకిస్థాన్ ఐటీ (ఇంటర్నేషనల్ టెర్రరిజం)కు పేరు గాంచింది’’

‘‘ఏఐ అత్యుత్తమ వినియోగానికి సుదర్శన్ వైమానిక రక్షణ వ్యవస్థ ప్రధాన ఉదాహరణగా నిలుస్తుంది: ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భారతదేశం మరింత సురక్షితంగా, బలంగా మారుతుంది’’

నాడు పోస్టు చేయడమైనది: 30 APR 2026 12:35PM by PIB Hyderabad

‘‘ఉగ్రవాదులు దాడి చేస్తే దౌత్యపరమైన ప్రకటనలు జారీ చేసే పాత ఆలోచనా ధోరణితో భారతదేశం లేదనే స్పష్టమైన సందేశాన్ని ఆపరేషన్ సిందూర్ ప్రపంచానికి తెలియజేసిందిప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆలోచనలుమాటలకు మాత్రమే పరిమితం కాకుండా నిర్ణయాత్మక చర్యల ద్వారా తన అచంచలమైన నిబద్ధతను ప్రదర్శించింది’’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 2026 ఏప్రిల్ 30న న్యూఢిల్లీలో జరిగిన జాతీయ భద్రతా సదస్సులో ఆయన ప్రసంగించారుఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాద చర్యలను సహించబోమనే ప్రభుత్వ సంకల్పాన్ని స్పష్టం చేశారుబెదిరింపులకు అడ్డుకొనేందుకు ప్రభుత్వం కనబరిచిన దృఢ వైఖరిని సర్జికల్ స్ట్రైక్స్ఎయిర్ స్ట్రైక్స్ఆపరేషన్ సిందూర్ ప్రదర్శిస్తాయన్నారు.

‘‘వికృతమైన ఆలోచనలుమనస్తత్వం నుంచి ఉగ్రవాదం పుడుతుందిఇది మానవత్వంపై మాయని మచ్చతీవ్రవాదంపై పోరాటం జాతీయ భద్రతకు సంబంధించినది మాత్రమే కాదుప్రాథమికంగా మానవత్వపు మూల విలువలను కాపాడే యుద్ధంమానవ విలువలకు పూర్తి విరుద్ధంగా నిలిచే అనాగరిక భావజాలానికి వ్యతిరేకంగా చేసే పోరాటంఈ భారతీయ దృక్పథాన్ని దేశవిదేశాల్లోనూ స్పష్టం చేశాం’’ అని శ్రీ రాజనాథ్ సింగ్ అన్నారు.

ఉగ్రవాదం మనుగడలో ఉన్నంత కాలం.. అది సామాజిక శాంతికిఅభివృద్ధికిసంక్షేమానికి సవాలు విసురుతూనే ఉంటుందని రక్షణ మంత్రి అన్నారు. ‘‘ఉగ్రవాదానికి మతం రంగు పులమడం లేదా నక్సలిజం లాంటి హింసాత్మక భావజాలంతో ముడిపెట్టడం ద్వారా సమర్థించే ప్రయత్నాలు జరుగుతున్నాయిఇది అత్యంత ప్రమాదకరంఓ రకంగాఉగ్రవాదులు తమ లక్ష్యం దిశగా నెమ్మదిగా ముందుకు సాగడానికి ఇది రక్షణ కవచంలా పనిచేస్తుందిదేశ వ్యతిరేకమైన ఉగ్రవాదానికి కార్యాచరణసైద్ధాంతికరాజకీయం వంటి బహుముఖ కోణాలున్నాయిఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటే.. ఈ మార్గాల్లోనూ మనం దాన్ని ఎదుర్కోవాలి’’ అని అన్నారు.

ఉగ్రవాదానికి పాకిస్థాన్ నిరంతరాయంగా అందిస్తున్న మద్దతు గురించి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ‘‘భారత్పాకిస్థాన్ రెండింటికీ ఒకే సమయంలో స్వాతంత్ర్యం వచ్చిందిఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విషయంలో అంతర్జాతీయ గుర్తింపును భారత్ సొంతం చేసుకుందిపాకిస్థాన్‌ను మాత్రం ఐటీ అంటే ఇంటర్నేషనల్ టెర్రరిజంకు కేంద్రంగా పరిగణిస్తున్నారు.

భారత రక్షణ బలగాల సమైక్యతకుసమన్వయానికి గొప్ప ఉదాహరణగా ఆపరేషన్ సిందూర్‌ను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వర్ణించారుభారత సైన్యంనౌకాదళంవైమానిక దళం ఒకే ప్రణాళికతో ఐక్యంగా పనిచేయడం ద్వారా.. భారతదేశ సైనిక శక్తి ఇకపై విడివిడిగా పని చేయబోదనీదానికి బదులుగా ఉమ్మడిసమీకృతప్రపంచ శక్తిగా ఆవిర్భవించిందని తెలియజేశారు.

తన సొంత విధానం ప్రకారమే నచ్చిన సమయంలో ఆపరేషన్ సిందూర్‌ను భారత్ చేపట్టిందనిఆ విధానానికి అనుగుణంగానే దానిని నిలిపివేసిందని రక్షణ మంత్రి తెలియజేశారు. ‘‘మనపై దాడి చేసిన వారిని మాత్రమే ఈ ఆపరేషన్ సమయంలో అత్యంత కచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకున్నాంమన సామర్థ్యం తగ్గిపోవడం వల్ల లేదా క్షీణించడం వల్ల ఈ ఆపరేషన్‌ను నిలిపి వేయలేదుపూర్తిగా మన స్వీయ నిర్ణయాధికారంతోనే నిలిపివేశాంఈ యుద్ధాన్ని కొనసాగించేందుకు మనం సర్వసన్నద్ధులమై ఉన్నాంఆకస్మిక సంక్షోభ సమయాల్లో మన సామర్థ్యాలను వేగంగా పెంచుకోవడానికి అవసరమైన సామర్థ్యంసహజసిద్ధమైన బలం మన దగ్గర ఉన్నాయి’’ అని వెల్లడించారు.

భారత సైనిక-పారిశ్రామిక రంగం సాధారణ సమయాల్లోనే కాకుండా.. యుద్ధ సమయాల్లోనూ వేగవంతమైన సరఫరారవాణా అవసరాలను కూడా తీర్చేందుకు సైతం సర్వసన్నద్ధంగా ఉంటుందని నిరూపించుకుందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారుఆ సమయంలో అణుదాడుల బుకాయింపులు లేదా బెదిరింపులకు ఏమాత్రం వెరవకుండా తన లక్ష్యాలను భారత్ పూర్తి చేసిందని స్పష్టం చేశారు. ‘‘ఇది ‘కొత్త ప్రపంచ క్రమం’నూతన ప్రపంచ శకంలో ‘నవ భారతం’ ఇదిఉగ్రవాదానికిదానికి మద్దతు తెలిపేవారికి మధ్య ఏమాత్రం వ్యత్యాసాన్ని చూపని భారతదేశమిదిమారుతున్న ప్రపంచ పరిణామాల నేపథ్యంలో భారత్‌లో పరివర్తనను సాధ్యం చేసిన ఎలాంటి సందిగ్ధం లేని ప్రధానమంత్రి విధానమిది’’ అని చెప్పారు.

ఆపరేషన్ సిందూర్‌ భారత సైనిక శక్తికి నిలువుటద్దమని రక్షణ మంత్రి అభివర్ణించారుకేవలం 72 గంటల్లోనే ఈ ఆపరేషన్‌ను ముగించినప్పటికీ.. దాని వెనుక విస్తృతమైనసుదీర్ఘమైన సన్నద్ధత ఉందని తెలిపారువనరులను వేగంగా సమీకరించగలిగే శక్తిదేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాల విశ్వసనీయత.. అన్నీ ఇప్పుడు భారతీయ సైనిక యుద్ధ వ్యూహంలో ముఖ్యమైన భాగాలుగా మారాయని చెప్పారు.

ఆపరేషన్ సింధూర్ ఫలితంగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలురక్షణ ఉత్పత్తుల విశ్వసనీయత పట్ల ప్రపంచ దృష్టిలో మార్పు వచ్చిందనిసానుకూల ధోరణి కనిపిస్తోందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘‘భారత్ నుంచి ఆయుధాలురక్షణ సామగ్రిని కొనుగోలు చేసేందుకు అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయిగణాంకాలన్నీ అదే చెబుతున్నాయిఆర్థిక సంవత్సరం 2025-26లో రక్షణ ఎగుమతులు రూ. 38,424 కోట్లకు చేరుకున్నాయిమునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 62.66 శాతం వృద్ధి కనిపించిందిఈ ప్రమాణాలను అధిగమించేలా మా ప్రయత్నాలను ముందుకు తీసుకెళుతున్నాం’’ అని తెలిపారు.

ఇటీవలే జర్మనీలో తాను చేపట్టిన పర్యటన గురించి ప్రస్తావిస్తూ.. ఐరోపా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థలు భారత ప్రైవేటు రంగంలోని రక్షణ సంస్థలుప్రభుత్వ రంగ సంస్థలతో కలసి పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయనీఇది భారత్‌పై పెరుగుతున్న విశ్వసనీయతకు నిదర్శనమన్నారుసైనిక పరాక్రమంతో మాత్రమే కాకుండా.. దాడులను నిరోధించే సైనిక సామర్థ్యంతో కూడా ప్రపంచంలో భారత్ స్థానం బలోపేతమవుతోందని తెలిపారు.

ఇటీవలి కాలంలో సైనిక విధానంలో వస్తున్న వేగవంతమైన మార్పుల గురించి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వివరించారుసైబర్ డొమైన్స్పేస్ వార్‌ఫేర్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రధానాంశాలుగా మారాయన్నారుఈ మార్పులకు కేంద్ర బిందువుగా కృత్రిమ మేధ (ఏఐఉందని చెప్పారు. ‘‘ఆపరేషన్ సిందూర్ సమయంలో బ్రహ్మోస్ లాంటి అత్యాధునిక క్షిపణుల నుంచి వివిధ పర్యవేక్షణా వ్యవస్థల వరకు ఏఐను సమర్థంగా వినియోగించాంఇది మన కచ్చితత్వాన్నిదాడుల సామర్థ్యాన్ని పెంచిందిప్రధాన కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తరచూ ప్రజలకు చేరుతున్నప్పటికీముప్పు ఎదురు కాకముందే దాన్ని నిర్వీర్యం చేయడంలో అనేక చిన్నపాటి కార్యకలాపాలువిధానాలు చురుగ్గా పని చేశాయిఇలాంటి సందర్భాల్లో ఏఐను విస్తృతంగా వినియోగించాం’’ అని  రక్షణ మంత్రి వివరించారు.

ఏఐ వినియోగంలో ఆచరణాత్మకత గురించి రక్షణ మంత్రి వివరించారుఉగ్రవాదులను గురించడంలోనూవారి విషయంలో నిర్ణయాత్మకంగా స్పందించడంలోనూ కీలకంగా వ్యవహరించిందన్నారు. ‘‘ఏఐ అంటే ‘ఆగ్మెంటెడ్ ఇన్ఫాంట్రీ’ అని కూడాఇది మన బలగాల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతోందిఆధునిక యుద్ధ అవసరాలకు అనుగుణంగా.. మన సైన్యాన్ని సాంకేతిక ఆధారితంగాసమీకృత పోరాట యంత్రంగా మార్చే దిశగా వేగంగా ముందుకు సాగుతున్నాందీనికోసం ‘రుద్ర’ బ్రిగేడ్లు, ‘భైరవ్’ బెటాలియన్లు, ‘శక్తిబన్’ ఆర్టిలరీ రెజిమెంట్లు అనే చురుకైనస్వయం సమృద్ధమైన పోరాట విభాగాలను ఏర్పాటు చేశాంఅలాగే ‘దివ్యాస్త్ర’ బ్యాటరీలు ఆధునికమైన హైబ్రిడ్ ముప్పులకు తక్షణమే స్పందించే నిర్ణయాత్మక సామర్థ్యాన్ని పెంపొందించాయి.

పని సంస్కృతిని మార్చడానికిసైనికుల సంక్షేమాన్నివారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే శక్తిమంతమైన సాధనంగా ఏఐ ఆవిర్భవించిందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారురక్షణ రంగంలో పింఛనుదారులుమాజీ ఉద్యోగుల కోసం స్పర్శ్ పోర్టల్‌ను అభివృద్ధి చేశామని తెలిపారుఏఐ ఆధారిత ఛాట్‌బాట్లతో పింఛను సంబధిత ప్రక్రియలు సులభతరమయ్యాయని వెల్లడించారుఫిర్యాదుల పరిష్కారం నుంచి మెడికల్ రికార్డుల పర్యవేక్షణ వరకు అన్నింటి నిర్వహణ ఏఐ ఆధారంగా జరుగుతోందన్నారుఅదే విధంగా విద్యఆరోగ్య సేవల విషయంలో సైనికుల కుటుంబాలు వెనకబడిపోకుండా చూసేందుకు ఏఐ ఆధారిత సాధనాలను ఉపయోగిస్తున్నామని తెలియజేశారు.

నూతన ప్రపంచ క్రమంలో భారత వ్యూహాత్మక సన్నద్ధతలో విడదీయలేని భాగంగా ఏఐ మారిందని రక్షణ మంత్రి అన్నారుప్రభుత్వం దీనిని సైనికపరమైన కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేయకుండా దేశంలో నైపుణ్యాభివృధ్ధిపరిశోధనల కోసం సమగ్ర వ్యూహాన్ని రూపొందించిందని తెలియజేశారు. ‘‘ఇండియా ఏఐ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా కంప్యూటింగ్ మౌలిక వసతులను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మేం చురుగ్గా పనిచేస్తున్నాంతద్వారా చిన్న పట్టణాలకు చెందిన యువత సైతం ఏఐకు తమ వంతు సహకారం అందించేలా కృషి చేస్తున్నాం. 10,000 జీపీయూ కంటే ఎక్కువ సామర్థ్యంఫ్యూచర్ స్కిల్స్ లాంటి కార్యక్రమాలు ఈ సాంకేతిక విప్లవ యుగంలో భారత్ వెనకబడిపోకూడదనే మా సంకల్పానికి నిదర్శనంఇటీవలే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు – 2026ను విజయవంతంగా నిర్వహించాంఈ కార్యక్రమంలో 20 దేశాల అధినేతలతో  పాటుగా, 89 దేశాలుసంస్థలు పాల్గొన్నాయివీరంతా మన ఏఐ మ్యానిఫెస్టోను ఆమోదించారుఅంతర్జాతీయ ఏఐ ప్రమాణాలను రూపొందించడంలో భారత్ ప్రధాన పాత్రను పోషిస్తోందికొన్ని దేశాలకు మాత్రమే ఏఐ ప్రయోజనాలు పరిమితం కాకుండా.. గ్లోబల్ సౌత్‌కి కూడా అందేలా ‘ఏఐ ఫర్ ఆల్’ అనే మంత్రంతో ముందుకు సాగుతున్నాం’’ అని ఆయన వివరించారు.

డీప్‌ఫేక్‌లుసైబర్ యుద్ధాలుస్వతంత్ర ఆయుధ వ్యవస్థలు కొత్తవైనప్రమాదకరమైన సవాళ్లు విసురుతున్నప్పటికీ ఏఐను అదే దృష్టితో చూడకూడదని శ్రీ రాజ్‌నాధ్ సింగ్ అన్నారు. ‘‘రాబోయే రోజుల్లో ఈ సవాళ్లు మరింత తీవ్రం కానున్నాయికాబట్టి వాటిని మన దృష్టిలో ఉంచుకోవాలిమన రక్షణ కోసం మనం రూపొందించుకున్న ఏఐపై నియంత్రణ కోల్పోతే.. అది ప్రమాదకరమైన ఆయుధంగా మారుతుందికాబట్టి మనల్ని నాశనం చేసేది కాకుండా.. నడిపించే శక్తిగా మార్చేందుకే మనం ప్రయత్నించాలిసంఘటిత ప్రయత్నాలుఅంతర్జాతీయ సహకారం ద్వారా ఏఐ శక్తిని మనం సమర్థంగా వినియోగించుకోగలం’’ అని చెప్పారు.

యుద్ధ క్షేత్రంలో నిఘాస్వతంత్ర వ్యవస్థల నుంచి మెరుగైన రవాణాకమాండ్ నిర్ణయాలకు మద్దతు అందించే వరకు వివిధ విభాగాల్లో ఏఐ పోషించే పాత్ర గురించి క్షుణ్నంగా అధ్యయనం చేస్తున్నారని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ‘‘అత్యుత్తమ రీతిలో ఏఐ వినియోగానికి సుదర్శన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ గొప్ప ఉదాహరణగా నిలుస్తుందికొత్తగా ఎదురవుతున్న ఏఐ ఆధారిత సవాళ్లకు ప్రతిస్పందించే తమ సామర్థ్యాలను పెంపొందించుకొనేందుకు మన రక్షణ దళాలు ఏఐమెషిన్ లెర్నింగ్బిగ్ డేటా సైన్స్‌లను ఉపయోగించి ప్రణాళికను రూపొందించాయిఈ వ్యూహం భవిష్యత్తులో వారిని మరింత చురుగ్గా స్పందించేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందిఇలాంటి ఆధునికమైననూతన సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా మన దేశం మరింత సురక్షితంగాబలంగామరింత సుసంపన్నంగా మారుతుంది’’ అని వివరించారు.

రక్షణ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్రక్షణ పరిశోధన అభివృద్ధి విభాగం కార్యదర్శిడీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వీ కామత్సమీకృత రక్షణ సిబ్బంది అధిపతి ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2257187) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Gujarati , Kannada