|
పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో కీలక రంగాల తాజా సమాచారం
ఎల్పీజీ విషయంలో ఎక్కడా నమోదు కాని కొరత.. నిన్న 52.3 లక్షలకు పైగా గృహ వినియోగ సిలిండర్ల సరఫరా తనిఖీలను ఉద్ధృతం చేసిన పీఎస్యూ ఓఎంసీలు.. నిబంధనలు ఉల్లంఘించిన 219 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లపై జరిమానా విధింపు, 56 డీలర్ షిప్ లు సస్పెన్షన్ 2026 మార్చి నుంచి పూర్తైన 4.24 లక్షలకు పైగా గ్యాస్ సరఫరా పనులు.. కొత్త కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్న 4.66 లక్షలకు పైగా వినియోగదారులు ఎలాంటి రద్దీ లేకుండా దేశవ్యాప్తంగా సాధారణంగా కొనసాగుతున్న ఓడరేవుల కార్యకలాపాలు పశ్చిమాసియాలోని భారతీయుల భద్రత, రక్షణ, సంక్షేమాన్ని నిర్ధారించడంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఆ ప్రాంతం నుంచి భారత్కు వచ్చిన సుమారు 8.97 లక్షల మంది ప్రయాణికులు
నాడు పోస్టు చేయడమైనది:
12 APR 2026 4:51PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అక్కడి పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తోంది. కీలక రంగాలలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన సంసిద్ధతను నిర్ధారించడానికి సమన్వయంతో కూడిన చర్యలను చేపడుతోంది. ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయులకు అవసరమైన సహాయం వంటి అంశాలలో తీసుకుంటున్న చర్యల తాజా సమాచారం ఈ విధంగా ఉంది:
హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూడటానికి తీసుకుంటున్న చర్యలను పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖ వివరించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
ప్రజా సూచనలు, పౌర అవగాహన
-
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ విషయంలో ప్రజలు భయాందోళనతో కొనుగోళ్లు చేయొద్దని.. కేవలం అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించారు.
-
ఎల్పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ ప్లాట్ఫామ్లను ఉపయోగించాలని.. డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లకుండా ఉండాలని కోరారు.
-
ప్రజలు పీఎన్జీ, ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ కుక్టాప్ల వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగించాల్సిందిగా ప్రోత్సహించారు.
-
ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధనాన్ని పొదుపు చేయాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ సంసిద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు
-
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ గృహాసరాల ఎల్పీజీ, పీఎన్జీ సరఫరాకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. దీనితో పాటు ఆసుపత్రులు, విద్యా సంస్థలకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా అధిక ప్రాధాన్యత ఇస్తోంది.
-
సరఫరా, డిమాండ్ రెండు అంశాల్లోనూ ప్రభుత్వం ఇప్పటికే పలు హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. ఇందులో భాగంగా చమురు శుద్ధి కేంద్రాల ఉత్పత్తిని పెంచడం.. ఎల్పీజీ బుకింగ్ గడువును పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పెంచడం.. కీలక రంగాలకు సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వడం వంటి చర్యలు చేపట్టారు.
-
ఎల్పీజీ డిమాండ్ ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
-
చిన్న, మధ్యతరహా వినియోగదారులకు పంపిణీ చేయడం కోసం రాష్ట్రాలకు అదనపు బొగ్గును సరఫరా చేయాలని కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్ను బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
-
గృహ, వాణిజ్య వినియోగదారుల విషయంలో కొత్త పీఎన్జీ కనెక్షన్లు పొందటాన్ని సులభతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు
-
నిత్యావసరాల చట్టం- 1955, ఎల్పీజీ నియంత్రణ ఉత్తర్వు- 2000 ప్రకారం పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాను పర్యవేక్షించడానికి.. అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది.
-
27.03.2026, 02.04.2026 నాటి లేఖల ద్వారా ఇంధనం తగినంతగా అందుబాటులో ఉందన్న భరోసాను ప్రజలకు ఇచ్చేందుకు ముందస్తు ప్రజా సమాచార మార్పిడి అవసరమని కేంద్రం ప్రభుత్వం ప్రధానంగా చెప్పింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. 02.04.2026న పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి… 06.04.2026న సమాచార - ప్రసార, వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శులతో కలిసి పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కింది అంశాలను ప్రముఖంగా చెప్పారు:
-
ప్రతిరోజూ మీడియా సమావేశాలు నిర్వహించడం, క్రమం తప్పకుండా ప్రజా సూచనలను జారీ చేయడం.
-
సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలు, అవాస్తవ సమాచారాన్ని చురుగ్గా పర్యవేక్షించడం, తిప్పికొట్టడం.
-
జిల్లా యంత్రాంగం ద్వారా ప్రతిరోజూ తనిఖీలను ఉద్ధృతం చేయటం, ఓఎంసీలతో సమన్వయం చేసుకుంటూ దాడులు, తనిఖీలను కొనసాగించడం.
-
సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో వాణిజ్య ఎల్పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
-
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా కేటాయించిన కిరోసిన్ (ఎస్కేఓ) కోసం కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
-
పీఎన్జీ వినియోగం, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం.
-
ఎల్పీజీ సరఫరాలో ముఖ్యంగా గృహ అవసరాల ఎల్పీజీ సరఫరాలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ల లక్షిత పంపిణీ విధానాన్ని అనుసరించడం.
-
అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూంలు, జిల్లా స్థాయి పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేశాయి.
-
ప్రస్తుతం 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు క్రమం తప్పకుండా మీడియా సమావేశాలను నిర్వహిస్తున్నాయి.
అమలు, పర్యవేక్షణ చర్యలు
-
ఎల్పీజీ అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా అమలు చర్యలు కొనసాగుతున్నాయి. 11.04.2026 నాడు దేశవ్యాప్తంగా 2700 కంటే ఎక్కువ దాడులు నిర్వహించారు.
-
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఆకస్మిక తనిఖీలను మరింత ముమ్మరం చేశాయి. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఇప్పటివరకు 219 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ షిప్లపై జరిమానాలు విధించాయి.. 56 డిస్ట్రిబ్యూటర్ షిప్లను సస్పెండ్ చేశాయి.
ఎల్పీజీ సరఫరా
గృహావసరాల ఎల్పీజీ
-
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.
-
ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్షిప్ల వద్ద ఎక్కడా నిల్వల కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు.
-
పరిశ్రమవ్యాప్తంగా ఆన్లైన్ ఎల్పీజీ బుకింగ్లు సుమారు 98 శాతానికి పెరిగాయి.
-
సిలిండర్ల దారి మళ్లింపును అరికట్టడానికి డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత పంపిణీ విధానాన్ని సుమారు 93 శాతానికి పెంచారు.
-
గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ సాధారణంగానే కొనసాగుతోంది.
-
11.04.2026 నాడు 52.3 లక్షలకు పైగా గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు సరఫరా అయ్యాయి.
వాణిజ్య ఎల్పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు
-
మొత్తం వాణిజ్య ఎల్పీజీ కేటాయింపులు సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో సుమారు 70 శాతానికి పెరిగాయి. ఇందులో 10 శాతం సంస్కరణలతో ముడిపడి ఉన్న కేటాయింపులు కూడా ఉన్నాయి.
-
కేంద్ర ప్రభుత్వం 08.04.2026 నాటి లేఖ ద్వారా.. ఫార్మా, ఆహార రంగం, పాలిమర్, వ్యవసాయం, ప్యాకేజింగ్, పెయింట్, యురేనియం, భార జలం, ఉక్కు, విత్తనాలు, లోహాలు, సిరామిక్, ఫౌండ్రీ, ఫోర్జింగ్, గాజు, ఏరోసోల్ మొదలైన రంగాల్లోని పారిశ్రామిక విభాగాలు కూడా 2026 మార్చికి ముందు ఉన్న తమ బల్క్ గృహేతర ఎల్పీజీ వినియోగ స్థాయిలో 70 శాతాన్ని పొందుతాయని తెలియజేసింది. అయితే ఇది రోజుకు 0.2 టీఎంటీ అనే మొత్తం రంగాల పరిమితికి లోబడి ఉంటుంది.
-
గడిచిన 8 రోజుల్లో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (పీఎస్యూ ఓఎంసీ) 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లపై సుమారు 3300 అవగాహన శిబిరాలను నిర్వహించాయి. ఈ శిబిరాల ద్వారా 35,800 కంటే ఎక్కువ 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.
-
11.04.2026 నాడు దేశవ్యాప్తంగా 1 లక్ష కిలోల కంటే ఎక్కువ ఎఫ్టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి. ఇది 2026 ఫిబ్రవరి నెలలోని రోజువారీ సగటు అయిన 77,000 కంటే చాలా ఎక్కువ.
-
2026 మార్చి 23 నుంచి ఇప్పటివరకు 13 లక్షలకు పైగా 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.
-
వాణిజ్య ఎల్పీజీ పంపిణీని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ సంస్థల కార్యనిర్వహక డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల విభాగాలతో సమన్వయం చేసుకుంటోంది.
-
2026 మార్చి 14 నుంచి ఇప్పటివరకు మొత్తం 1,20,898 మెట్రిక్ టన్నుల (ఎంటీ) వాణిజ్య ఎల్పీజీ విక్రయమైంది. 63.6 లక్షలకు పైగా (19 కిలోల బరువు గల) వాణిజ్య సిలిండర్లతో సమానం ఇది.
-
11.04.2026 నాడు ఒక్కరోజే 7665 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్పీజీ విక్రయమైంది. 4 లక్షలకు పైగా (19 కిలోల బరువు గల) వాణిజ్య సిలిండర్లతో సమానం ఇది.
సహజ వాయువు సరఫరా... పీఎన్జీ విస్తరణకు చర్యలు
· దేశీయ పీఎన్జీ, సీఎన్జీ రవాణాకు 100% సరఫరాతో వినియోగదారులకు ప్రాధాన్యం.
· అందుబాటులోగల నిల్వలు, షెడ్యూల్ ప్రకారం- ఎల్ఎన్జీ దిగుమతి ఆధారంగా, ఎరువుల కర్మాగారాలకు వాటి 6 నెలల సగటు వినియోగంలో సుమారు 95 శాతానికి చేరువగా, మొత్తం గ్యాస్ కేటాయింపును 09.04.2026 నుంచి మరో 5 శాతం పెంచారు.
· వాణిజ్య ఎల్పీజీ లభ్యత సంబంధిత సమస్యల పరిష్కారం దిశగా హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్జీ కనెక్షన్లలో ప్రాధాన్యం ఇవ్వాలని సీజీడీ సంస్థలకు ఆదేశాలు.
· ఐజీఎల్, ఎంజీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సీజీడీ కంపెనీల ద్వారా దేశీయ, వాణిజ్య పీఎన్జీ కనెక్షన్లకు ప్రోత్సాహకాల మంజూరు.
· సీజీడీ నెట్వర్క్ విస్తరణకు సత్వర అనుమతులు ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సహా కేంద్ర మంత్రిత్వ శాఖలకు సూచన.
· ఎల్పీజీ నుండి పీఎన్జీకి దీర్ఘకాలిక మార్పు దిశగా రాష్ట్రాల తోడ్పాటుకు ప్రతిగా వాణిజ్య ఎల్పీజీలో అదనంగా 10 శాతం కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం 18.03.2026 నాటి లేఖ ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హామీ ఇచ్చింది.
· ఎల్పీజీ నుండి పీఎన్జీకి దీర్ఘకాలిక మార్పులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమవంతు తోడ్పాటునిస్తేనే ఈ కేటాయింపు వర్తిస్తుంది. అయితే, పీఎన్జీ విస్తరణలో సంస్కరణలకు అనుసంధానం కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటికే అదనపు వాణిజ్య ఎల్పీజీ లభిస్తోంది.
· ప్రాధాన్య క్రమంలో దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి సీజీడీ మౌలిక సదుపాయాల కోసం మూడు నెలల పాటు సత్వర ఆమోద చట్రాన్ని రోడ్డు రవాణా-రహదారుల మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది.
· కేంద్ర ప్రభుత్వం 24.03.2026న గెజిట్ ప్రకటన ద్వారానే కాకుండా నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్లైన్లు, ఇతర సౌకర్యాల కల్పన, నిర్మాణం-నిర్వహణ-విస్తరణ)ఉత్తర్వు-2026ను జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా పైప్లైన్ల నిర్మాణం, విస్తరణకు క్రమబద్ధ-వ్యవధి నిర్దేశిత చట్రం అమలులోకి వస్తుంది. తద్వారా అనుమతులు, భూసేకరణలో జాప్యాలను నివారించి, ఆవాస ప్రాంతాలు సహా సహజ వాయువు మౌలిక సదుపాయాల సత్వర అభివృద్ధికి వీలు కలుగుతుంది. దీనివల్ల పీఎన్జీ నెట్వర్క్ వృద్ధిని వేగిరపరచడమే కాకుండా చివరి అంచె అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే, కాలుష్యరహిత ఇంధనాల వైపు మళ్లేందుకు తోడ్పడుతుందని, దీంతో ఇంధన భద్రత బలోపేతమై గ్యాస్ ఆధారిత భారత ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
· పీఎన్జీ విస్తరణలో వేగం కొనసాగింపు లక్ష్యంగా జాతీయ పీఎన్జీ కార్యక్రమం 2.0ను 2026 జూన్ 30 వరకు పీఎన్జీఆర్బీ పొడిగించింది.
· కాలుష్య రహిత, సురక్షిత, స్వయంసమృద్ధి సహిత ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించే దిశగా ముసాయిదా రాష్ట్ర సీబీజీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. సీబీజీ అభివృద్ధి కోసం రాష్ట్రాలు తమ సొంత పెట్టుబడిదారులకు అనుకూల, అమలు హితవైన వ్యవస్థను ఈ నమూనా విధానం ద్వారా రాష్ట్రాలు సృష్టించుకోవచ్చు. ఈ మేరకు సమగ్ర, సరళ, మార్గదర్శక చట్రంగా ఈ విధానం దోహదపడుతుంది. దీన్ని అమలు చేసే రాష్ట్రాలకు వాణిజ్య ఎల్పీజీ అదనపు కేటాయింపులకు సంబంధించి తదుపరి విడతలో ప్రాధాన్యం లభిస్తుంది.
· 2026 మార్చి నుంచి 4.24 లక్షలకు పైగా పీఎన్జీ కనెక్షన్ల గ్యాసిఫికేషన్ పూర్తయింది. అలాగే, కొత్త కనెక్షన్ల కోసం మరో 4.66 లక్షల మందికి పైగా నమోదు చేసుకున్నారు.
· మరోవైపు 11.04.2026 నాటికి 30,000 మందికి పైగా పీఎన్జీ వినియోగదారులు MYPNGD.in వెబ్సైట్ ద్వారా ఎల్పీజీ కనెక్షన్లను వదులుకున్నారు.
ముడిచమురు నిల్వలు... శుద్ధి కర్మాగారాల కార్యకలాపాలు
· దేశంలో తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉండటంతో శుద్ధి కర్మాగారాలన్నీ అదనపు సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దీంతోపాటు పెట్రోల్, డీజిల్ నిల్వల నిర్వహణ సంతృప్తికరంగా ఉంది.
· దేశీయ వినియోగానికి కొరత రాకుండా శుద్ధి కర్మాగారాల్లో వంటగ్యాస్ ఉత్పత్తిని పెంచారు.
· దేశలోని ఫార్మాస్యూటికల్స్, ఆహార-ప్రజా పంపిణీ, రసాయనాలు-పెట్రో కెమికల్స్ వంటి కీలక రంగాలకు సి3, సి4 స్ట్రీమ్లను కనీస పరిమాణంలో... అంటే- రోజుకు 800 మెట్రిక్ టన్నుల వరకూ అందుబాటులో ఉంచే విధంగా దేశంలోని పెట్రోకెమికల్ ప్రాంగణాలు సహా శుద్ధి కంపెనీలను అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం 01.04.2026న ఒక ఉత్తర్వు జారీచేసింది.
చిల్లర విక్రయానికి ఇంధన లభ్యత... ధరల దిశగా చర్యలు
· దేశవ్యాప్తంగా అన్ని చిల్లర విక్రయ కేంద్రాలు యథావిధిగా పనిచేస్తున్నాయి.
· మధ్యప్రాచ్య సంక్షోభం వల్ల ముడిచమురు ధర అసాధారణంగా పెరిగింది. దీంతో వినియోగదారులను ఆదుకోవడానికి, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గించింది.
· దేశీయ మార్కెట్లో ఈ ఉత్పత్తుల లభ్యతకు భరోసా ఇస్తూ ఎగుమతి సుంకాన్ని లీటరు డీజిల్పై రూ.55.50కి, ఒక లీటరు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్పై రూ.42కు పెంచుతూ 11.04.2026న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
· చిల్లర విక్రయ కేంద్రాల్లో పెట్రోల్, డీజిల్ సాధారణ ధరలలో ఎలాంటి మార్పు లేదు.
కిరోసిన్ లభ్యత... సజావుగా పంపిణీకి చర్యలు
· సాధారణ కేటాయింపులకు అదనంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 48,000 కిలోలీటర్ల కిరోసిన్ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.
· ఈ నేపథ్యంలో 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ‘ఎస్కేఓ’ కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయగా- హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్ తమకు అవసరం లేదని తెలిపాయి.
సముద్ర భద్రత, నౌకారవాణా కార్యకలాపాలు
పశ్చిమాసియా ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహించే భారతీయ నౌకలు, నావికుల భద్రతకు కేంద్ర ఓడరేవులు-నౌకా రవాణా-జలమార్గాల మంత్రిత్వ శాఖ తగు చర్యలు చేపట్టిన నేపథ్యంలో కిందివిధంగా ప్రకటించింది:
· భారతీయ నావికులందరూ సురక్షితం.. గడచిన 24 గంటల్లో భారత పతాకంగల నౌకలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు.
· నౌకారవాణా కంట్రోల్ రూమ్ 24గంటలూ పనిచేస్తుండగా- దీన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా 6,053 కాల్స్ స్వీకరించడంతోపాటు 12,787కుపైగా ఈ-మెయిళ్లను నిర్వహించింది. ఈ క్రమంలో గడచిన 24 గంటల్లో, 80 కాల్స్, 112 ఈ-మెయిల్స్ అందాయి.
· మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్) ద్వారా గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి 24 గంటల్లో 75 మంది సహా ఇప్పటిదాకా 2,084 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించారు.
· దేశవ్యాప్తంగా ఓడరేవులలో ఎలాంటి రద్దీ నమోదు కాకపోగా, కార్యకలాపాలన్నీ సాధారణ స్థాయిలో సాగుతున్నాయి.
· సముద్రయాన సిబ్బంది సంక్షేమం, నిరంతరాయ సముద్ర కార్యకలాపాలకు భరోసా ఇస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత దౌత్య కార్యాలయాలు, సముద్ర రంగ భాగస్వాములతో సమన్వయాన్ని మంత్రిత్వశాఖ కొనసాగిస్తోంది.
పశ్చిమాసియా ప్రాంతంలో భారత పౌరుల భద్రత
పశ్చిమాసియా ప్రాంతంలోని బారతీయులతో పరిసర దేశాలక్లోని భారత రాయబార కార్యాలయాలు, శిబిరాలు సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నాయి. వారి భద్రత, శ్రేయస్సు దిశగా అవసరమైన సహాయం అందించడంతోపాటు సలహాలు, సూచనలు జారీ చేస్తున్నాయి. ఈ మేరకు తాము చేపట్టిన చర్యలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కిందివిధంగా ప్రకటించింది:
· గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంత పరిణామాలపై ప్రభుత్వం సదా నిశిత పర్యవేక్షణ కొనసాగిస్తోంది.
· సమాచార ఆదానప్రదానం, సమన్వయం మెరుగుదల దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో మంత్రిత్వశాఖ క్రమం తప్పకుండా సంప్రదిస్తోంది.
· ఈ ప్రాంతంలోని భారతీయుల భద్రత, రక్షణ, సంక్షేమానికి భరోసా ఇస్తూ పటిష్ఠ చర్యలు చేపట్టాం.
· భారత రాయబార కార్యాలయాలు, శిబిరాలు 24 గంటల సహాయ కేంద్రాలను నిర్వహిస్తూ, భారత పౌరులకు చురుగ్గా సహాయం చేస్తున్నాయి.
· ఆయా దేశాల్లోని ప్రభుత్వ మార్గదర్శకాలు, విమాన-ప్రయాణ స్థితిగతులు, రాయబార కార్యాలయ సేవలపై సమాచారం సహా నవీకృత సలహాలు క్రమం తప్పకుండా జారీ అవుతున్నాయి.
· ఈ ప్రాంతంలోని భారతీయ సంఘాలు, వృత్తి బృందాలు, భారత కంపెనీలు సహా ఇతరత్రా భాగస్వాములతో మన రాయబార కార్యాలయాలు చురుగ్గా సమన్వయం చేసుకుంటున్నాయి.
· గగనతలం తెరిచి ఉన్న దేశాల నుంచి విమాన రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఈ మేరకు ఫిబ్రవరి 28 నుంచి భారత్కు సుమారు 8,97,000 మంది ప్రయాణించారు.
· ‘యూఏఈ’లోని విమానయాన సంస్థలు కార్యాచరణ-భద్రత అంశాలను పరిగణనలోకి తీసుకుని, భారత్కు పరిమిత సంఖ్యలో అనధికార కార్యకలాపాల కింద వాణిజ్య విమానాలను నడుపుతున్నాయి. దీని ప్రకారం నేడు సుమారు 95 విమానాలు నడుస్తాయి.
· సౌదీ అరేబియా, ఓమన్ దేశాల్లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్లోని వివిధ నగరాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.
· ఖతార్ గగనతలం పాక్షికంగా తెరవడంతో ‘ఖతార్ ఎయిర్వేస్’ ఇవాళ భారత్కు 8–10 విమానాలను నడుపుతుందని అంచనా.
· కువైట్ గగనతలం మూసివేత కొనసాగుతోంది. దీంతో కువైట్ విమానయాన సంస్థ జజీరా ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్, సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయం నుంచి భారత్కు అనధికార కార్యకలాపాల కింద వాణిజ్య విమానాలను నడుపుతున్నాయి. కువైట్ నుంచి భారత పౌరుల ప్రయాణానికి సౌదీ అరేబియా ద్వారా సౌకర్యం కల్పించారు.
· బహ్రెయిన్ గగనతలం తెరిచి ఉండటంతో ‘గల్ఫ్ ఎయిర్’ త్వరలోనే బహ్రెయిన్ నుంచి భారత్కు పరిమితంగా విమానాలను నడుపుతుందని అంచనా. అయితే, ప్రస్తుతం సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయం నుంచి భారత్కు షెడ్యూల్ చేయని విమానాలు నడుస్తున్నాయి. బహ్రెయిన్ నుంచి భారత పౌరుల ప్రయాణానికి సౌదీ అరేబియా ద్వారా సౌకర్యం కల్పించబడుతోంది.
· ఇరాన్ గగనతలం మూసివేత కొనసాగుతోంది. అయితే, ఇరాన్ నుంచి ఆర్మేనియా, అజర్బైజాన్ మీదుగా భారత్కు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం.
· ఇజ్రాయెల్ గగనతలం మూసివేత కొనసాగుతున్నప్పటికీ జోర్డాన్, ఈజిప్ట్ మీదుగా భారత్కు ప్రయాణించే సౌకర్యం అందుబాటులో ఉంది.
· ఇరాక్ గగన తలం తెరిచి ఉన్నప్పటికీ విమాన కార్యకలాపాలు పరిమితంగానే సాగుతున్నాయి. ఈ మేరకు జోర్డాన్, సౌదీ అరేబియా మీదుగా భారత పౌరులకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం.
***
(రిలీజ్ ఐడి: 2251391)
|