ప్రధాన మంత్రి కార్యాలయం
హెరాత్ పోష్టే సందర్భంగా కాశ్మీరీ పండిట్లకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
15 FEB 2026 8:30AM by PIB Hyderabad
కాశ్మీరీ పండిట్ల గొప్ప సంప్రదాయాలను ప్రతిబింబించే పవిత్ర పండగ హెరాత్ పోష్టే సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. “ఈ పవిత్ర సందర్భంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో శ్రేయస్సు, సమృద్ధి కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఇది విజయానికి కొత్త మార్గాలను తెరుస్తుంది. ప్రతి ఇంటినీ ఆనందంతో, సంతృప్తితో నింపుతుంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“హెరాత్ పోష్టే!
ఈ పవిత్ర పండగ మన కాశ్మీరీ పండిట్ల గొప్ప సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది.
ఈ పవిత్ర సందర్భంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో శ్రేయస్సు, సమృద్ధి కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఇది విజయానికి కొత్త మార్గాలను తెరుస్తుంది. ప్రతి ఇంటినీ ఆనందంతో, సంతృప్తితో నింపుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2228340)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3