ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పాదరక్షల రంగంలో సాంకేతిక వస్త్రాల అనుసంధానాన్ని వివరిస్తూ రాసిన ఓ వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 29 APR 2026 4:27PM by PIB Hyderabad

పాదరక్షల పరిశ్రమలో సాంకేతిక వస్త్రాల పాత్రనుఅనుసంధానాన్ని వివరిస్తూ కేంద్రమంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ రాసిన ఓ వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పంచుకున్నారు.

పాదరక్షల తయారీలో సాంకేతిక వస్త్రాల వినియోగం కేవలం ఇప్పుడిప్పుడే వస్తున్న ఆలోచన కాదనిఅది ఇప్పటికే ఈ పరిశ్రమలో అంతర్భాగమైందనే సరళమైనశక్తిమంతమైన విశ్లేషణను ఈ కథనం వెల్లడిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘పాదరక్షల పరిశ్రమలో సాంకేతిక వస్త్రాల వినియోగం అనేది కొత్తగా పుట్టుకొచ్చిన అంశం కాదనిఅది ఇప్పటికే ఈ రంగంలో అంతర్భాగమై ఉందనే సరళమైనశక్తిమంతమైన అవగాహనను కేంద్రమంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ఈ కథనం ద్వారా తెలియజేశారు.

ఈ అనుసంధానాన్ని గుర్తించివ్యవస్థీకరించివిస్తరించడమే మన ముందున్న కర్తవ్యమని ఆయన చెప్పారు. దీని ద్వారా పాదరక్షల రంగాన్ని సాంకేతిక వస్త్రాల  వ్యవస్థలోకి మరింత స్పష్టంగా తీసుకురావచ్చు’’.

***


(రిలీజ్ ఐడి: 2256658) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Gujarati , Kannada , Malayalam