రక్షణ మంత్రిత్వ శాఖ
వియత్నాం డిప్యూటీ పీఎం, రక్షణ మంత్రిగా నియమితులైన జనరల్ ఫాన్ వాన్ గియాంగ్కు రక్షణమంత్రి శుభాకాంక్షలు
వియత్నాంతో సుదీర్ఘ రక్షణ సంబంధాలను మరింత బలోపేతం: శ్రీ రాజ్నాథ్ సింగ్
నాడు పోస్టు చేయడమైనది:
09 APR 2026 9:42AM by PIB Hyderabad
వియత్నాం డిప్యూటీ ప్రధానమంత్రిగా, రక్షణ మంత్రిగా నియమితులైన జనరల్ ఫాన్ వాన్ గియాంగ్కు భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమం 'ఎక్స్' పోస్టులో రక్షణమంత్రి ఇలా పేర్కొన్నారు. "వియత్నాంతో ఉన్న సుదీర్ఘ రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయటానికి.. భద్రత, సైనిక సహకారం, పారిశ్రామిక సహకారం వంటి రంగాల్లో బంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు భారత్ ఆసక్తితో ఉంది. భవిష్యత్తులో భారత్-వియత్నాం భాగస్వామ్యం మరింత శక్తిమంతంగా ఎదుగుతుందని విశ్వసిస్తున్నాను" అని అన్నారు.
(రిలీజ్ ఐడి: 2250418)
సందర్శకుల సూచీ సంఖ్య : : 19