ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా జల సంరక్షణపై నిబద్ధతను పునరుద్ఘాటించిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 22 MAR 2026 9:05AM by PIB Hyderabad

ప్రతి నీటిబొట్టునూ కాపాడుకోవడానికీఅమూల్యమైన జల వనరును అత్యంత బాధ్యతాయుతంగా వినియోగించుకోవడానికీ ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

జీవాన్ని నిలపడంలోనూఈ భూమి భవితను తీర్చిదిద్దడంలోనూ నీటి పాత్ర అత్యంత కీలకమైందని చెబుతూ.. సుస్థిర పద్ధతులను అనుసరిస్తున్న వారినీఅవగాహనను పెంపొందిస్తున్న వారినీజల సంరక్షణ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్న వారినీ శ్రీ మోదీ అభినందించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘నీరు మన జీవనాధారంఈ భూగోళం భవిష్యత్తును నిలిపేదీ అదే.

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రతి నీటిబొట్టునూ కాపాడుకునేందుకూనీటిని బాధ్యతాయుతంగా వినియోగించుకూ కట్టుబడి ఉంటామని మరోసారి సంకల్పిద్దాంసుస్థిర పద్ధతులను అనుసరిస్తున్నవారినీఅవగాహనను పెంపొందిస్తున్నవారినీజల సంరక్షణ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్నవారినీ అభినందించాల్సిన రోజిది.’’  


(రిలీజ్ ఐడి: 2243575) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Gujarati , Kannada