ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జెరూసలెంలో సాంకేతిక ప్రదర్శనను చూసిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 26 FEB 2026 10:37AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 25న ఇజ్రాయెల్‌లో ఒక ప్రదర్శనను తిలకించారుఈ సందర్భంగా ఆయన వెంట ఇజ్రాయెల్ ప్రధాని శ్రీ బెంజమిన్ నెతన్యాహూ ఉన్నారువివిధ రంగాల్లో ఇజ్రాయెల్ మార్గదర్శక నవకల్పనలను ఈ ఎగ్జిబిషన్లో కళ్లకు కట్టారువ్యవసాయ సంబంధిత సాంకేతికతజల సాంకేతికతవాతావరణ సాంకేతికతఆరోగ్య రంగ సాంకేతికతస్మార్ట్ మొబిలిటీకృత్రిమ మేధసైబర్ భద్రతక్వాంటమ్ సాంకేతిక రంగాలకు చెందిన అగ్రగామి కంపెనీలూపరిశోధన సంస్థలూ ప్రదర్శనలో పాలుపంచుకున్నాయి.
భారత్-ఇజ్రాయెల్ ద్వైపాక్షిక సంబంధాల్లో నవకల్పనసాంకేతిక భాగస్వామ్యం ఒక ప్రధానమైన పాత్రను పోషిస్తున్నదిరెండు దేశాలూ ‘‘భారత్-ఇజ్రాయెల్ నవకల్పన వారధి’’ కార్యక్రమం సాయంతోఆధునిక సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడానికి కలిసి పనిచేస్తున్నాయిప్రదర్శనను ప్రధానమంత్రి సందర్శించిన సందర్బంగాకింద ప్రస్తావించిన కంపెనీలుసంస్థలకు చెందిన శాస్త్రవేత్తలుసాంకేతిక రంగ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుముఖ్య కార్యనిర్వహణ అధికారులతో మాట్లాడారు:
        • 
క్వాంటమ్డీప్ టెక్క్వాంటమ్ మెషీన్స్ ఆధ్వర్యంలోని ఇజ్రాయెలీ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ (ఐక్యూసీసీగురించీ,  క్లాసిక్ ఆధ్వర్యంలో క్వాంటమ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంటును సరళతరం చేయడం గురించీ ఈ ఎగ్జిబిషన్‌లో ప్రధానమంత్రి‌కి వివరించారు
.
        •  
హెల్త్-టెక్ఏఐకృత్రిమ మేధ (ఏఐఆధారితంగా రూపొందించిన పాయింట్-ఆఫ్-కేర్ అల్ట్రాసౌండ్‌ను అంకుర సంస్థ ఏఐఎస్ఏపీ ప్రదర్శించిందిఇది వాస్తవిక సమయంలో రోగనిర్ధారణ సంబంధిత మార్గదర్శనాన్ని అందిస్తుందివ్యూహాత్మక నష్టభయాన్ని గుర్తించడంతో పాటు విశ్లేషణ కోసం ఉద్దేశించిన ఏఐ ఆధారిత ఉపకరణం ‘టెక్ స్కౌట్’’ను ఇజ్రాయెల్ సైన్స్టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన హొరైజన్ స్కానింగ్ విభాగం పరిచయం చేసింది.
        •  
స్మార్ట్ మొబిలిటీమొబైల్ఐ పేరుతో ఏర్పాటైన ఒక సాంకేతిక కంపెనీ.. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి తాను రూపొందించిన సెన్సర్‌నీచిప్ సాంకేతికతనీ ప్రదర్శించింది.
        •  
సైబర్ భద్రతచెక్ పాయింట్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ సంస్థ తాను రూపొందించిన ఆధునిక ఆపద నివారణ పరిష్కారాల్ని గురించి వివరించడంతో పాటు భారత్‌లో తాను అందిస్తున్న సహకారం తీరుతెన్నులను తెలియజేసింది.
        •  
నీరువ్యవసాయంఈ విభాగంలో ప్రదర్శించిన పరిష్కారాల్లో.. సుస్థిర అభివృద్ది రంగంలో నవకల్పనపై దృష్టి కేంద్రీకరించారుగాలి నుంచి తాగునీటిని తయారు చేసే తన సాంకేతికతను వాటర్‌జెన్ ప్రదర్శించిందిగురుత్వాకర్షణ ఆధారిత సూక్ష్మ సేద్య వ్యవస్థలను ఎన్-డ్రిప్ ప్రదర్శించిందివిద్యుచ్ఛక్తి సాయం తీసుకోకుండానే ఆహార వ్యర్థాల్ని తగ్గించడానికి ఉద్దేశించిన పంట కోత తరువాతి కాలంలో అమలు చేయదగ్గ పరిష్కారాల్ని నేచురల్ ఆఫ్‌సెట్ ఫార్మింగ్ (ఎన్ఓఎఫ్ఆవిష్కరించింది.
        • 
వాతావరణంబయో-టెక్:  ప్రయోగశాలలో తయారు చేసే పాల ప్రొటీన్ల విషయంలో అనుసరించాల్సిన పులియబెట్టే చర్యను  రీమిల్క్ ప్రదర్శించిందిమెషీన్ లర్నింగ్-ఇంటిగ్రేటెడ్ మైక్రోఆల్గే కల్టివేషన్ పద్ధతిని బార్‌ఆల్గే ప్రదర్శించిందిప్లాస్టిక్ వ్యర్థాల్ని నిర్వహించేందుకు స్పెషలై‌జ్డ్ బయో-కన్వర్షన్ యాడిటివ్‌లను ఉపయోగించే పద్దతిని ‘మైనోరా బయో’ ప్రదర్శించింది.
        • 
ఇంధనంప్రాకృతిక వనరులుఖనిజ వనరుల పరిమాణ నిర్ధారణకు ఉద్దేశించిన అధిక స్పష్టతతో కూడిన మాడలింగును జియోఫిజికల్ ఇనిస్టిట్యూట్ (జీఐఐప్రదర్శించింది.
        • 
అంతరిక్షంబుల్లి కమ్యూనికేషన్స్ శాటిలైట్లతో పాటు ఏకీకృత సింథటిక్ ఎపర్చర్ రాడార్ (ఎస్ఏఆర్)ను ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ప్రదర్శించింది.
నూతన ఆవిష్కర్తలతో ప్రధానమంత్రి ముచ్చటించారుఈ సందర్భంగా ఆయన.. ప్రదర్శనకు పెట్టిన అత్యాధునిక సాంకేతికతలలో.. భారత్-ఇజ్రాయెల్ నవకల్పనఅంకుర సంస్థలువాణిజ్య భాగస్వామ్యాలను ప్రోత్సహించేందుకుమరీ ముఖ్యంగా వ్యవసాయంనీటి నిర్వహణఆరోగ్యసంరక్షణ సేవలుడిజిటల్ సేవల వంటి రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నట్లు గమనించారుభారత్‌లో పెట్టుబడి పెట్టేతయారు చేసేసాంకేతిక భాగస్వామ్యాలను నెలకొల్పుకొనేందుకు ఉన్న అవకాశాల్ని తెలుసుకోవాల్సిందిగా కంపెనీలను ప్రధానమంత్రి ఆహ్వానించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2233283) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam