ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రాచీన రాతప్రతులను పరిరక్షించటంలో ఆచార్య శ్రీ కైలాససాగర్సూరి జ్ఞానమందిర్ కృషిని ప్రశంసించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
31 MAR 2026 1:10PM by PIB Hyderabad
ప్రాచీన రాతప్రతులను పరిరక్షించటంలో ఆచార్య శ్రీ కైలాససాగర్సూరి జ్ఞానమందిర్ కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. "మన దేశంలో అంకితభావం గల ఇలాంటి ఎన్నో బృందాలు ముందుండి పనిచేయటం గర్వంగా ఉంది. రాబోయే తరాలకు మన అద్భుతమైన చరిత్రతో అనుసంధానం ఉండేలా వీరు కృషి చేస్తున్నారు" అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
"ప్రాచీన రాతప్రతులను పరిరక్షించటంలో ఆచార్య శ్రీ కైలాససాగర్సూరి జ్ఞానమందిర్ చేస్తున్న కృషిని వీక్షించే అవకాశం లభించింది. మన దేశంలో అంకితభావం గల ఇలాంటి ఎన్నో బృందాలు ముందుండి పనిచేయటం నాకెంతో గర్వంగా అనిపించింది. మన ఘనచరిత్రతో భవిష్యత్ తరాలు ముడిపడి ఉండేలా వీరు నిరంతరం కృషి చేస్తున్నారు".
***
(రిలీజ్ ఐడి: 2247250)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15