ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి ‘ఈస్టర్’ శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
05 APR 2026 9:02AM by PIB Hyderabad
‘ఈస్టర్’ పర్వదినం సందర్భంగా దేశంలోని క్రైస్తవ సోదరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ శుభాకాంక్షలు తెలిపారు.
మానవాళిలో ఆశ, పునరుజ్జీవనం విశిష్టతను ఈ పర్వదినం చాటిచెబుతుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ పవిత్ర దినాన ప్రతిఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు కలగాలని, కొత్త వెలుగును తేవాలని ఆయన ఆకాంక్షించారు.
అలాగే, యేసుక్రీస్తు బోధనలు అందరిలో కరుణా భావనను ప్రోది చేయాలని, సమాజంలో ఐక్యతా స్ఫూర్తి నింపి, బంధాలను బలోపేతం చేయాలని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“అందరికీ ‘ఈస్టర్’ శుభాకాంక్షలు.. ఆశ, పునరుజ్జీవనం ప్రాశస్త్యాన్ని ఈ పర్వదినం చాటిచెబుతుంది. ఈ పవిత్రదినాన ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, ఆనందం, వెలుగు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను. యేసుక్రీస్తు బోధనలు అందరిలోనూ కరుణా భావన నింపి, సమాజంలో ఐక్యతా స్ఫూర్తిని ప్రోది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
****
(రిలీజ్ ఐడి: 2254237)
సందర్శకుల సూచీ సంఖ్య : : 30
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam