ప్రధాన మంత్రి కార్యాలయం
ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రధానమంత్రి
ఉపరాష్ట్రపతికి పుత్తాండు శుభాకాంక్షలు తెలియజేసిన పీఎం
నాడు పోస్టు చేయడమైనది:
14 APR 2026 10:35AM by PIB Hyderabad
ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు. పుత్తాండు పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ నూతన సంవత్సరమంతా ఆరోగ్యం, ఆనందం వెల్లి విరియాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా రాశారు:
‘‘పుత్తాండు పర్వదినం సందర్భంగా ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశాను. నూతన సంవత్సరంలో ఆరోగ్యం, ఆనందం వెల్లి విరియాలని ప్రార్థిస్తున్నాను.’’
(రిలీజ్ ఐడి: 2251899)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9