ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి ముద్రా యోజన 11వ వార్షికోత్సవం


పథకం విజయాలను ప్రశంసించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

వివేకం గల వ్యక్తి గుణగణాల్ని చాటిచెప్పే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 08 APR 2026 9:25AM by PIB Hyderabad

పదకొండు సంవత్సరాల కిందట అమల్లోకి వచ్చిన ప్రధానమంత్రి ముద్రా యోజన యువతీ యువకులు స్వయం ఉపాధికి తోడ్పడిందని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఒక వ్యక్తికి సరైన అవకాశాలు ఇస్తే ఆ వ్యక్తి సొంత కాళ్ల మీద నిలబడడంతో పాటు దేశ పురోగతికి కూడా తన వంతు తోడ్పాటును అందించగలరని ఈ పథకం సాధించిన ఫలితం నిరూపించిందని ప్రధానమంత్రి అన్నారుఈ సందర్భంగాసంస్కృత భాషలోని ఓ సుభాషితాన్ని ప్రజలతో శ్రీ మోదీ పంచుకున్నారువివేకం గల వ్యక్తి గుణగణాలను గురించి ఈ సుభాషితం మనకు చెబుతుంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -

‘‘ఇవాళ్టికి సరిగ్గా 11 సంవత్సరాల కిందట మొదలుపెట్టిన ప్రధానమంత్రి ముద్రా యోజన యువత స్వయం ఉపాధి కల్పనకు ఎంతో సహాయ పడిందిసరైన అవకాశాలు లభించినప్పుడు వ్యక్తి తన కాళ్ల మీద తాను నిలబడడమే కాకుండాదేశ ప్రగతికి కూడా తోడ్పడగలుగుతారని ఈ పథకం సాధించిన విజయం నిరూపించింది.

ఆత్మజ్ఞానం సమారంభస్తితిక్షా ధర్మనిత్యతా

యమర్థా నాపకర్షన్తి స వై పండిత ఉచ్యతే

#11YearsOfMUDRA’’ అని పేర్కొన్నారు.

స్వీయ శక్తిసామర్ధ్యాల గురించి తెలుసుకునిస్వావలంబన కలిగి మంచి పనులు చేస్తూఓరిమితో కష్టాలను అధిగమిస్తూఎప్పుడూ సన్మార్గంలోనే నడుస్తూదురాశకు లొంగకుండా ముందుకు సాగిపోయే వ్యక్తి నిజమైన వివేకశాలి.

 

***


(రిలీజ్ ఐడి: 2249934) సందర్శకుల సూచీ సంఖ్య : : 26