ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మార్చి 9వ తేదీన ‘సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ - ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం’ అనే అంశంపై నిర్వహించే బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రసంగించనున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 08 MAR 2026 4:35PM by PIB Hyderabad

2026 మార్చి 9న ఉదయం 10:15 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ‘సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం’ ఇతివృత్తంపై నిర్వహించే బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.

ఈ ఇతివృత్తం కింద విద్యనైపుణ్యంఆరోగ్యం ఆయుష్పర్యాటకం ఆతిథ్యం వంటి వివిధ రంగాలలో బహుళ బ్రేకౌట్ సెషన్లు నిర్వహించనున్నారువిద్య నుంచి ఉపాధికి మార్గాలను బలోపేతం చేయడంయానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్స్ (ఏజీవీసీకంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌ల అభివృద్ధిఅనుబంధ ఆరోగ్య నిపుణులుసంరక్షుకల శిక్షణ విస్తరణ వంటి అంశాలపై ఈ చర్చలు కొనసాగుతాయివీటితో పాటు ప్రాంతీయ వైద్య కేంద్రాలుకొత్త ఆయుష్ సంస్థల ఏర్పాటుతో పాటు ఆతిథ్య నైపుణ్యాభివృద్ధిసుస్థిర పర్యాటక మార్గాలుఈశాన్య ప్రాంతంలో బౌద్ధ సర్క్యూట్‌లువారసత్వ పర్యాటక ప్రచారం వంటి పర్యాటక కార్యక్రమాలపై కూడా సమగ్రంగా చర్చించనున్నారు.

 

బడ్జెట్‌లో పొందుపరిచిన విధానపరమైన దార్శనికతను ఆచరణాత్మక వ్యూహాలుగా మార్చడానికి ప్రభుత్వం, పరిశ్రమలుసంబంధిత రంగాల నిపుణులకు ఈ వెబినార్ ఒక ఉమ్మడి వేదికను అందిస్తుందిఈ చర్చల ద్వారా వెలువడే ఆచరణాత్మక సిఫార్సులు.. బడ్జెట్ అమలును సులభతరం చేయడమే కాకుండా సమగ్ర వృద్ధిఅభివృద్ధి దిశగా దేశ పురోగతిని వేగవంతం చేయడంలో సహాయపడతాయని భావిస్తున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2236649) సందర్శకుల సూచీ సంఖ్య : : 22
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , Kannada , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Malayalam