ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డాక్టర్ రామ్ మనోహర్ లోహియా జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 23 MAR 2026 8:01AM by PIB Hyderabad

ప్రముఖ సామాజికవేత్తమేధావి డాక్టర్ రామ్ మనోహర్ లోహియా జయంతి ఈ రోజుఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.
డాక్టర్ లోహియా బహుముఖీన వ్యక్తిత్వం కల వారని శ్రీ మోదీ ప్రశంసించారువలసవాదానికి వ్యతిరేకంగా ప్రజల్ని కూడగట్టడంలోనూ, 1947 తరువాతి కాలంలో భారత్ పురోగతికి తోడ్పడడంలోనూ ఆయన కీలక పాత్రను పోషించారని శ్రీ మోదీ అన్నారుడాక్టర్ లోహియా అసాధారణ మేధావి అనీదేశంలో సామాజిక న్యాయానికి అనుకూలంగా తమ వాణిని బిగ్గరగా వినిపించిన అగ్రగణ్యులలో ఒకరనీ ప్రధాని వ్యాఖ్యానించారుపేదలకీనిరాదరణకు గురైన వారికీ సాధికారితను కల్పించాలన్న డాక్టర్ లోహియా నిబద్ధత తిరుగులేనిదనీఅది నిరంతరం స్ఫూర్తిదాయకమనీ శ్రీ మోదీ స్పష్టం చేశారుస్త్రీపురుష సమానత్వం విషయంలోప్రాతినిధ్య పూర్వక పాలన అంశంలో ఆయన నాడు చేసిన ఆలోచనలకు ఈనాటికీ అంతే సందర్భశుద్ధి ఉందని ప్రధాని అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘
డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారికి ఆయన జయంతి సందర్భంగా నివాళులుబహుముఖీన వ్యక్తిత్వం సొంతమైన ఆయన.. వలసవాద పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఉద్యమింపచేయడంలో, 1947 తరువాతి కాలంలో భారత్ పురోగతికి తోడ్పాటును అందించడంలో ఓ కీలక పాత్రను పోషించారుఆయన ఓ అసాధారణ ఆలోచనాపరుడుసామాజిక న్యాయాన్ని సాధించాలని మున్ముందుగా బలంగా వాదించిన వారిలో ఒకరుపేదలకీసమాజంలో ఆదరణకు నోచుకోని వర్గాల వారికీ సాధికారితను కల్పించడం పట్ల ఆయన కనబరిచిన తిరుగులేని నిబద్ధత తరాల తరబడి స్ఫూర్తిని అందిస్తూనే ఉంటుందిలైంగిక సమానత్వంప్రాతినిధ్యపూర్వక పాలన.. ఈ విషయాల్లో ఆయన ఆలోచనలు కూడా సమాన స్థాయిలో గుర్తుంచుకోదగ్గవి’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2243867) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Kannada