ప్రధాన మంత్రి కార్యాలయం
గొప్ప సామాజిక సంస్కర్త శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్కు నివాళులర్పించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
15 FEB 2026 2:49PM by PIB Hyderabad
మహా సామాజిక సంస్కర్త శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆయనకు ఘన నివాళులర్పించారు. “సత్యం, అహింస, ఉన్నతమైన నైతిక విలువల సందేశాన్ని వ్యాప్తి చేయడం ద్వారా ఆయన సమాజంలో సరికొత్త చైతన్యాన్ని నింపారు. ఆయన స్ఫూర్తిదాయకమైన జీవితం దేశ ప్రజలకు ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తుంది” అని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
"మహా సామాజిక సంస్కర్త శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయనకు నమస్కారాలు. సత్యం, అహింస, ఉన్నతమైన నైతిక విలువల సందేశాన్ని అందిస్తూ ఆయన సమాజంలో నవచేతనను రగిలించారు. వారి ప్రేరణాత్మక జీవితం దేశప్రజలను ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తూనే ఉంటుంది.
జై సేవాలాల్!"
(రిలీజ్ ఐడి: 2228476)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9